Political News

అందుకే గవర్నర్ అపాయింట్మెంట్ రద్దు!

టీడీపీ నేతలకు మరోసారి నిరాశే ఎదురైంది. చంద్రబాబు అరెస్టుపై గవర్నర్ను కలిసి ఫిర్యాదు చేయాలనుకున్న టీడీపీ నేతలు అపాయింట్మెంట్ కోరారు. ఆదివారం ఉదయం 9.45 గంటలకు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ అందుకు అనుమతించారు. కానీ తాజాగా ఆ అపాయింట్మెంట్ రద్దు చేస్తున్నట్లు రాజ్ భవన్ వర్గాలు వెల్లడించాయి.

ప్రస్తుతం చంద్రబాబు నాయుడి కేసు విషయంలో విజయవాడలోని ఏసీబీ కోర్టులో వాదనలు జరుగుతుండడంతోనే గవర్నర్ ఈ నిర్ణయం తీసుకున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో నిందితుడిగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని శనివారం తెల్లవారుజామున సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే దీని వెనుక రాజకీయ కుట్ర ఉందని, సీఎం జగన్ కక్షపూరితంగా వ్యవహరించి బాబును అరెస్టు చేయించారని టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. ఇతర ప్రతిపక్ష పార్టీలు కూడా బాబుకు మద్దతుగా నిలుస్తున్నాయి.

చంద్రబాబు నాయుడిని అరెస్టు చేసే ముందు తన అనుమతి తీసుకోకపోవడంపై గవర్నర్ విస్మయం వ్యక్తం చేశారనే వార్తలు వచ్చాయి. బాబు అరెస్టు విషయం మీడియా ద్వారానే గవర్నర్కు తెలిసిందని రాజ్ భవన్ వర్గాలు చెప్పినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుతం ప్రతిపక్ష నేతగా ఉన్న బాబు లాంటి నాయకుడిని అరెస్టు చేసే ముందు గవర్నర్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని 2018లో చేసిన సవరణలో ఉందన్న చర్చ ఓ వైపు సాగుతోంది. మరోవైపు శనివారం గవర్నర్ను కలిసేందుకు టీడీపీ నేతలు ప్రయత్నించారు. కానీ ముందస్తు అరెస్టుల్లో భాగంగా టీడీపీ నేతలను పోలీసులు అరెస్టు చేయడంతో అది వీలు కాలేదు. దీంతో ఆదివారం ఉదయం కలిసేందుకు అపాయింట్మెంట్ కోరారు. కానీ ఇప్పుడేమో కేసు వాదనలు జరుగుతుండడంతో గవర్నర్ అపాయింట్మెంట్ రద్దు చేశారని సమాచారం.

This post was last modified on September 10, 2023 3:53 pm

Share

Recent Posts

అల వైకుంఠపురములో కాదు అనంతపురములో… వైరల్

‘‘ఏమ్మా నాన్నగారు ఉన్నారా? నాన్న గారు….ఇంట్లో లేరని చెప్పమన్నారండీ….నాన్న గారు లేరని చెప్పమన్నారేంట్రా…చెయ్యి పట్టుకొని ఇక్కడికే తీసుకురాలేకపోయావా…కన్ఫ్యూజన్ లేకుండా……’’అల వైకుంఠపురములో…

1 hour ago

మమిత బైజు – వయసు తక్కువా… హిట్లు ఎక్కువ!

ఇటీవలే విడుదలైన విశ్వనాథ్ అండ్ సన్స్ లో మమిత బైజు పోషించిన పాత్ర ఆ సినిమా విజయంలో ఎంత కీలక…

2 hours ago

కేరళం ప్రకృతి వైద్యానికి పవన్ ప్రాధాన్యత

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకృతి చికిత్స కోసం శుక్రవారం కేరళం బయలుదేరి వెళ్లనున్నారు. 20 రోజుల పాటు కేరళంలోనే…

2 hours ago

మల్లెపూల పల్లకి… ఊగుతున్న థియేటర్లు

ఇవాళ విడుదలైన ఇరుముడికి సర్వత్రా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. అన్ని సెంటర్ల…

4 hours ago

శాశ్వత సెలవు తీసుకున్న షావుకారు జానకి

దక్షిణాది లెజండరీ నటీనటులు ఇటీవలి కాలంలో కన్ను మూయడం సినీ ప్రియులను బాధిస్తోంది. భాగ్యరాజ్ గారి హఠాన్మరణం ఇంకా మర్చిపోక…

5 hours ago

సింగిల్ సింహం అంటారు… ఇదేం రాజకీయం జగన్?

ప్రచార హోరులో తానే సింగిల్ సింహం అని, కృష్ణుడిని, అర్జునుడిని అంటూ గొప్పలు చెప్పుకోవడం రాజకీయాల్లో సాధారణమే. కానీ, ప్రజాసమస్యలపై…

6 hours ago