బీఆర్ఎస్ లోని కీలక నేతల్లో ఒకరైన మైనంపల్లి హనుమంతరావు పై బహిష్కరణ వేటు తప్పేలాలేదు. ప్రస్తుతం మైనంపల్లి మల్కాజ్ గిరి ఎంఎల్ఏగా ఉన్నారు. రాబోయే ఎన్నికల్లో ఎంఎల్ఏకి కేసీయార్ మళ్ళీ టికెట్ కూడా ఇచ్చారు. అయినా మైనంపల్లి మండిపోతున్నారు. ఎందుకంటే తన కుటుంబానికి రెండు టికెట్లు కావాలని చేసిన డిమాండ్ ను కేసీయార్ పట్టించుకోలేదు. మల్కాజ్ గిరిలో తనకు మెదక్ అసెంబ్లీ టికెట్ తన కొడుక్కు ఇవ్వాలని మైనంపల్లి చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు.
అయితే మైనంపల్లి ఎన్నిసార్లు డిమాండ్ చేసినా కేసీయార్ పట్టించుకోలేదు. దాంతో మండిపోయిన ఎంఎల్ఏ కేసీయార్ తో పాటు మంత్రి హరీష్ రావుపైన నోటికొచ్చినట్లు మాట్లాడారు. దాంతో కేసీయార్ కు బాగా కోపమొచ్చినా ఎన్నికల సమయం కదాని తమాయించుకున్నారు. దాన్ని మైనంపల్లి అలుసుగా తీసుకున్నారు. అందుకనే మైనంపల్లిని పార్టీలో నుండి బయటకు పంపేయాలనే డిమాండ్లు పెరిగిపోతున్నాయి. దాంతో మైనంపల్లిపై బహిష్కరణ వేటు తప్పదనే ప్రచారం పెరిగిపోతోంది.
మూడు నాలుగు నియోజకవర్గాల్లో మైనంపల్లి ప్రభావం ఉంటుందనే అనుమానంతోనే ఇంతకాలం కేసీయార్ ఓపిక పట్టారు. అయితే మైనంపల్లిపై బహిష్కరణ వేటు వేసి ఆ స్ధానాన్ని గ్రేటర్ హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ రావుతో భర్తీ చేయాలని డిసైడ్ అయ్యారట. బొంతు ఉప్పల్ టికెట్ అడిగితే కేసీయార్ ఇవ్వలేదు. దాంతో అసంతృప్తిగా ఉన్న బొంతును పిలిపించుకుని కేసీయార్ మాట్లాడారట. మైనంపల్లి స్ధానాన్ని బొంతుతో భర్తీ చేయాలని కేసీయార్ అనుకుంటున్నట్లు పార్టీలో బాగా ప్రచారం పెరిగిపోతోంది.
హరీష్ రావు, అమెరికా పర్యటనలో ఉన్న కేటీయార్ కూడా మల్కాజ్ గిరి నియోజకవర్గంలో బొంతు ఎంపికపై కేసీయార్ తో సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. బొంతు గనుక పోటీచేయటం ఫైనల్ అయిపోతే ఇక మైనంపల్లికి నోటీసు ఇవ్వబోతున్నారట. నోటీసుకు మైనంపల్లి ఇచ్చే సమాధానం ఆధారంగా బహిష్కరణ వేటు వేయబోతున్నట్లు టాక్ . ఎలాగై మైనంపల్లిని పార్టీ నుండి తరిమేయాలని అనుకున్నారు. అందుకనే కాస్త ప్రొసీజన్ ఫాలో అయితే బాగుంటందని అనుకున్నారట. సో మైనంపల్లి బహిష్కరణకు రంగం సిద్ధమైనట్లే అనిపిస్తోంది.
This post was last modified on September 2, 2023 11:55 am
ఎన్నికలు అనగానే నాయకుల్లో మార్పులు సహజం. మరీ ముఖ్యంగా ప్రధాన మంత్రినరేంద్ర మోడీ అయితే.. మరింత ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటారు.…
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…