Political News

అప్రూవర్ గా మారిన ఎంపీ మాగుంట

ఢిల్లీ లిక్కర్ స్కాం దేశవ్యాప్తంగా పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ స్కామ్ లో మొదటి నుంచి వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఆయన తనయుడు మాగుంట రాఘవరెడ్డిలతో పాటు సీఎం కేసీఆర్ తనయురాలు ఎమ్మెల్సీ కవిత పేరు కూడా బలంగా వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. సౌత్ సిండికేట్ తరఫున ఆప్ మంత్రి సిసోడియాకు 100 కోట్ల రూపాయల మొత్తాన్ని కవిత, మాగుంట ఇచ్చారని ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఇప్పటికే శ్రీనివాసులు రెడ్డి తనయుడు మాగుంట రాఘవరెడ్డి అప్రూవల్ గా మారడం సంచలనం రేపింది.

ఈ నేపథ్యంలోనే తాజాగా వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కూడా అప్రూవర్ గా మారడం ఏపీ రాజకీయాలలో సంచలనం రేపుతోంది. అప్రూవర్ గా మారిన శ్రీనివాసులు రెడ్డి…ఈడీ అధికారులకు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించిన పలు కీలక వివరాలను వెల్లడించారని తెలుస్తోంది. ఈ కేసులో ఇప్పటికే వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అల్లుడి సోదరుడు శరత్ చంద్రా రెడ్డి కూడా అప్రూవర్ గా మారి రాఘవరెడ్డితో పాటు బెయిల్ పై ఉన్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే ఈ ముగ్గురు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఈ స్కాం కు సంబంధించిన పలువురిని ఈడి అధికారులు ప్రశ్నిస్తున్నారు. జి20 సమావేశాలు ముగిసిన తర్వాత ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ లక్ష్యంగా ఈ కేసు విచారణను ఈడి వేగవంతం చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. మరి కొద్ది రోజుల్లోనే హైదరాబాద్ లో ఈ స్కామ్ కు సంబంధించిన అక్రమ నగదు లావాదేవీల వ్యవహారం పై ఈడి ఫోకస్ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. కొద్దిరోజులుగా హవాలా డీలింగ్స్ చేసే 20 మంది వ్యక్తులను ఈడి అధికారులు ప్రశ్నించారని తెలుస్తోంది.

ఇక, ఎమ్మెల్సీ కవిత ఆడిటర్ బుచ్చిబాబును కూడా ఈడీ అధికారులు ఇటీవల మరోసారి ప్రశ్నించారట. త్వరలోనే తెలంగాణలోని పలువురు వ్యాపారవేత్తలను కూడా ఈడీ ప్రశ్నించబోతున్నట్టుగా తెలుస్తోంది. ఏది ఏమైనా ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఏపీ, తెలంగాణలో అధికార పార్టీలను కుదిపేస్తున్న వైనం హాట్ టాపిక్ గా మారింది.

This post was last modified on September 8, 2023 8:23 pm

Share

Recent Posts

సహజీవనంలోనూ గృహ హింసకు ఛాన్స్!

భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఓ సంచలన తీర్పును వెలువరించింది. మారుతున్నకాలానికి అనుగుణంగా మనిషి జీవనయానంలోనూ మార్పులు చోటుచేసుకుంటూ వస్తోంటే... ఆ…

18 minutes ago

ఇండియన్ స్టార్ హీరోల సరసన టామ్ హాలండ్

అదేంటో స్పైడర్ మ్యాన్ జ్వరం మనోళ్లకు ఓ రేంజ్ లో పట్టేసింది. భాషతో సంబంధం లేకుండా ముంబై నుంచి మచిలీపట్నం…

24 minutes ago

బెంగ‌ళూరులో స్ట్రాట‌జిస్టుల‌తో జ‌గ‌న్ భేటీ?

వైసీపీ అధినేత జ‌గ‌న్ ప‌లువురు కీల‌క రాజకీయ వ్యూహ‌క‌ర్త‌ల‌తో భేటీ అయ్యారా?  వ‌చ్చే ఎన్నిక‌లు.. దీనికి ముందు ఆయ‌న చేయ‌నున్న…

1 hour ago

కాంగ్రెస్ కూటమి ప్రభుత్వాన్నీ… వదలమంటున్న బొద్దింకలు

ఇది జెన్ జీ కాలం. తప్పు ఎవరు చేసినా వదిలేదన్న రీతిలో నేటి యువత సాగుతోంది. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన…

1 hour ago

కలకలం… 140 కోట్ల మందిపై ‘డ్రాగన్’ నిఘా?

అగ్ర దేశాల్లో ఒకటైన చైనా నిత్యం ప్రపంచ దేశాలను కలవరపాటుకు గురి చేస్తూనే ఉంది. భారత్ సహా పలు దేశాలకు స్నేహ…

4 hours ago

హీరోపై విరుచుకుపడిన అత్తగారు

తమిళ స్టార్ హీరోల్లో ఒకడైన రవి మోహన్ అలియాస్ జయం రవి.. ఈ మధ్య సినిమాలతో కంటే వ్యక్తిగత జీవితానికి…

4 hours ago