Political News

జగన్ కేసు చార్జిషీట్ లో వైఎస్ పేరు.. షర్మిల క్లారిటీ

కాంగ్రెస్ పార్టీలో వైఎస్సార్సీపీ విలీనం వ్యవహారంపై వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ విలీనంపై చర్చలు తుది దశకు వచ్చాయని షర్మిల అన్నారు. తన తండ్రి వైఎస్ఆర్ ను సోనియా గాంధీ గౌరవిస్తున్నారని, అందుకే చర్చలకు ఢిల్లీ వెళ్లానని షర్మిల చెప్పారు. వైఎస్సార్ కుటుంబానికి సోనియా ద్రోహం చేయలేదని షర్మిల అన్నారు. వైఎస్సార్ అంటే కాంగ్రెస్ పార్టీకి అపారమైన గౌరవం ఉందని చెప్పారు. అయితే, ఆనాడు జగన్ అక్రమాస్తుల కేసు ఎఫ్ఐఆర్లో వైఎస్ఆర్ పేరుని చేర్చిన విషయం సోనియాకు తెలియదని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

మా వాళ్లు కూడా సోనియానే ఆ పని చేయించారని అనుకున్నారని, తనను ప్రశ్నించారని షర్మిల అన్నారు. అందుకే, ఈ క్లారిటీనివ్వాల్సి వచ్చిందని చెప్పారు. రాజీవ్ గాంధీ చనిపోయిన తర్వాత కూడా సీబీఐ చార్జిషీటులో ఆబ్ స్కాండర్ గా రాజీవ్ గాంధీ పేరును చేర్చారని, ఆ బాధ ఎలా ఉంటుందో తనకు తెలుసని సోనియా గాంధీ తనతో చెప్పారని అన్నారు. అటువంటిది, తాము వైఎస్ పేరు ఎలా చేరుస్తామని చెప్పారని షర్మిల క్లారిటీనిచ్చారు. ఇక, వైఎస్ఆర్ లేని లోటు తమకు తెలుస్తోందని రాహుల్ గాంధీ చెప్పినట్లు షర్మిల అన్నారు.

కేసీఆర్ అవినీతి పాలనను అంతమొందించేందుకే సోనియాతో చర్చలు జరిపానని షర్మిల అన్నారు. అయితే, తమ పార్టీ కేడర్ తో చర్చలు జరిపిన తర్వాతే విలీనంపై మీడియాతో మాట్లాడుతానని షర్మిల అన్నారు. త్వరలోనే అన్ని వివరాలను తెలియజేస్తానని చెప్పారు. కేసీఆర్ కు వ్యతిరేకంగా తెలంగాణలోని అన్ని పార్టీలు కలిసి రావాలని షర్మిల కోరారు. తెలంగాణలో తాను 3800 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశానని, తనతో పాటు నడిచిన వారిని నిలబెడతానని అన్నారు. ఇక, ఈ రోజు వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయ వెళ్లిన షర్మిల తన తండ్రి వైఎస్ఆర్ కు నివాళులర్పించారు.

ఎప్పటిలాగే ఈ కార్యక్రమానికి సీఎం జగన్, షర్మిల విడివిడిగా హాజరయ్యారు. అయితే, విలీనంపై ఇడుపులపాయ దగ్గర మీడియా మిత్రులు అడిగిన ప్రశ్నలకు షర్మిల సమాధానమివ్వలేదు. ఆ తర్వాత హైదరాబాద్ లోని పంజాగుట్టలో వైఎస్ విగ్రహానికి నివాళులర్పించిన సందర్భంలో మీడియాతో మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు.

This post was last modified on September 2, 2023 10:50 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మళ్ళీ పవన్ పై కాంగ్రెస్ ఫైర్

ఏపీ ఉప ముఖ్య‌మంత్రి, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ కల్యాణ్‌పై.. తెలంగాణ కాంగ్రెస్ నాయ‌కులు భ‌గ్గుమ‌న్నారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ కాదు.. దిష్టి…

2 hours ago

నాని ఎదుర్కున్న సమస్యే శ్రీవిష్ణుకి వస్తుందా

ఒకే హీరో రెండు సినిమాలు ఒకే టైంలో రిలీజ్ కు రెడీ కావడమంత సంకట పరిస్థితి మరొకటి ఉండదు. గతంలో…

8 hours ago

మూడు రోజులుగా లడ్డూ లడాయి.. వైసీపీ ట్రాప్‌లో చిక్కారా?

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా కూటమి…

9 hours ago

తిరుమ‌ల ల‌డ్డూపై క‌మిష‌న్‌.. సూత్రధారులు దొరుకుతారా?

తిరుమ‌ల శ్రీవారి ల‌డ్డూలో క‌ల్తీ నెయ్యి వినియోగంపై ప్ర‌స్తుతం సీబీఐ విచార‌ణ చేసింది. దీనికి సంబంధించిన చార్జిషీట్‌ను కూడా నెల్లూరు…

10 hours ago

రాజా సాబ్ మళ్ళీ టార్గెట్ అవుతాడా

డిజాస్టర్లు ప్రతి హీరో, దర్శకుడికి ఉంటాయి కానీ రాజా సాబ్ విషయంలో మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఎవరయ్యా అంటే ఠక్కున…

11 hours ago

అర్జున్ ఈ విషయంలో అదృష్టవంతుడే

వచ్చే వారం విడుదల కాబోతున్న సినిమాల్లో సీత పయనం ఉంది. పేరు వింటే పెద్దగా విశేషం అనిపించదు కానీ ఈ…

11 hours ago