ఆ యువతి అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే కుమార్తె…అది కూడా బలమైన సామాజిక వర్గానికి చెందిన నేత అల్లారు ముద్దుగా పెంచుకున్న పెద్ద కూతురు. కాలేజీలో చదువుకునే రోజుల్లో వేరే సామాజిక వర్గానికి చెందిన యువకుడితో ఆ యువతి ప్రేమలో పడుతుంది. కట్ చేస్తే ఆదర్శభావాలున్న ఆ ఎమ్మెల్యే తన కూతురు ప్రేమను అంగీకరించి తన సమక్షంలోనే ఇద్దరికీ పెళ్లి జరిపిస్తాడు. ఆదర్శ వివాహం చేసిన సదరు ఎమ్మెల్యేపై మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతాయి. దాదాపుగా చాలా తెలుగు సినిమాలలో ఇటువంటి సీన్లు ఎన్నో చూసి ఉంటాం. అయితే, రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా ఇటువంటి సీన్ సాధ్యమే అని వైసిపి నేత, ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి నిరూపించారు.
తన పెద్ద కుమార్తె పల్లవికి ఆమె ఇష్ట పడిన యువకుడితో వివాహం జరిపించారు ప్రసాద్ రెడ్డి. బొల్లవరంలోని వెంకటేశ్వర ఆలయంలో నిరాడంబరంగా ఈ వివాహ వేడుక జరిగింది. ఆ తర్వాత ప్రొద్దుటూరు లోని సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ లో ఈ వివాహాన్ని రాచమల్లు ప్రసాద్ రెడ్డి దగ్గరుండి రిజిస్ట్రేషన్ చేయించడం విశేషం. పల్లవి చదువుకునే రోజుల్లో తన క్లాస్మేట్ పవన్ కుమార్ ను ప్రేమించింది. అయితే, ఈ విషయాన్ని తన తండ్రి ప్రసాద్ రెడ్డితో చెప్పి ఆయన అనుమతి తీసుకున్న తర్వాతే పెళ్లి చేసుకోవాలని పల్లవి నిశ్చయించుకుంది. ఈ క్రమంలోనే ఆమె నిర్ణయాన్ని గౌరవించిన ప్రసాద్ రెడ్డి యువకుడి కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడారు.
ఇరు కుటుంబాలు అంగీకరించడంతో వీరి పెళ్లి నిరాడంబరంగా నిర్వహించారు. డబ్బు, హోదా, కులమతాలకు ప్రాధాన్యం ఇవ్వకుండా పిల్లల ఇష్టానికి అనుగుణంగా వివాహం జరిపించానని రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి వెల్లడించారు. ఈ క్రమంలోనే రాచమల్లు నిర్ణయంపై సర్వతా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. రాచమల్లు తీరును చాలా మంది ప్రశంసిస్తున్నారు. పిల్లల ప్రేమను అర్థం చేసుకొని వివాహం జరిపించిన ప్రసాద్ రెడ్డి ఎందరో తల్లిదండ్రులకు ఆదర్శమని అంటున్నారు. పరువు కోసం సొంత బిడ్డలని కడతేరుస్తున్న ప్రస్తుత సమాజంలో ఎమ్మెల్యే హోదాలో ఉండి కూడా కూతురు ప్రేమను గౌరవించి ప్రేమ వివాహం చేయడం నిజంగా ఆదర్శనీయమని సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
ఏపీ సీఎం చంద్రబాబును విజయవాడలోని కృష్ణలంకకు చెందిన సాయికృష్ణ కుటుంబ సభ్యులు కలిసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మీడియాతో…
విజువల్ ఎఫెక్ట్స్ మీద ఆధారపడి సినిమాలు తీయడం చాలా రిస్క్. కొన్నిసార్లు ఇవి తీసుకునే సమయం హీరోల కెరీర్ల మీద…
బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో తెరకెక్కుతున్న NBK111 ప్రాజెక్టులో స్టార్ క్యాస్ట్ మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసేలా ఉంది.…
విజయవాడలో యువకుడి అదృశ్యం కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తిస్తోంది. రాజకీయ, కులం రంగు పులుముకున్న ఈ వ్యవహారం…
విజయవాడలో కృష్ణలంకకు చెందిన సాయికృష్ణ అనే యువకుడు లాకప్ డెత్ కు గురయ్యాడని ఆరోపణలు రావడం రాజకీయ దుమారం రేపిన…
పెద్ది విడుదలకు ముందు జాన్వీ కపూర్ ప్రమోషన్ల పరంగా ఎంత చేయాలో అంతా చేసింది. ఇండియా మొత్తం టీమ్ తో…