టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి అరెస్టు, రిమాండ్ విషయంపై మాజీ ఐఏఎస్ రమేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు. స్కిల్ డెవలప్మెంట్ కేసుపై ఆయన మాట్లాడుతూ.. సీఐడీ తీరుపై అనుమానం వ్యక్తం చేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆర్థిక శాఖ ఉన్నతాధికారిగా పీవీ రమేశ్ పని చేశారు. ఈ నేపథ్యంలో స్కిల్ డెవలప్మెంట్ కేసులో గతంలో రమేశ్ వాంగ్మూలాన్ని సీఐడీ నమోదు చేసింది. సీఐడీకి ఆయన లిఖిత పూర్వక సమాధానాలిచ్చారు.
ఇప్పుడు రమేశ్ స్టేట్ మెంట్ ఆధారంగానే చంద్రబాబు నాయుడి మీద సీఐడీ కేసు పెట్టిందని మీడియాలో, సామాజిక మాధ్యమాల్లో ప్రచారం సాగుతోంది. తాజాగా ఈ ప్రచారాన్ని రమేశ్ ఖండించారు. తన స్టేట్ మెంట్ ఆధారంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి మీద సీఐడీ కేసు పెట్టిందనడం అవాస్తమని, నిరాధారమని రమేశ్ పేర్కొన్నారు. ఇంకా ఆయన ఏమన్నారంటే.. “నా స్టేట్ మెంట్ ఆధారంగానే మాజీ సీఎం చంద్రబాబు నాయుడిపై సీఐడీ కేసు పెట్టిందనడం నిరాధారం. ఇది షాకింగ్ గా ఉంది. నా వాంగ్మూలంతో చంద్రబాబును అరెస్టు చేశారనడం హాస్యాస్పదం. అలాగే నేను అప్రూవర్గా మారాననే ప్రచారంలోనూ నిజం లేదు.
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో యువతకు నైపుణ్యాలు అందించాలనే ఉద్దేశంలో స్కిల్ డెవలప్మెంట్ ప్రాజక్టె కోసం ముందుకొచ్చారు. స్కిల్ డెవలప్మెంట్లో ఆర్థిక శాఖ ఎలాంటి తప్పు చేయలేదు. సీఐడీ తీరుపై నాకు అనుమానం కలుగుతోంది. అసలు ఫైలే లేకుండా కేసులు ఎలా పెడతారు? నేను చెప్పింది సీఐడీ తనకు అనుకూలంగా మార్చుకుందని నా అనుమానం. నిధులు విడుదల చేసిన వాళ్లలో కొందరి పేర్లు కేసులో లేవు. స్కిల్ డెవలప్మెంట్ ఎండీ, కార్యదర్శిల పేర్లు ఎందుకు లేవు. వీళ్ల పాత్రే ప్రధానం” అని పీవీ రమేశ్ పేర్కొన్నారు.
This post was last modified on September 11, 2023 2:06 pm
అవకాశాలు.. అదృష్టాలు.. పదే పదే రావని అంటారు. అవి వచ్చినప్పుడు వాటిని సద్వినియోగం చేసుకునేందుకు వ్యక్తులైనా పార్టీలైనా.. ఎవరైనా సరే..…
ఐపీఎల్ 2026 సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు అస్సలు కలిసి రావడం లేదు. వరుసగా రెండో ఓటమిని…
ఎన్నికలు సమీపిస్తున్నపుడు కొందరు రాజకీయ నాయకులకు ఎలివేషన్లు ఇస్తూ సినిమాలు వస్తుంటాయి. అలాగే కొందరు నేతలను టార్గెట్ చేస్తూ మూవీస్…
ఏపీ రాజధాని అమరావతిపై సీఎం చంద్రబాబుకు ఉన్న ముందుచూపు, తాజాగా రాజధాని బిల్లును ఆమోదించిన విధానం.. వంటివి చర్చకు వస్తున్నాయి.…
ఏప్రిల్ 8 ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా రేసు గుర్రం రీ రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే.…
కేరళ రాష్ట్రంలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫు స్టార్ క్యాంపెయినర్గా వ్యవహరిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి..…