Political News

తగ్గని బీఆర్ఎస్ ఎమ్మెల్యే.. కేసీఆర్ నిర్ణయంపైనే విమర్శ!

రాబోయే తెలంగాణ ఎన్నికల కోసం ఒకేసారి 115 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాష్ట్రంలో పొలిటికల్ హీట్ రాజేశారు. కొన్ని స్థానాల్లో సిట్టింగ్ లకు పక్కనపెట్టిన కేసీఆర్.. మరో నాలుగు స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించకుండా పెండింగ్ లో పెట్టారు. ఓ వైపు టికెట్ దక్కని నేతల నుంచి వచ్చిన అసమ్మతిని నెమ్మదిగా తగ్గించుకుంటూ వస్తున్నారు. మరోవైపు ఆ నాలుగు నియోజకవర్గాల్లో మాత్రం టికెట్ల కోసం బీఆర్ఎస్ నేతల మధ్య హోరాహోరీ పోరు నడుస్తుందనే చెప్పాలి. ముఖ్యంగా మెదక్ లోని నర్సాపూర్ నియోజకవర్గంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ సిట్టింగ్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి తనకే టికెట్ దక్కుతుందనే నమ్మకంతో ఉన్నారు.

నర్సాపూర్ నియోజకవర్గాన్ని వదిలేదే లేదని మదన్ రెడ్డి కుండ బద్ధలు కొడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా పోటీ చేస్తానని స్వయంగా ఆయనే ప్రకటించుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ నిర్ణయాన్ని విమర్శించేలా మదన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. 115 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్.. నాలుగు నియోజకవర్గాల టికెట్లను పెండింగ్ లో పెట్టడం సరికాదని మదన్ రెడ్డి వ్యాఖ్యానించారు. నర్సాపూర్ లో టికెట్ ప్రకటించకపోవడంపై అసంత్రుప్తి వ్యక్తం చేశారు.

అయితే ఏది ఏమైనా మరోసారి తానే ఎమ్మెల్యేనని మదన్ రెడ్డి ప్రకటించుకోడం గమనార్హం. ఎవరు పోటీకి వచ్చినా వెనక్కి తగ్గేదేలేదని స్పష్టం చేశారు. మరో 15 రోజుల్లో 20 వేల మంది కార్యకర్తలతో భారీ బహిరంగ సభ కూడా పెడతానని చెప్పారు. నర్సాపూర్ టికెట్ కోసం మాజీ మంత్రి, రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ విషయంపై ఇప్పటికే కేసీఆర్ ను ఆమె కలిసినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే టికెట్ తనకే రావాలనే గట్టి పట్టుదలతో మదన్ రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని టాక్.

This post was last modified on September 17, 2023 9:26 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

4 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

4 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

4 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

5 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

7 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

8 hours ago