టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఈ కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని సుప్రీం కోర్టు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా ఏసీబీ కోర్టుకు తెలిపారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు తరపున లూథ్రా వాదనలు వినిపిస్తున్నారు. స్కిల్ స్కామ్ రాజకీయ ప్రేరేపితమని ఈ సందర్భంగా లూథ్రా పేర్కొన్నారు. ఈ కేసులో 409 సెక్షన్ పెట్టడం సరికాదని లూథ్రా వాదించారు. సెక్షన్ 409 పెట్టాలంటే ముందు సరైన సాక్ష్యం చూపించాలన్నారు. రిమాండ్ రిపోర్ట్ తిరస్కరించాలంటూ నోటీసు ఇచ్చారు.
లూథ్రా నోటీసు మేరకు తిరస్కరణ వాదనలకు న్యాయమూర్తి అవకాశం కల్పించారు. దీంతో సీఐడీ రిమాండ్ రిపోర్ట్ను తిరస్కరించాలని లూథ్రా కోరారు. ఇక్కడ పంజాబ్ మణిందర్ సింగ్ కేసును లూథ్రా ప్రస్తావించారు. చంద్రబాబు హక్కులకు భంగం కలిగించేలా సీఐడీ పోలీసులు వ్యవహరించారని లూథ్రా పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం 10 నుంచి సీఐడీ అధికారుల ఫోన్ సంభాషణలను కోర్టుకు సమర్పించాలన్నారు. అరెస్టు చేసిన తర్వాత 24 గంటల్లోపు కోర్టులో హాజరు పర్చాలనే నిబంధనను సీఐడీ ఉల్లంఘించిందని లూథ్రా చెప్పారు.
చంద్రబాబు అరెస్టుకు గవర్నర్ అనుమతి కావాలని లూథ్రా న్యాయస్థానానికి తెలిపారు. కానీ సీఐడీ మాత్రం గవర్నర్ అనుమతి తీసుకోలేదని వాదనల సందర్భంగా లూథ్రా చెప్పారు. స్కిల్ స్కామ్ పేరిట కేసులు నమోదు చేయడం రాజకీయ ప్రేరేపితమని లూథ్రా అన్నారు. ఈ కేసులో బాబును ఇరికించాలని చూస్తున్నారని చెప్పారు. ఈ సందర్భంగా 409 సెక్షన్పై కోర్టులో సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. అనంతరం కేసు విచారణకు గంట పాటు భోజన విరామం ప్రకటించారు.
This post was last modified on September 10, 2023 3:56 pm
నేపాల్ ప్రకృతి విపత్తుతో వందలాది మంది ప్రాణాలు కోల్పోయి, మరెందరో గల్లంతైన విషాద సమయంలోనూ కొందరి దుర్మార్గం వెలుగుచూసింది. వరదల్లో…
దేశంలో ప్రజారోగ్యం గాలిలో దీపంలా మారింది. ప్రభుత్వాల నిర్లక్ష్యం, ప్రైవేటు వైద్యుల దోపిడీ వెరసి సామాన్య ప్రజల ప్రాణాలకు గ్యారంటీ…
కన్నడ అనువాద చిత్రమైన ‘టాక్సిక్’ ఇక్కడి టాప్ స్టార్ల సినిమాల లెవెల్లో భారీగా రిలీజైందంటే అందుకు ప్రధాన కారణం.. దిల్…
అన్నా చెల్లెళ్ళ అనుబంధానికి ప్రతి రూపం రాఖీ. అలాంటి పవిత్రమైన రాఖీ పండుగ కూడా నేడు రాజకీయ చట్రంలో చిక్కుకుంది.…
తన సినిమాలను చెప్పిన బడ్జెట్లో పూర్తయ్యేలా జాగ్రత్త పడతాడని.. ప్రకటించిన డేటుకు రిలీజ్ చేస్తాడని నానికి ఉన్న పేరును ‘ది…
నేపాల్–టిబెట్ సరిహద్దుల్లో సంభవించిన ఆకస్మిక జలప్రళయంలో కైలాస మానససరోవర యాత్ర ముగించుకుని తిరుగు ప్రయాణమైన ఈశా ఫౌండేషన్కు చెందిన సుమారు…