Political News

రిపోర్టులో లోకేష్ పేరు..పీక కోసుకుంటానన్న అచ్చెన్న

స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో టీడీపీ అధినేత చంద్రబాబుపై రిమాండ్ రిపోర్టును విజయవాడలోని ఏసీబీ కోర్టులో సీఐడీ అధికారులు సమర్పించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే చంద్రబాబును 15 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి ఇవ్వాలని న్యాయమూర్తిని సీఐడీ అధికారులు కోరారు. అంతేకాదు, ఆ రిమాండ్ రిపోర్టులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుల పేర్లను కూడా సీఐడీ అధికారులు చేర్చడం సంచలనం రేపింది.

చంద్రబాబు సన్నిహితుడు కిలారు రాజేశ్ ద్వారా లోకేష్ కు కోట్ల రూపాయలు అందాయని రిమాండ్ రిపోర్టులో సీఐడీ సంచలన ఆరోపణలు చేసింది. ఈ నేపథ్యంలోనే జగన్ కు అచ్చెన్నాయుడు సవాల్ విసిరారు. చంద్రబాబుపై, తనపై ఆరోపణలు నిరూపిస్తే తన పీక కోసుకుంటానని అచ్చెన్న ఛాలెంజ్ చేశారు. అంతేకాదు, అదే జరిగితే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని సంచలన ప్రకటన చేశారు. ఆ స్కాం కేసులో చంద్రబాబును ఇరికించి వేధిస్తున్నారని అచ్చెన్న ఆరోపించారు.

చంద్రబాబు ఉగ్రవాది కాదని, పారిపోలేదని, ఏపీలో రాజకీయ కక్స తప్ప.. చట్టం,ధర్మం లేదని అచ్చెన్న ఆరోపించారు. ఏపీలో పిచ్చి పరాకాష్టకు చేరిందని, చంద్రబాబు అరెస్టు ప్రజాస్వామ్యానికి చీకటి రోజు అని అన్నారు. రాజకీయ కక్షతోనే ప్రతిపక్ష పార్టీలను జగన్ ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు. విపక్ష నేతలను జైలులో పెట్టి జగన్ రాక్షసానందం పొందుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు..సీఐడీ అధికారులకు సిగ్గులేదని, జగన్ ఏ నాటకం ఆడమంటే ఆ నాటకం ఆడుతున్నారని విమర్శించారు. మరోవైపు, అచ్చెన్నాయుడుతోపాటు టీడీపీ నేతలకు గవర్నర్ అపాయింట్ మెంట్ రద్దు చేశారు. కోర్టులో విచారణ జరుగుతున్నందున ఈ అపాయింట్ మెంట్ రద్దయింది.

This post was last modified on September 10, 2023 12:58 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

మిరల్ రిపోర్ట్ ఏంటి

నిన్న ఎలాగూ కొత్త తెలుగు సినిమాలు లేవనే కారణంగా మిరల్ అనే డబ్బింగ్ మూవీని రిలీజ్ చేశారు. ప్రేమిస్తేతో టాలీవుడ్…

6 hours ago

త్రివిక్రమ్ కోసం స్రవంతి ప్రయత్నాలు

గుంటూరు కారం విడుదలై అయిదు నెలలు పూర్తి కావొస్తున్నా త్రివిక్రమ్ శ్రీనివాస్ కొత్త సినిమా ఇప్పటిదాకా మొదలుకాలేదు. అసలు పూర్తి…

8 hours ago

టీడీపీలో 92 గెలుపు గుర్రాలు.. అధికారం ఖాయ‌మే!

బీజేపీ, జ‌న‌సేన‌లతో కూట‌మి క‌ట్టిన టీడీపీ ఏపీలో జ‌రిగిన ఎన్నిక‌ల్లో పోరాటం చేసిన విష‌యం తెలిసిందే. పోలింగ్ శాతం పెరిగిన…

9 hours ago

గురుశిష్యులతో రామ్ చరణ్ సింగిల్ ప్లాన్

గేమ్ ఛేంజర్ దెబ్బకు ఏకంగా మూడు సంవత్సరాలకు పైగా దానికే కేటాయించాల్సి వచ్చిన రామ్ చరణ్ శంకర్ మీద ఉన్న…

9 hours ago

జగన్ విమానం ఖర్చు అంతుంటుందా ?

ఎన్నికల సమరం ముగియడంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుటుంబంతో కలిసి విదేశాలకు విహారయాత్రకు వెళ్లారు. జగన్ విదేశీ పర్యటనకు…

10 hours ago

ప్రేక్షకుల అటెండెన్సుకి ఎవరిది బాధ్యత

చాంతాడంత కారణాలు చెప్పుకుని జనం థియేటర్లకు రావడం లేదని ఎంత బాధ పడినా వాస్తవిక పరిస్థితిని అర్థం చేసుకుంటే కనక…

10 hours ago