టీడీపీ సీనియర్ నేత, విజయవాడ ఎంపీ కేశినేని నాని… టీడీపీతో చాలాకాలంగా అంటిముట్టనట్టుగా వ్యవహరిస్తోన్న సంగతి తెలిసిందే. ఆయన సోదరుడు చిన్నికి విజయవాడ ఎంపీ టికెట్ ఇచ్చేందుకే టిడిపి అధిష్టానం మొగ్గుచూపిందని, ఆ క్రమంలోనే నాని అలకబూని పార్టీకి సంబంధించిన కార్యక్రమాలలో పాల్గొనడం లేదని ప్రచారం జరుగుతోంది. ఆ ప్రచారానికి తగ్గట్లుగానే ఇటీవల లోకేష్ యువగళం పాదయాత్ర సందర్భంగా కూడా నాని కనిపించలేదు. తనకు టీడీపీ తరఫున టికెట్ ఇవ్వకుంటే రాబోయే ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా అయినా పోటీ చేస్తానని నాని చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఈ క్రమంలోనే తాజాగా తాను టీడీపీలోనే ఉన్నానని నాని సంచలన ప్రకటన చేశారు.
రాబోయే ఎన్నికల్లో టీడీపీ తరఫునే తాను పోటీ చేయబోతున్నానని నాని ప్రకటించారు. అంతేకాదు, టీడీపీ అధినేత చంద్రబాబుపై నాని ప్రశంసలు కురిపించారు. దేశ రాజకీయాలలో నిజాయితీగల అతి కొద్ది మంది నేతలలో చంద్రబాబు ఒకరని, అవినీతి మచ్చలేని నాయకుడు అని నాని ప్రశంసించారు. ఇటీవల చంద్రబాబుకు ఐటి నోటీసులు ఇచ్చిన వ్యవహారంపై కూడా నాని స్పందించారు. అది పెద్ద విషయం కాదని, దానికి ఆయన వివరణ ఇస్తారని చెప్పుకొచ్చారు. ఎంపీ గానే టిడిపి తరఫున వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని నాని స్పష్టం చేశారు. తమ ప్రాంతంలో కొందరు నేతలు 40 ఏళ్లుగా టిడిపిని నమ్ముకుని ఉన్నారని, వారిని రాజకీయంగా ఎదగకుండా కొందరు వాడుకుని వదిలేశారని అన్నారు.
రాజకీయాల్లో ప్రజాసేవ ముఖ్యమని పదవులు వాటంతటవే వస్తాయని నాని చెప్పారు. ఐటీ నోటీసులకు సమాధానం చెప్పుకునే నిబద్ధత, కమిట్మెంట్ చంద్రబాబు దగ్గర ఉన్నాయని అన్నారు. నోటీసులు రాజకీయాల్లో చాలా రొటీన్ విషయమని, చంద్రబాబు తాలూకా X కి Yకి ఇచ్చినట్లు రాసుకొని ఉండొచ్చని, అంతమాత్రాన చంద్రబాబుకు ముట్టినట్లు ఎలా అవుతుందని ప్రశ్నించారు. తాజాగా నాని కామెంట్లు చూస్తుంటే టీడీపీ అధిష్టానంతో వచ్చిన అభిప్రాయభేదాలు సమసిపోయినట్లే కనిపిస్తోంది.
This post was last modified on September 8, 2023 9:34 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…