కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు జీవితం కాలం లేటన్నట్లుగా తయారైంది. తెలంగాణా విభజన జరిగిన తర్వాత తొందరలోనే మూడో ఎన్నిక జరగబోతోంది. అలాంటి మూడో ఎన్నికలో తెలంగాణా సెంటిమెంటును ప్రయోగించాలని కాంగ్రెస్ నేతలు డిసైడ్ అవ్వటమే ఆశ్చర్యంగా ఉంది. ఇంతకీ ఆ సెంటిమెంటు ఏమిటంటే ‘తెలంగాణా ఇచ్చింది మేమే..తెలంగాణాను తెచ్చింది మేమే’ అనే సెంటిమెంటును ప్రయోగించాలని డిసైడ్ అయ్యిందట. ఇక్కడే కాంగ్రెస్ ప్రయోగించబోయే సెంటిమెంటు మీద జనాల్లో అనుమానాలు పెరిగిపోతున్నాయి.
ఎందుకంటే తెలంగాణా సెంటిమెంటు 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ కే వర్కవుట్ కాలేదు. మొత్తం 119 నియోజకవర్గాల్లో అప్పట్లో టీఆర్ఎస్ కు వచ్చిందే 61 సీట్లు. ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడానని, ఆమరణ నిరాహార దీక్ష చేశానని, చావునోట్లో తలపెట్టానని కేసీయార్ ఎన్నిమాటలు చెప్పినా జనాలు పెద్దగా పట్టించుకోలేదు. అప్పటి ఎన్నికల్లో కేసీయార్ వందశాతం సెంటిమెంటును రెచ్చగొట్టినా జనాలిచ్చింది కేవలం 61 సీట్లు మాత్రమే.
ఇక 2018 ముందస్తు ఎన్నికల్లో కూడా సెంటిమెంటు పెద్దగా కలిసిరాలేదు. మొదటి రెండు ఎన్నికల్లోను టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ నేతలు చేతకానితనమే ఎక్కువగా ఉంది. ప్రలోభాలకు లొంగిన 12 మంది కాంగ్రెస్ ఎంఎల్ఏలు టీఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు. అలాగే ఒత్తిళ్ళకు, ప్రలోభాలకు లొంగిపోయిన టీడీపీ ఎంఎల్ఏలు కూడా టీఆర్ఎస్ లో చేరారు. అప్పట్లోనే కాంగ్రెస్, టీడీపీ ఎంఎల్ఏలు గట్టిగా నిలబడుంటే రెండో ఎన్నికలోనే టీఆర్ఎస్ గెలుపు అనుమానంగా ఉండేది.
పై రెండు పార్టీలు కలిపే టీఆర్ఎస్ ను బలోపేతం చేశాయి. ఇక రాబోయే ఎన్నికల్లో సెంటిమెంటు వర్కవుటవుతుందని ఎవరు అనుకోవటం లేదు. అభివృద్ధి, అవినీతి, నిరుద్యోగం లాంటి అంశాలే కీలకపాత్ర పోషించబోతున్నాయి. వాస్తవం ఇలాగుంటే కాంగ్రెస్ మాత్రం తెలంగాణాను ఇచ్చింది మేమే..తెలంగాణాను తెచ్చింది మేమే అని చెప్పుకుంటే ఉపయోగం ఏమిటి ? చెప్పుకోవాల్సిన రెండు ఎన్నికల్లో సెంటిమెంటును ప్రయోగించలేకపోయింది. సెంటిమెంటును ఉపయోగించుకోవటంలో అప్పుడు ఫెయిలైన కాంగ్రెస్ ఇపుడు బీఆర్ఎస్ మీదకు ప్రయోగించేందుకు రెడీ అవుతోంది. మరిపుడు వర్కువుటవుతుందా ? ఏమో చూడాల్సిందే.
This post was last modified on September 2, 2023 2:35 pm
ఏపీలో లేడీ డాన్లు పెరిగిపోయారు.. వారి తోక కట్ చేస్తానంటూ సీఎం చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…