టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టు వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. అయితే, ఆ స్కామ్ పై కేసు నమోదైన నాలుగేళ్ల తర్వాత ఇప్పుడు ఎందుకు చంద్రబాబును అరెస్ట్ చేశారు అన్నది మరింత సంచలనంగా మారింది. అందులోనూ, స్కిల్ డెవలప్మెంట్ కేసులో 37వ పేరు చంద్రబాబుదని, 1-36 నిందితులను అరెస్టు చేయకుండా చంద్రబాబును అరెస్టు చేయడం కక్ష సాధింపు చర్యల్లో భాగమేనని టిడిపి నేతలు ఆరోపిస్తున్నారు. అయితే, అంత అల్లాటప్పాగా చంద్రబాబును అరెస్ట్ చేయలేదని, పక్కా టైమింగ్ ప్రకారమే అరెస్టు చేశారని టాక్ వస్తోంది.
జాతీయ స్థాయిలో కూడా మంచి గుర్తింపు ఉన్న చంద్రబాబును అరెస్టు చేస్తే జగన్ ప్రభుత్వానికి జాతీయ మీడియాలో కూడా తీవ్ర డ్యామేజీ జరుగుతుందని, అందుకే, జీ20 వంటి ప్రతిష్టాత్మక సదస్సు కవరేజీలో జాతీయ మీడియా బిజీగా ఉన్న టైం చూసి జగన్ దెబ్బకొట్టారని ప్రచారం జరుగుతోంది. ఈ సందర్బంగా.మీడియా ఫోకస్ మిగతా రాష్ట్రాల రాజకీయాలపై విస్తృతంగా ఉండదని, అందులోనూ, శనివారం..ఆదివారం కోర్టు సెలవులు చూసి మరీ అరెస్ట్ చేశారని తెలుస్తోంది. పక్కా ప్లాన్ తోనే సీఆర్ పీసీ సెక్షన్ 50(1) నోటీస్ ఇచ్చి 1988 ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ చట్టం కింద చంద్రబాబును అరెస్ట్ చేశారని తెలుస్తోంది. చంద్రబాబుపై 120(బి),166,167, 418, 420, 465, 468, 201,109, రెడ్ విత్ 34 మరియు ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి స్టేషన్ బెయిల్ రాకుండా చేశారని తెలుస్తోంది.
1-36వ నిందితులను అరెస్టు చేయకుండా..37వ నిందితుడైన చంద్రబాబును అరెస్టు చేయడం కుట్రపూరితమేనని విమర్శలు వస్తున్నాయి. తాను లండన్ లో ఉన్నానని, అరెస్టు సమయంలో ఏపీలో లేను అని జగన్ చెప్పుకోవడం కోసం జగన్ లండన్ టూర్ టైంలో అరెస్టు జరిగిందని టాక్ వస్తోంది. ఇపుడైతే జీ20లో బిజీగా ఉన్న మోడీతోపాటు కేంద్ర పెద్దలు దీనిపై స్పందించేందుకు అందుబాటులో ఉండరని, ఈ సందర్భాన్ని జగన్ క్యాష్ చేసుకున్నారని తెలుస్తోంది. 2021లో ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తే…2023లో అరెస్టు చేయడం…పక్కా వ్యూహం ప్రకారమే జరిగిందని , నాలుగేళ్లుగా అదును కోసం చూస్తున్న జగన్..ఇపుడు అవకాశం రాగానే అరెస్టు చేయించారని తెలుస్తోంది.
This post was last modified on September 9, 2023 4:54 pm
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…
నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…