టీడీపీ సీనియర్ నేత, విజయవాడ ఎంపీ కేశినేని నాని… టీడీపీతో చాలాకాలంగా అంటిముట్టనట్టుగా వ్యవహరిస్తోన్న సంగతి తెలిసిందే. ఆయన సోదరుడు చిన్నికి విజయవాడ ఎంపీ టికెట్ ఇచ్చేందుకే టిడిపి అధిష్టానం మొగ్గుచూపిందని, ఆ క్రమంలోనే నాని అలకబూని పార్టీకి సంబంధించిన కార్యక్రమాలలో పాల్గొనడం లేదని ప్రచారం జరుగుతోంది. ఆ ప్రచారానికి తగ్గట్లుగానే ఇటీవల లోకేష్ యువగళం పాదయాత్ర సందర్భంగా కూడా నాని కనిపించలేదు. తనకు టీడీపీ తరఫున టికెట్ ఇవ్వకుంటే రాబోయే ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా అయినా పోటీ చేస్తానని నాని చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఈ క్రమంలోనే తాజాగా తాను టీడీపీలోనే ఉన్నానని నాని సంచలన ప్రకటన చేశారు.
రాబోయే ఎన్నికల్లో టీడీపీ తరఫునే తాను పోటీ చేయబోతున్నానని నాని ప్రకటించారు. అంతేకాదు, టీడీపీ అధినేత చంద్రబాబుపై నాని ప్రశంసలు కురిపించారు. దేశ రాజకీయాలలో నిజాయితీగల అతి కొద్ది మంది నేతలలో చంద్రబాబు ఒకరని, అవినీతి మచ్చలేని నాయకుడు అని నాని ప్రశంసించారు. ఇటీవల చంద్రబాబుకు ఐటి నోటీసులు ఇచ్చిన వ్యవహారంపై కూడా నాని స్పందించారు. అది పెద్ద విషయం కాదని, దానికి ఆయన వివరణ ఇస్తారని చెప్పుకొచ్చారు. ఎంపీ గానే టిడిపి తరఫున వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని నాని స్పష్టం చేశారు. తమ ప్రాంతంలో కొందరు నేతలు 40 ఏళ్లుగా టిడిపిని నమ్ముకుని ఉన్నారని, వారిని రాజకీయంగా ఎదగకుండా కొందరు వాడుకుని వదిలేశారని అన్నారు.
రాజకీయాల్లో ప్రజాసేవ ముఖ్యమని పదవులు వాటంతటవే వస్తాయని నాని చెప్పారు. ఐటీ నోటీసులకు సమాధానం చెప్పుకునే నిబద్ధత, కమిట్మెంట్ చంద్రబాబు దగ్గర ఉన్నాయని అన్నారు. నోటీసులు రాజకీయాల్లో చాలా రొటీన్ విషయమని, చంద్రబాబు తాలూకా X కి Yకి ఇచ్చినట్లు రాసుకొని ఉండొచ్చని, అంతమాత్రాన చంద్రబాబుకు ముట్టినట్లు ఎలా అవుతుందని ప్రశ్నించారు. తాజాగా నాని కామెంట్లు చూస్తుంటే టీడీపీ అధిష్టానంతో వచ్చిన అభిప్రాయభేదాలు సమసిపోయినట్లే కనిపిస్తోంది.
This post was last modified on September 8, 2023 9:34 pm
బాలీవుడ్ సూపర్ స్టార్లలో ఇప్పుడు అత్యంత గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నది సల్మాన్ ఖానే. ఆయన నిఖార్సయిన బ్లాక్బస్టర్ కొట్టి దశాబ్దం…
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా రూపొందుతున్న 'ఆదర్శ కుటుంబం' షూటింగ్ మంచి స్వింగ్ లో ఉంది. ముందుగా తీసుకున్న…
మరీ డెడ్ డ్రైగా మారిపోయిన తెలుగు రాష్ట్రాల థియేటర్లు పెద్ద సినిమాలు లేక అల్లాడిపోతున్నాయి. రెండు మూడు రోజులు ప్రమోషన్లతో…
తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా సాధించుకునేందుకు కొనసాగిన ఉద్యమం కొత్త పుంతలు తొక్కింది. యావత్తు తెలంగాణ వేదికగా సాగిన ఈ ఉద్యమంలో…
``రాజకీయ నేతలు.. ప్రజల కోసం పనిచేసేది తక్కువ.. సెక్స్ వీడియోలు చూసేది ఎక్కువ. కావాలంటే.. నా ఫోన్ సహా.. రాష్ట్రంలోని…
బద్రి లాంటి సూపర్ హిట్ మూవీతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు పూరి జగన్నాథ్. అరంగేట్రంలోనే అలాంటి హిట్ పడిందంటే ఇక…