దేశంలో జమిలి ఎన్నికల నిర్వహణకు కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే. దీనిపై అధ్యయనానికి ఇప్పటికే మాజీ రాష్ట్రపతి నేతృత్వంలో ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసింది. అయితే.. జమిలి ఎన్నికలపై పలు పార్టీల నుంచి భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీని ప్రత్యక్షంగా, పరోక్షంగా సమర్థిస్తున్న పార్టీలు, నేతలు జమిలికి మద్దతిచ్చిన విషయం తెలిసిందే. అయితే.. తాజాగా ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ మాత్రం జమిలి ఎన్నికలకు నో చెప్పింది.
కాంగ్రెస్ పార్టీ జమిలి ఎన్నికల ప్రతిపాదనను తిరస్కరిస్తోందని ఆ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి చిదంబరం ప్రకటించారు. జమిలి ఎన్నికలు నిర్వహించటం అంటే రాష్ట్రాల హక్కులను అణచివేయటమేనన్నారు. అంతేకాదు, జమిలి ఎన్నికలు నిర్వహించాలంటే.. పలు రాజ్యాంగ సవరణలు అవసరమని తెలిపారు. దీనికి సంబంధించి కేంద్రంలోని మోడీ సర్కారుకు పార్లమెంటులో తగిన సంఖ్యా బలం లేదన్నారు. ఈ క్రమంలో జమిలి ప్రతిపాదన వృథా ప్రయాసేనని తేల్చి చెప్పారు.
హైదరాబాద్లో జరుగుతున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో పలు అంశాలపై నాయకులు చర్చించారు. ఆ విశేషాలను చిదంబరం మీడియాకు వివరించారు. ఇండియా కూటమిని బలోపేతం చేయాలని సభ్యులు అభిప్రాయపడ్డారని, వీలైనంత వేగంగా సీట్ల సర్దుబాటు ఖరారు కావాలని చిదంబరం పేర్కొన్నారు. త్వరలో ఎన్నికలు జరగనున్న5 రాష్ట్రాలలో పార్టీ పరిస్ధితి ఆశాజనకంగా ఉందన్నారు.
సీడబ్ల్యూ సీ భేటీలో చర్చించిన విషయాలు ఇవీ..
This post was last modified on September 16, 2023 10:11 pm
ఎప్స్టీన్ ఫైల్స్.. ఇప్పుడు ప్రపంచాన్ని కుదిపేస్తున్న మాట. ఎప్స్టీన్ అనే అమెరికన్ వ్యాపారవేత్త.. తాను ఇచ్చే ప్రైవేట్ పార్టీలకు ఎంతోమంది…
తెలంగాణలో జరుగుతున్న మునిసిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రచారం చేసేందుకు వీలుగా అధికార కాంగ్రెస్ పార్టీ కొన్ని కమిటీలను నియమించింది. మరో…
ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్పై.. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు భగ్గుమన్నారు. పవన్ కల్యాణ్ కాదు.. దిష్టి…
ఒకే హీరో రెండు సినిమాలు ఒకే టైంలో రిలీజ్ కు రెడీ కావడమంత సంకట పరిస్థితి మరొకటి ఉండదు. గతంలో…
సినీ రంగంలోకి కాస్త పేరు తెచ్చుకున్న ఎవ్వరైనా.. మళ్లీ జన్మంటూ ఉంటే ఇలా పుట్టాలని కోరుకోను అన్నారంటే ఆశ్చర్యపోవాల్సిందే. ముఖ్యంగా…
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా కూటమి…