దేశంలో జమిలి ఎన్నికల నిర్వహణకు కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే. దీనిపై అధ్యయనానికి ఇప్పటికే మాజీ రాష్ట్రపతి నేతృత్వంలో ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసింది. అయితే.. జమిలి ఎన్నికలపై పలు పార్టీల నుంచి భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీని ప్రత్యక్షంగా, పరోక్షంగా సమర్థిస్తున్న పార్టీలు, నేతలు జమిలికి మద్దతిచ్చిన విషయం తెలిసిందే. అయితే.. తాజాగా ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ మాత్రం జమిలి ఎన్నికలకు నో చెప్పింది.
కాంగ్రెస్ పార్టీ జమిలి ఎన్నికల ప్రతిపాదనను తిరస్కరిస్తోందని ఆ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి చిదంబరం ప్రకటించారు. జమిలి ఎన్నికలు నిర్వహించటం అంటే రాష్ట్రాల హక్కులను అణచివేయటమేనన్నారు. అంతేకాదు, జమిలి ఎన్నికలు నిర్వహించాలంటే.. పలు రాజ్యాంగ సవరణలు అవసరమని తెలిపారు. దీనికి సంబంధించి కేంద్రంలోని మోడీ సర్కారుకు పార్లమెంటులో తగిన సంఖ్యా బలం లేదన్నారు. ఈ క్రమంలో జమిలి ప్రతిపాదన వృథా ప్రయాసేనని తేల్చి చెప్పారు.
హైదరాబాద్లో జరుగుతున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో పలు అంశాలపై నాయకులు చర్చించారు. ఆ విశేషాలను చిదంబరం మీడియాకు వివరించారు. ఇండియా కూటమిని బలోపేతం చేయాలని సభ్యులు అభిప్రాయపడ్డారని, వీలైనంత వేగంగా సీట్ల సర్దుబాటు ఖరారు కావాలని చిదంబరం పేర్కొన్నారు. త్వరలో ఎన్నికలు జరగనున్న5 రాష్ట్రాలలో పార్టీ పరిస్ధితి ఆశాజనకంగా ఉందన్నారు.
సీడబ్ల్యూ సీ భేటీలో చర్చించిన విషయాలు ఇవీ..
This post was last modified on September 16, 2023 10:11 pm
థియేటర్లో ఆడిన ఎంత పెద్ద హిట్ సినిమాలనైనా టికెట్లు కొని చూడని ప్రేక్షకులు బోలెడు ఉంటారు. వాళ్లకు ఒకప్పుడు శాటిలైట్…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తో పాటు ఆయన పెద్ద అన్నయ్య, మెగాస్టార్ చిరంజీవి దంపతులు…
వైసీపీ కీలక నేత, హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ కు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో…
ఆ పోలీసు అధికారులందరికీ చెబుతున్నా…వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే వారిని బట్టలూడదీసి నిలబెడతా అంటూ మాజీ సీఎం జగన్ చేసిన…
ఐపీఎల్ 2025 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ మరోసారి ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. కెప్టెన్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న రుతురాజ్ గైక్వాడ్కు…
నిజమే… నిన్నటిదాకా ఏపీలో ఎవరిపై ఎవరైనా నోరు పారేసుకున్నారు. అసలు అవతలి వ్యక్తులు తమకు సంబంధించిన వారా? లేదా? అన్న…