Political News

చంద్రబాబుకు సీఐడీ మరో షాక్?

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో కేసులో 14 రోజుల పాటు జ్యుడీషియల్ రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఏసీబీ కోర్టులో ఈరోజు ఆయన హౌస్ అరెస్ట్ పిటిషన్ పై విచారణ జరగనుంది. ఇప్పటికే చంద్రబాబు అరెస్టు, రిమాండ్ వ్యవహారాలతో షాక్ లో ఉన్న టిడిపి శ్రేణులకు తాజాగా ఏపీ సిఐడి అధికారులు మరో షాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. విజయవాడలో ఏసీబీ కోర్టులో అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అవకతవకల వ్యవహారంలో చంద్రబాబును విచారణ జరపాలంటూ మరో పిటిషన్ ను సిఐడి అధికారులు దాఖలు చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే పీటీ వారెంట్ కింద చంద్రబాబును విచారణ జరిపేందుకు అనుమతినివ్వాలని పిటిషన్ వేయబోతోందని తెలుస్తోంది.

ఓ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్నవారిని మరో కేసులో విచారణ జరిపేందుకు పీటీ వారెంట్ (ప్రిజనర్ ఇన్ ట్రాన్సిట్) రూపంలో పిటిషన్ వేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇవాళే ఆ పిటిషన్ వేస్తే, రేపు విచారణ జరిగే అవకాశముంటుంది. 2022లో అమరావతి ఇన్నర్ రింగు రోడ్డు అలైన్ మెంట్ లో అవకతవకలు జరిగాయని సీఐడీ కేసు నమోదుచేసింది. ఈ కేసులో భారీ భూ కుంభకోణం జరిగిందని ఆరోపణలు వచ్చాయి. అప్పటి టీడీపీ ప్రభుత్వం రింగ్ రోడ్ ఎలైన్‌మెంట్ మార్చిందని,ముందే స్థలాలు కొనేసి ఆ మార్గంలో రింగ్ రోడ్ వచ్చేలా టీడీపీ నేతలు ప్లాన్ చేశారని ఆరోపణలున్నాయి.

2014లో ఏపీ పురపాలక శాఖా మంత్రిగా ఉన్న నారాయణ ఆ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. నారాయణ వెనుక చంద్రబాబు ఉన్నారని, విచారణ జరపాలని సీఐడీ భావిస్తోందని తెలుస్తోంది. ఈ కేసులో సీఐడీ ఆల్రెడీ దర్యాప్తు పూర్తి చేసి నివేదికను కోర్టుకు సమర్పించింది. అయితే, హైకోర్టు నుంచి నిందితులు స్టే ఆర్డర్ తెచ్చుకోవడంతో తీర్పు రిజర్వులో ఉంది. ఈ కేసులో ఇప్పటివరకూ చంద్రబాబును ఒక్కసారి కూడా ప్రశ్నించలేదు.

This post was last modified on September 11, 2023 2:29 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

బాలయ్య బ్యాక్ టు డ్యూటీ

ఎన్నికలు అయిపోయాయి. ఫలితాలు ఇంకో పద్దెనిమిది రోజుల్లో రాబోతున్నాయి. ఎవరికి వారు విజయం పట్ల ధీమాగా ఉన్నారు. అధికార పార్టీ,…

8 mins ago

పూజా హెగ్డే కోరుకున్న బ్రేక్ దొరికింది

మొన్నటిదాకా టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా అత్యధిక డిమాండ్ అనుభవించిన పూజా హెగ్డే కెరీర్ ప్రారంభంలో వచ్చిన ఐరన్ లెగ్…

2 hours ago

ఆమంచి .. ఎవరి ‘కొంప’ ముంచేనో ?!

ప్రకాశం జిల్లాలో ఆమంచి కృష్ణమోహన్ రాజకీయంగా ఒక బలమైన నాయకుడే అని చెప్పాలి. అయితే తన రాజకీయ భవిష్యత్తు కోసం…

2 hours ago

అమెరికాలో వెంటాడిన మృత్యువు

తెలంగాణలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనందిత రెండు ప్రమాదాలు తప్పించుకుని మూడో ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. నెలల వ్యవధిలో…

3 hours ago

కోర్టు మెట్లెక్కిన జూనియర్  !

ప్రముఖ హీరో జూనియర్ ఎన్టీఆర్ 2003లో జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలో  681 చదరపు గజాల స్థలం సుంకు గీత అనే…

3 hours ago

ప్రభాస్ ఊరిస్తోంది దేని గురించంటే

ఒక్క చిన్న ఇన్స్ టా పోస్ట్ తో ప్రభాస్ సోషల్ మీడియాని ఊపేస్తున్నాడు. హలో డార్లింగ్స్ చివరికి చాలా ప్రత్యేకం…

3 hours ago