రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన స్వర్ణ ప్యాలెస్ ఫైర్ యాక్సిడెంట్ ఉదంతంలో కీలక వ్యక్తులు గాయబ్ కావటం తెలిసిందే. వారిని విచారిస్తేకానీ.. ఈ ప్రమాదానికి సంబంధించిన స్పష్టత రాని పరిస్థితి.
ఈ ప్రమాదం చోటు చేసుకున్న తర్వాత నుంచి రమేశ్ ఆసుపత్రి ఎండీ పి. రమేశ్ బాబు.. స్వర్ణాప్యాలెస్ ఎండీ ముత్తవరపు శ్రీనివాసరావుతో సహా పలువురు కీలక వ్యక్తుల ఆచూకీ తెలీకుండా ఉంది.
వారు పరారైనట్లుగా చెబుతున్నారు. వారిని విచారించినప్పుడు మాత్రం ఈ ప్రమాదానికి కారణాలు తెలిసే వీలుంది. దీంతో.. వీరి కోసం ప్రయత్నించిన పోలీసులు ఆచూకీ తెలుసుకునేందుకు ఊహించని రీతిలో నిర్ణయాన్ని తీసుకున్నారు. ఈ ప్రమాదం తర్వాత.. పోలీసులు అడిగిన డాక్యుమెంట్లలో ఏ ఒక్క పత్రాన్ని స్వర్ణా ప్యాలెస్ యాజమాన్యం కానీ రమేశ్ ఆసుపత్రి వారు కానీ ఇవ్వలేదంటున్నారు.
దీంతో.. వీరి ఆచూకీ కోసం పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టారు. హైదరాబాద్.. చెన్నై.. బెంగళూరుల్లోనూ గాలింపులు జరుపుతున్నట్లుగా పోలీసులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో స్వర్ణా ప్యాలెస్ ఆగ్నిప్రమాదంలో కీలక వ్యక్తులుగా మారిన వారి వివరాల్ని పోలీసులకు తెలియజేస్తే రూ.లక్ష నజరానా ఇవ్వనున్నట్లుగా ఏపీ పోలీసులు చెబుతున్నారు. మరి.. పోలీసులు ప్రకటించిన రూ.లక్షతో అయినా పరిస్థితుల్లో మార్పు వచ్చి.. వారి వివరాలు తెలుస్తాయా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.
This post was last modified on August 21, 2020 10:57 am
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనలో భాగంగా ఢిల్లీలోని 'హైదరాబాద్ హౌస్'లో బస చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.…
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…
బడ్జెట్ రెండు వందల ఎనభై కోట్ల పైమాటే. అదిరిపోయే బాలీవుడ్ క్యాస్టింగ్ ఉంది. యాక్షన్ విజువల్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్…
చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…
2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…
ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…