Political News

6 వేల కోట్ల మోసం.. 4 వేల కోట్ల ఆస్తుల అటాచ్‌..!

సుదీర్ఘ విచార‌ణ‌లు, అనేక వంద‌ల‌ మంది సాక్ష్యులు.. వెర‌సి 15 ఏళ్ల‌కుపైగా సాగిన అగ్రిగోల్డ్ కుంభ‌కోణంలో ఎట్ట‌కేల‌కు చార్జిషీట్ దాఖ‌లైంది. ఈ సంస్థ ఏపీ, తెలంగాణ‌, క‌ర్ణాట‌క‌, త‌మిళ‌నాడు రాష్ట్రాల ప్ర‌జ‌ల‌ను న‌మ్మించి మొత్తం 6 వేల కోట్ల‌కుపైగా సొమ్మును డిపాజిట్ల రూపంలో రాబ‌ట్టింది. అనంతరం.. బోర్డు తిప్పేసింది. దీనిపై ఆయా రాష్ట్రాల్లో కేసులు న‌మోదైన విష‌యం తెలిసిందే. ఈ కేసుల‌ను గుండుగుత్త‌గా.. ఏపీ హైకోర్టు(అప్ప‌టి ఉమ్మ‌డి) విచార‌ణ‌కు స్వీక‌రించింది.

ఈ క్ర‌మంలోనే మ‌నీలాండ‌రింగ్ కోణంలోనూ ద‌ర్యాప్తు జ‌ర‌పాల‌ని నిర్ణ‌యించి.. కేసును ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) అప్ప‌గించింది. ఈ సంస్థ సుదీర్ఘ విచార‌ణ‌ల అనంత‌రం.. తాజాగా ఛార్జిషీట్ దాఖలు చేసింది. అగ్రిగోల్డ్ ప్రమోటర్లు ఏవీ రామారావు, శేషునారాయణరావు, హేమసుందర వరప్రసాద్‌ పేర్లను ప్ర‌ధాన నిందితులుగా పేర్కొంటూ ఛార్జ్‌షీట్‌లో చేర్చింది.

అగ్రిగోల్డ్ ఫామ్ ఎస్టేట్స్ సహా 11 అనుబంధ కంపెనీలపై ఈడీ ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. ఛార్జ్‌షీట్‌ను నాంపల్లి ఎంఎస్‌జే కోర్టు విచారణకు స్వీకరించింది. అక్టోబరు 3న కోర్టుకు హాజరుకావాలని అగ్రిగోల్డ్ ప్రమోటర్లు, కంపెనీల ప్రతినిధులకు కోర్టు సమన్లు జారీ చేసింది. 32 లక్షల మంది డిపాజిటర్లను రూ.6,380 కోట్ల మేర మోసం చేసినట్లు అగ్రిగోల్డ్‌పై అభియోగాలు దాఖలయ్యాయి.

ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే రూ.4,141 కోట్ల మేర ఆస్తులను ఎన్ ఫోర్స్‌మెంటు డైరెక్ట‌రేట్ ఎటాచ్ చేసింది. అయితే.. మ‌రో 2000 కోట్ల‌కు పైగా సొమ్ము ఏమైంద‌నేది తేలాల్సి ఉంది. ఇదిలావుంటే, డిపాజిట‌ర్ల‌కు ఏపీ ప్ర‌భుత్వం రెండు విడ‌త‌ల్లొ కొంత సొమ్మును తిరిగి ఇచ్చిన విష‌యం తెలిసిందే.

This post was last modified on September 6, 2023 8:57 pm

Share

Recent Posts

పవన్ భార్యను అలా పిలవకండి

త‌ను స్వ‌త‌హాగా ర‌ష్య‌న్ అయినా.. పుట్టి పెరిగింది ర‌ష్యాలోనే అయినా.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను పెళ్లి చేసుకున్నాక పూర్తిగా ఒక తెలుగింటి…

59 minutes ago

ఆర్ఆర్ఆర్ హీరోలకు ప్రమాదాల పర్వం

జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ మధ్య ఎంత స్నేహం ఉందో తెలిసిందే. ఆర్ఆర్ఆర్ షూటింగ్, ప్రమోషన్స్ టైంలో కనిపించినంతగా ఇప్పుడు…

1 hour ago

త్రివిక్ర‌మ్ మీద అంత అనుమాన‌మా?

టాలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్లలో చాలామంది హాలీవుడ్ సినిమాల నుంచి స్ఫూర్తి పొంది క‌థ‌లు, స‌న్నివేశాలు తీర్చిదిద్దుకున్న వాళ్లే. ఇప్పుడు ఇండియా…

1 hour ago

సుమంత్ ఈసారి బలంగా వస్తున్నాడు

అక్కినేని నాగేశ్వ‌ర‌రావు మ‌న‌వ‌డు సుమంత్‌ను చూస్తే పెద్ద స్టార్ కావ‌డానికి అవ‌స‌ర‌మైన అన్ని ల‌క్ష‌ణాలు ఉన్న‌ట్లే క‌నిపిస్తాడు. ఆర‌డుగుల ఆజానుబాహుడు,…

3 hours ago

విద్యార్థిని ఆత్మ‌హ‌త్య‌.. చంద్ర‌బాబు తీవ్ర ఆవేద‌న.. ఏంటీ బంధం?

పోలవరం జిల్లా ఈర్లపల్లి గ్రామానికి చెందిన 10వ తరగతి విద్యార్ధిని ముర్రం శివాని ఆత్మ‌హ‌త్య చేసుకుంది. దీనికి సంబంధించిన కార‌ణాలు…

3 hours ago

రంగ‌నాథ్‌ను తప్పించండి… హైడ్రాపై హైకోర్టు సీరియ‌స్‌!

తెలంగాణ‌లో ఆక్ర‌మ క‌ట్టడాల‌కు సింహ స్వ‌ప్నంగా మారిన హైడ్రా విధానంపై హైకోర్టు కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. త‌మ మాటంటే హైడ్రాకు…

4 hours ago