విజయవాడ మాజీ ఎంపీ, కాంగ్రెస్ మాజీ నాయకుడు లగడపాటి రాజగోపాల్ గురించి రెండు తెలుగు రాష్ట్రా ల్లోనూ అందరికీ తెలిసిందే. తెలంగాణ విభజనను తీవ్రంగా వ్యతిరేకించి అప్పట్లో హల్చల్ చేసిన నాయకు డిగానే కాకుండా పార్లమెంటులో పెప్పర్ స్ప్రే చల్లి స్పీకర్ సహా సభ్యులను పరుగులు పెట్టించి సంచలనం సృష్టించిన మాజీ ఎంపీ… 2014 రాష్ట్ర విభజన తర్వాత నుంచి పార్టీకి, రాజకీయాలకు దూరంగా ఉంటున్నా రు.
2004, 2009 ఎన్నికల్లో విజయవాడ పార్లమెంటు స్థానం నుంచి వరుస విజయాలు దక్కించుకున్న లగడపాటి అనతి కాలంలో తనకంటూ ప్రత్యేకతను చాటుకున్నారు. ఇదిలావుంటే, ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగానే ఉన్నప్పటికీ.. పరోక్షంగా ఎన్నికల సమయంలో మాత్రం పార్టీల జాతకాలు చెబుతున్నారు. ముందస్తు సర్వేల పేరుతో ఆయన ఎన్నికలకు ముందు కొన్ని సర్వేలు ప్రకటించిన విషయం తెలిసిందే. 2019 ఎన్నికల తర్వాత ఆయన చెప్పిన జోస్యం విఫలమైంది.
ఏపీలో జగన్ ఎట్టిపరిస్థితిలోనూ అధికారంలోకి రాడని.. అలా వస్తే.. తాను ఇక, సర్వేల నుంచికూడా తప్పు కొంటానని ప్రకటించారు. అనుకున్నట్టుగానే జగన్ అధికారంలోకి వచ్చాక.. లగడపాటి పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. కట్ చేస్తే.. మరో నాలుగు మాసాల్లో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో మరోసారి విజయవా డ రాజకీయాల్లో లగడపాటి పేరు ప్రముఖంగా తెరమీదికి వచ్చింది. త్వరలోనే ఆయన రాజకీయ అరంగే ట్రం చేస్తున్నారని.. దీనికి సంబంధించి చర్చలు సాగుతున్నాయని సమాచారం.
2024 ఎన్నికల్లో మళ్లీ విజయవాడ నుంచి ఎంపీగా పోటీ చేయించాలని కొందరు పారిశ్రామిక వేత్తలు, మరికొందరు మిత్రులు కూడా భావిస్తున్నట్టు సమాచారం. దీనికి సంబంధించి ఒక హోటల్లో కొందరు రహస్య సమాలోచనలు చేసినట్టు సమాచారం. అయితే.. గత ఏడాది కూడా ఇలాంటి వార్తలు వచ్చాయి. లగడపాటి మరోసారి రాజకీయాల్లోకి వస్తున్నారని ప్రచారం జరిగింది. అయితే, అప్పట్లో ఆయన ఈ వార్తలను ఖండించారు. తనకు ఇంట్రస్ట్ లేదన్నారు. అయితే, మారుతున్న కాలానికి అనుగుణంగా ఆయన కూడా తన మనసు మార్చుకున్నారేమో.. చూడాలి. మొత్తానికి లగడపాటి రీ ఎంట్రీ కనుక ఇస్తే.. విజయవాడ రాజకీయాలు మరింత వేడెక్కడం ఖాయమని అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on September 6, 2023 2:09 pm
సోషల్ మీడియాలో చాలా అలెర్ట్ గా ఉండాలి. ముఖ్యంగా సెలబ్రిటీలు బిజీగా షెడ్యూల్స్ లో ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా…
థియేటర్లకు సరైన సినిమాలు వస్తే రావడానికి ప్రేక్షకులు సిద్ధంగా ఉన్నారు. ఎటొచ్చి వాళ్ళను కనీస స్థాయిలో మెప్పించే కంటెంట్ ఉన్నవి…
తెలంగాణలో రెండు రాజ్యసభ స్థానాలకు పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అభిషేక్ మను సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డిలు..…
వంటగ్యాస్ కొరత కారణంగా దేశవ్యాప్తంగా చిన్న హోటళ్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. హోటళ్లకు సరఫరా అయ్యే కమర్షియల్ సిలిండర్ల పంపిణీని…
రాష్ట్రంలోని పలు మున్సిపల్ సంస్థల్లో పాలకవర్గాల గడువు ముగియడంతో అక్కడ స్పెషల్ ఆఫీసర్ల పాలన అమల్లోకి రానుంది. మున్సిపల్ కార్పొరేషన్లు,…
టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జున వరుసగా తమిళ నటులు, టెక్నీషియన్లతో పని చేస్తున్నాడు. గత ఏడాది ధనుష్తో కలిసి…