టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి అరెస్టు, రిమాండ్ విషయంపై మాజీ ఐఏఎస్ రమేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు. స్కిల్ డెవలప్మెంట్ కేసుపై ఆయన మాట్లాడుతూ.. సీఐడీ తీరుపై అనుమానం వ్యక్తం చేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆర్థిక శాఖ ఉన్నతాధికారిగా పీవీ రమేశ్ పని చేశారు. ఈ నేపథ్యంలో స్కిల్ డెవలప్మెంట్ కేసులో గతంలో రమేశ్ వాంగ్మూలాన్ని సీఐడీ నమోదు చేసింది. సీఐడీకి ఆయన లిఖిత పూర్వక సమాధానాలిచ్చారు.
ఇప్పుడు రమేశ్ స్టేట్ మెంట్ ఆధారంగానే చంద్రబాబు నాయుడి మీద సీఐడీ కేసు పెట్టిందని మీడియాలో, సామాజిక మాధ్యమాల్లో ప్రచారం సాగుతోంది. తాజాగా ఈ ప్రచారాన్ని రమేశ్ ఖండించారు. తన స్టేట్ మెంట్ ఆధారంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి మీద సీఐడీ కేసు పెట్టిందనడం అవాస్తమని, నిరాధారమని రమేశ్ పేర్కొన్నారు. ఇంకా ఆయన ఏమన్నారంటే.. “నా స్టేట్ మెంట్ ఆధారంగానే మాజీ సీఎం చంద్రబాబు నాయుడిపై సీఐడీ కేసు పెట్టిందనడం నిరాధారం. ఇది షాకింగ్ గా ఉంది. నా వాంగ్మూలంతో చంద్రబాబును అరెస్టు చేశారనడం హాస్యాస్పదం. అలాగే నేను అప్రూవర్గా మారాననే ప్రచారంలోనూ నిజం లేదు.
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో యువతకు నైపుణ్యాలు అందించాలనే ఉద్దేశంలో స్కిల్ డెవలప్మెంట్ ప్రాజక్టె కోసం ముందుకొచ్చారు. స్కిల్ డెవలప్మెంట్లో ఆర్థిక శాఖ ఎలాంటి తప్పు చేయలేదు. సీఐడీ తీరుపై నాకు అనుమానం కలుగుతోంది. అసలు ఫైలే లేకుండా కేసులు ఎలా పెడతారు? నేను చెప్పింది సీఐడీ తనకు అనుకూలంగా మార్చుకుందని నా అనుమానం. నిధులు విడుదల చేసిన వాళ్లలో కొందరి పేర్లు కేసులో లేవు. స్కిల్ డెవలప్మెంట్ ఎండీ, కార్యదర్శిల పేర్లు ఎందుకు లేవు. వీళ్ల పాత్రే ప్రధానం” అని పీవీ రమేశ్ పేర్కొన్నారు.
This post was last modified on September 11, 2023 2:06 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…