Political News

ఒక్కసారిగా హీటు పెంచేసిన మోడీ

దేశరాజకీయాల్లో  నరేంద్రమోడీ ఒక్కసారిగా హీటు పెంచేశారు. ఈనెల 18వ తేదీ నుండి 22వ తేదీ వరకు ఐదు రోజుల పాటు ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలను నిర్వహించబోతున్నారు. ఈ మేరకు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రకటించారు. మంత్రి ప్రకటన ఎప్పుడైతే వచ్చిందో వెంటనే రాజకీయ పార్టీలన్నీ అప్రమత్తమైపోయాయి. ఈమధ్యనే వర్షాకాల సమావేశాలు జరిగిన విషయం తెలిసిందే. అప్పుడే మోడీ ప్రభుత్వంపై ఇండియా కూటమి అవిశ్వాస తీర్మానం కూడా ప్రతిపాదించింది.

ఇంతలోనే మళ్ళీ ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు అంటే దేనికి అనే సందేహాలు పెరిగిపోతున్నాయి. పార్టీల అధినేతలు, మీడియా కూడా ఎవరికి తోచిన కారణాలను వాళ్ళు అంచనా వేస్తున్నారు. జమిలి ఎన్నికలు, ఉమ్మడి పౌరస్మృతి, మహిళా బిల్లు, లోక్ సభ రద్దు, ఓబీసీ వర్గీకరణ, హైదరాబాద్ ను దేశానికి రెండో రాజధానిగా ప్రకటించటం లాంటి అనేక అంశాలను ఊహించుకుంటున్నారు. ప్రభుత్వం లేదా అధికార పార్టీ నుండి మాత్రం ఎలాంటి లీకులు బయటకు రాలేదు.

ఈ కారణంగానే అన్ని వర్గాల్లోను టెన్షన్ పెరిగిపోతోంది. జమిలి ఎన్నికల విషయం తీసుకుంటే నిర్వహణ, ఆచరణ సాధ్యం కాదని ఈ మధ్య కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రకటించింది. కాబట్టి జమిలి ఎన్నికల అంశాన్ని మళ్ళీ తెరపైకి తీసుకువస్తుందా అనేది సందేహం. ఇక లోక్ సభకు ముందస్తు ఎన్నికల అంశం కూడా కీలకమే. అయితే ఇందుకోసం ప్రత్యేకంగా పార్లమెంటు సమావేశాలు పెట్టాల్సిన అవసరంలేదు. ముందస్తు ఎన్నికలకు పార్లమెంటు సమావేశాలకు ఎలాంటి సంబంధం లేదు. ఎందుకంటే ముందస్తు ఎన్నికలపై నిర్ణయం తీసుకోవాల్సింది  క్యాబినెట్  మాత్రమే. మోడీ తలచుకుంటే క్యాబినెట్ నిర్ణయించేసినట్లే.

ఇక మహిళా బిల్లు, ఉమ్మడి పౌరస్మృతి బిల్లులకు ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు అవసరమే లేదు. రాబోయే శీతాకాల సమావేశాల్లో కూడా బిల్లులు పెట్టచ్చు. హైదరాబాద్ ను దేశానికి రెండో రాజధాని అనంటున్నారు. ఇదొక్కటే కాస్త అనుమానంగా ఉంది. ఈ అంశం దశాబ్దాలుగా నలుగుతోంది. దీనివల్ల బీజేపీకి ప్రత్యేకంగా జరగబోయే లాభం ఏమిటో అర్ధంకావటం లేదు. మొత్తానికి కారణం ఏమిటో బయటకు చెప్పకుండా ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు అనగానే పొలిటికల్ హీట్ మాత్రం పెరిగిపోతోంది. మరి సస్పెన్స్ ఎప్పుడు బయటపడుతుందో ఏమో.

This post was last modified on September 1, 2023 1:26 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రేట్లు లేకపోయినా రాజాసాబ్ లాగుతాడా?

ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…

16 minutes ago

అడిగిన వెంటనే ట్రైనీ కానిస్టేబుళ్లకు 3 రెట్లు పెంపు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్‌లో 5,757…

5 hours ago

గంటలో ఆర్డర్స్… ఇదెక్కడి స్పీడు పవన్ సారూ!

అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…

5 hours ago

సూర్య అభిమానులు కోపంగా ఉన్నారు

తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…

5 hours ago

క్రిస్మస్‌కు ఎన్ని సినిమాలు బాబోయ్

అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…

6 hours ago

రచయితగా కొత్త రూటులో టాలీవుడ్ హీరో?

ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…

8 hours ago