Political News

ఢిల్లీకి జగన్

లండన్ నుండి తిరిగివచ్చిన జగన్మోహన్ రెడ్డి బుధవారం సాయంత్రం ఢిల్లీకి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వారంరోజుల లండన్ పర్యటన నుండి జగన్ దంపుతులు సోమవారం అర్ధరాత్రి విజయవాడ చేరుకున్నారు. ఈరోజు ఉన్నతాధికారులతోను, ముఖ్యనేతలతోను జరుగుతున్న పరిణామాలపై సమీక్షిస్తారు. తర్వాత బుధవారం ఢిల్లీకి వెళ్ళబోతున్నారు. చంద్రబాబునాయుడు అరెస్టు, తర్వాత పరిణామాలతో పాటు పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో ప్రవేశపెట్టబోయే బిల్లులపై ఢిల్లీ పెద్దలతో జగన్ చర్చిస్తారని పార్టీవర్గాలు చెప్పాయి.

జమిలి ఎన్నికలు, ముందస్తు ఎన్నికలే కీలకం అంశాలుగా చెబుతున్నారు. నరేంద్రమోడి, అమిత్ షా తో భేటీ ఉండబోతోందని సమాచారం. బుధ, గురువారాల్లో జగన్ ఢిల్లీలోనే ఉండబోతున్నట్లు పార్టీవర్గాలు చెప్పాయి. జమిలి ఎన్నికలు ఖాయమైతే ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ విషయాలపై జగన్ ఎక్కువగా దృష్టిపెట్టే అవకాశముంది. ఇక చంద్రబాబు అరెస్టుపైన కూడా మోడీ, అమిత్ షా కు బ్రీఫింగ్ ఇచ్చే అవకాశముందని సమాచారం.

జమిలి ఎన్నికలపైన ముందస్తు ఎన్నికలపైన ఇప్పటికే పార్టీలోని ముఖ్యనేతలకు జగన్ సంకేతాలు  ఇచ్చినట్లు ప్రచారంలో ఉంది. దానికి ఢిల్లీ టూర్లో పూర్తి క్లారిటి వస్తుందని నేతలంతా అనుకుంటున్నారు. ఇప్పటివరకు ఎన్డీయేకి మద్దతు ఇస్తున్న జగన్ ఇక ముందు కూడా మద్దతు ఇస్తారనటంలో సందేహంలేదు. 18వ తేదీన మొదలై 22వ తేదీన ముగిసే ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు చాలా ప్రాధాన్యత వహించబోతున్నాయి. కామన్ సివిల్ కోడ్, వన్ నేషన్ వన్ యాక్ట్ లాంటి కీలక బిల్లులను మోడీ ప్రభుత్వం ప్రవేశపెడుతోందనే ప్రచారం అందరికీ తెలిసిందే.

ఇంతటి కీలకబిల్లులు పార్లమెంటులో పాస్ అవ్వాలంటే జగన్ మద్దతు ఎన్డీయే ప్రభుత్వానికి చాలా అవసరం. లండన్ వెళ్ళేముందు మోడీ, అమిత్ షా అపాయిట్మెంట్లను జగన్ తీసుకున్నట్లు పార్టీవర్గాలు చెబుతున్నాయి. కాబట్టి రెండురోజుల ఢిల్లీ పర్యటన చాలా కీలకమనే చెప్పాలి. మరి ఢిల్లీ పర్యటన అనంతర పరిణామాలు ఎలాగుంటాయో అనే ఆసక్తి అందరిలోను పెరిగిపోతోంది. ఏదేమైనా చంద్రబాబు అరెస్టు, రిమాండు నేపధ్యంలో తలెత్తిన పరిణామాలను జగన్ ఎలా హ్యాండిల్ చేస్తారో చూడాలి. 

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయితే రచ్చే

రేపు రాత్రి ప్రీమియర్లతో విడుదల కాబోతున్న మన శంకరవరప్రసాద్ గారు మీద ఆల్రెడీ ఉన్న బజ్ మరింత పెరిగే దిశగా…

1 hour ago

ప్రతిచోట చీపురు పట్టుకొని పవన్ ఊడవాలా?

పాలన అంటే కార్యాలయాల్లో కూర్చుని సమీక్షలు చేయడమే కాదు. ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను ప్రత్యక్షంగా చూడడమే నిజమైన…

4 hours ago

విమర్శకులను పనితీరుతో కొడుతున్న లోకేష్..!

తనపై విమర్శలు చేసే వారిని సహజంగా ఎవరైనా ప్రతివిమర్శలతో ఎదుర్కొంటారు. మాటకు మాట అంటారు. ఇక రాజకీయాల్లో అయితే ఈ…

5 hours ago

రండి.. కూర్చుని మాట్లాడుకుందాం: ఏపీకి రేవంత్ రెడ్డి పిలుపు

ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలపై యాగీ చేసుకోకుండా కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలంగాణ…

5 hours ago

షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?

టీమ్ ఇండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ ఇంటర్నేషనల్ కెరీర్ దాదాపు ముగింపు దశకు చేరుకున్నట్లే కనిపిస్తోంది. గతేడాది జరిగిన…

6 hours ago

‘వైసీపీ చేసిన పాపాలను కడుగుతున్నాం’

రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…

14 hours ago