Political News

తగ్గని బీఆర్ఎస్ ఎమ్మెల్యే.. కేసీఆర్ నిర్ణయంపైనే విమర్శ!

రాబోయే తెలంగాణ ఎన్నికల కోసం ఒకేసారి 115 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాష్ట్రంలో పొలిటికల్ హీట్ రాజేశారు. కొన్ని స్థానాల్లో సిట్టింగ్ లకు పక్కనపెట్టిన కేసీఆర్.. మరో నాలుగు స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించకుండా పెండింగ్ లో పెట్టారు. ఓ వైపు టికెట్ దక్కని నేతల నుంచి వచ్చిన అసమ్మతిని నెమ్మదిగా తగ్గించుకుంటూ వస్తున్నారు. మరోవైపు ఆ నాలుగు నియోజకవర్గాల్లో మాత్రం టికెట్ల కోసం బీఆర్ఎస్ నేతల మధ్య హోరాహోరీ పోరు నడుస్తుందనే చెప్పాలి. ముఖ్యంగా మెదక్ లోని నర్సాపూర్ నియోజకవర్గంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ సిట్టింగ్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి తనకే టికెట్ దక్కుతుందనే నమ్మకంతో ఉన్నారు.

నర్సాపూర్ నియోజకవర్గాన్ని వదిలేదే లేదని మదన్ రెడ్డి కుండ బద్ధలు కొడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా పోటీ చేస్తానని స్వయంగా ఆయనే ప్రకటించుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ నిర్ణయాన్ని విమర్శించేలా మదన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. 115 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్.. నాలుగు నియోజకవర్గాల టికెట్లను పెండింగ్ లో పెట్టడం సరికాదని మదన్ రెడ్డి వ్యాఖ్యానించారు. నర్సాపూర్ లో టికెట్ ప్రకటించకపోవడంపై అసంత్రుప్తి వ్యక్తం చేశారు.

అయితే ఏది ఏమైనా మరోసారి తానే ఎమ్మెల్యేనని మదన్ రెడ్డి ప్రకటించుకోడం గమనార్హం. ఎవరు పోటీకి వచ్చినా వెనక్కి తగ్గేదేలేదని స్పష్టం చేశారు. మరో 15 రోజుల్లో 20 వేల మంది కార్యకర్తలతో భారీ బహిరంగ సభ కూడా పెడతానని చెప్పారు. నర్సాపూర్ టికెట్ కోసం మాజీ మంత్రి, రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ విషయంపై ఇప్పటికే కేసీఆర్ ను ఆమె కలిసినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే టికెట్ తనకే రావాలనే గట్టి పట్టుదలతో మదన్ రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని టాక్.

This post was last modified on September 17, 2023 9:26 am

Share

Recent Posts

డిజాస్టర్ తాత సినిమాకు సీక్వెల్ వస్తోందా

లోక నాయకుడు కమల్ హాసన్, లెజెండరీ దర్శకుడు శంకర్ కాంబోలో వచ్చిన ఇండియన్ 2 / భారతీయుడు 2 డిజాస్టర్…

1 hour ago

అమెరికా సైతం ఉచితాల బాట‌… భార‌త్‌ను చూసి నేర్చిందా?!

ఎన్నిక‌ల స‌మ‌యంలో ఉచిత ప‌థ‌కాలు ప్ర‌క‌టించే దేశం ఏది అని అడిగితే.. ఠ‌క్కున చెప్పే పేరు భార‌త్‌. రాష్ట్రాల అసెంబ్లీల…

2 hours ago

జగన్ బీజేపీని కూడా టార్గెట్ చేస్తున్నారండోయ్…

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ఎప్పుడూ పల్లెత్తు మాట అనడానికి కూడా వెనకాడే జగన్.. ఇప్పుడు తన గొంతు పెంచారు.…

2 hours ago

గోపీచంద్ సౌండ్ చేయడం లేదెందుకు

మాచో స్టార్ గా ఒకప్పుడు మాస్ మార్కెట్ ని బాగా ఎంజాయ్ చేసిన హీరో గోపిచంద్. విలన్ గా కెరీర్…

2 hours ago

సామజిక చైతన్యం వైపు అల్లు అర్జున్ అభిమానులు

సాధారణంగా అభిమాన సంఘాలంటే కొత్త సినిమాల విడుదల, సంబరాలు, పుట్టినరోజు వేడుకలకే పరిమితమవుతుంటాయి. అయితే, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్…

4 hours ago

కోర్టులను అనుమానిస్తున్నారా జగన్?

న్యాయస్థానాలపై, న్యాయమూర్తుల విషయంలో వైసీపీ అధినేత జగన్ తీరు గతంలో తీవ్రస్థాయిలో విమర్శలకు తావిచ్చిన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు…

4 hours ago