Political News

ఒక్కసారిగా హీటు పెంచేసిన మోడీ

దేశరాజకీయాల్లో  నరేంద్రమోడీ ఒక్కసారిగా హీటు పెంచేశారు. ఈనెల 18వ తేదీ నుండి 22వ తేదీ వరకు ఐదు రోజుల పాటు ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలను నిర్వహించబోతున్నారు. ఈ మేరకు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రకటించారు. మంత్రి ప్రకటన ఎప్పుడైతే వచ్చిందో వెంటనే రాజకీయ పార్టీలన్నీ అప్రమత్తమైపోయాయి. ఈమధ్యనే వర్షాకాల సమావేశాలు జరిగిన విషయం తెలిసిందే. అప్పుడే మోడీ ప్రభుత్వంపై ఇండియా కూటమి అవిశ్వాస తీర్మానం కూడా ప్రతిపాదించింది.

ఇంతలోనే మళ్ళీ ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు అంటే దేనికి అనే సందేహాలు పెరిగిపోతున్నాయి. పార్టీల అధినేతలు, మీడియా కూడా ఎవరికి తోచిన కారణాలను వాళ్ళు అంచనా వేస్తున్నారు. జమిలి ఎన్నికలు, ఉమ్మడి పౌరస్మృతి, మహిళా బిల్లు, లోక్ సభ రద్దు, ఓబీసీ వర్గీకరణ, హైదరాబాద్ ను దేశానికి రెండో రాజధానిగా ప్రకటించటం లాంటి అనేక అంశాలను ఊహించుకుంటున్నారు. ప్రభుత్వం లేదా అధికార పార్టీ నుండి మాత్రం ఎలాంటి లీకులు బయటకు రాలేదు.

ఈ కారణంగానే అన్ని వర్గాల్లోను టెన్షన్ పెరిగిపోతోంది. జమిలి ఎన్నికల విషయం తీసుకుంటే నిర్వహణ, ఆచరణ సాధ్యం కాదని ఈ మధ్య కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రకటించింది. కాబట్టి జమిలి ఎన్నికల అంశాన్ని మళ్ళీ తెరపైకి తీసుకువస్తుందా అనేది సందేహం. ఇక లోక్ సభకు ముందస్తు ఎన్నికల అంశం కూడా కీలకమే. అయితే ఇందుకోసం ప్రత్యేకంగా పార్లమెంటు సమావేశాలు పెట్టాల్సిన అవసరంలేదు. ముందస్తు ఎన్నికలకు పార్లమెంటు సమావేశాలకు ఎలాంటి సంబంధం లేదు. ఎందుకంటే ముందస్తు ఎన్నికలపై నిర్ణయం తీసుకోవాల్సింది  క్యాబినెట్  మాత్రమే. మోడీ తలచుకుంటే క్యాబినెట్ నిర్ణయించేసినట్లే.

ఇక మహిళా బిల్లు, ఉమ్మడి పౌరస్మృతి బిల్లులకు ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు అవసరమే లేదు. రాబోయే శీతాకాల సమావేశాల్లో కూడా బిల్లులు పెట్టచ్చు. హైదరాబాద్ ను దేశానికి రెండో రాజధాని అనంటున్నారు. ఇదొక్కటే కాస్త అనుమానంగా ఉంది. ఈ అంశం దశాబ్దాలుగా నలుగుతోంది. దీనివల్ల బీజేపీకి ప్రత్యేకంగా జరగబోయే లాభం ఏమిటో అర్ధంకావటం లేదు. మొత్తానికి కారణం ఏమిటో బయటకు చెప్పకుండా ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు అనగానే పొలిటికల్ హీట్ మాత్రం పెరిగిపోతోంది. మరి సస్పెన్స్ ఎప్పుడు బయటపడుతుందో ఏమో.

This post was last modified on September 1, 2023 1:26 pm

Share
Show comments
Published by
Tharun

Recent Posts

ఒక‌రు తీర్థ యాత్ర‌లు.. మ‌రొక‌రు విదేశీ యాత్ర‌లు!

ఏపీలో ఎన్నిక‌లు ముగిసిన త‌ర్వాత‌.. ఒక‌వైపు తీవ్రమైన హింస చెల‌రేగిన విష‌యం తెలిసిందే. ఇదెలా ఉన్నా అధికార, ప్ర‌తిపక్ష నాయ‌కులు…

1 hour ago

పోలీసులు ఏంచేస్తున్నారు.. చంద్ర‌బాబు ఆవేద‌న‌

ఏపీలో జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల పోలింగ్ అనంత‌రం.. ప‌ల్నాడు, తిరుప‌తి, తాడిప‌త్రి ప్రాంతాల్లో చెల‌రేగిన హింస‌పై చంద్ర‌బాబు ఆవేద‌న వ్య‌క్తం…

1 hour ago

ఏపీ హింస‌.. నిప్పులు చెరిగిన ఈసీ..

రాష్ట్రంలో జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల పోలింగ్ ప్ర‌క్రియ ముగిసిన త‌ర్వాత చెల‌రేగిన తీవ్ర హింస‌ పై కేంద్ర ఎన్నికల సంఘం…

7 hours ago

దెయ్యాన్ని ప్రేమించే ‘లవ్ మీ’ కుర్రాడు

https://www.youtube.com/watch?v=BacOcD8e_3k బాక్సాఫీస్ డ్రైగా ఉన్న టైంలో సరైన సినిమా కోసం మూవీ లవర్సే కాదు ట్రేడ్ మొత్తం ఎదురు చూస్తోంది.…

14 hours ago

రవితేజ సమస్యే నానికి వచ్చిందా

కథలు, కాంబోలు చూసేందుకు ఎంత బాగున్నా బడ్జెట్ విషయంలో ప్రాక్టికల్ గా ఆలోచించకపోతే చాలా సమస్యలు తలెత్తే పరిస్థితులను నిర్మాతలు…

17 hours ago

విశ్వంభరలో స్టాలిన్ అక్కయ్య

చిరంజీవి హీరోగా వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న విశ్వంభర షూటింగ్ ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్విరామంగా జరిగిపోతోంది. ఎన్నికలు ప్లస్ విదేశీ…

18 hours ago