ఆ బీజేపీ మహిళా నాయకురాలు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. ఇంతలోనే అనుకోని వరంలా హైకోర్టు తీర్పు వచ్చింది. ఆమెనే ఎమ్మెల్యే అని కోర్టు ప్రకటించింది. దీంతో ఎన్నికల లోపే ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసి.. పదవిలో ఉంటూ పోటీ చేయాలనుకున్నారు. ఆ దిశగా అన్ని ప్రయత్నాలు చేశారు. కానీ సుప్రీం కోర్టు స్టేతో ఆమె ఆశలపై నీళ్లు పడ్డాయి. ఆ నాయకురాలే.. డీకే అరుణ. సుప్రీం కోర్టు స్టేతో నిరాశలో ఆమె మునిగిపోయారు.
2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గద్వాల నుంచి కాంగ్రెస్ తరపున డీకే అరుణ పోటీ చేశారు. కానీ అప్పటి టీఆర్ఎస్ (ఇప్పుడు బీఆర్ఎస్) అభ్యర్థి క్రిష్ణమోహన్ రెడ్డి చేతిలో 28 వేలకు పైగా ఓట్ల తేడాతో ఓడిపోయారు. కానీ ఎన్నికల అఫిడవిట్లో క్రిష్ణమోహన్ తప్పుడు సమాచారం ఇచ్చారని డీకే అరుణ ఫిర్యాదు చేశారు. ఆస్తుల సమాచారాన్ని దాచి పెట్టారని అరుణ ఆరోపించారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు ఇటీవల క్రిష్ణమోహన్ రెడ్డి ఎన్నిక చెల్లదంటూ తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యేగా డీకే అరుణను ప్రకటించాలని ఆదేశించింది.
హైకోర్టు తీర్పు నేపథ్యంలో డీకే అరుణ వెంటనే రంగంలోకి దిగారు. ప్రస్తుతం బీజేపీలో ఉన్న ఆమె.. తనను ఎమ్మెల్యేగా గుర్తించాలంటూ అసెంబ్లీ కార్యదర్శిని కోరారు. అంతే కాకుండా హైకోర్టు తీర్పును అసెంబ్లీ కార్యదర్శి అమలు చేయడం లేదంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేశారు. హైకోర్టు ఉత్తర్వులు తీసుకుని మళ్లీ అసెంబ్లీకి వెళ్లారు. ఎన్నికలకు ముందే ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయాలనే పట్టుదల ప్రదర్శించారు. కానీ ఇప్పుడు హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టు స్టే విధించడంతో డీకే అరుణకు నిరాశ ఎదురైంది. ఇప్పుడు సుప్రీం కోర్టులో విచారణ జరిగి, తీర్పు వచ్చే లోగా అసెంబ్లీ ఎన్నికలు ముగిసే ఆస్కారముంది. అందుకే డీకే అరుణ ఆశ నెరవేరుతుందనే పరిస్థితులు లేవనే చెప్పాలి.
This post was last modified on September 12, 2023 7:32 pm
తమిళంలో సూపర్ స్టార్ రజినీకాంత్ ఎన్నో ఏళ్ల పాటు నంబర్ వన్ హీరోగా కొనసాగారు. రజినీ ఉండగా ఆయన్ని మించే స్టార్ రాబోడని అంతా…
చిరంజీవి పుట్టినరోజు ఇంకో ఆరు రోజుల్లో రానుంది. రెండు కీలక అప్డేట్స్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. మెగా 158…
ఇంకో పది రోజుల్లో టాక్సిక్ విడుదల కానుంది. కెజిఎఫ్ తర్వాత సుమారు నాలుగేళ్ల విలువైన కాలాన్ని దీని కోసమే ఖర్చు…
ఏపీలో వచ్చే సెప్టెంబరులో నిర్వహించాలని భావిస్తున్న స్థానిక సంస్థల ఎన్నికలను బ్యాలెట్ విధానంలోనే నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. దీంతో…
తెలంగాణాలో స్థానిక ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య విమర్శలు జోరందుకుంటున్నాయి. దీంతో రాజకీయ వేడి రాజుకుంటుంది.…
విజయనగరం జిల్లాలోని భోగాపురంలో అధునాతన వసతులతో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం కార్యకలాపాలు ఆదివారం అర్ధరాత్రి…