రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన స్వర్ణ ప్యాలెస్ ఫైర్ యాక్సిడెంట్ ఉదంతంలో కీలక వ్యక్తులు గాయబ్ కావటం తెలిసిందే. వారిని విచారిస్తేకానీ.. ఈ ప్రమాదానికి సంబంధించిన స్పష్టత రాని పరిస్థితి.
ఈ ప్రమాదం చోటు చేసుకున్న తర్వాత నుంచి రమేశ్ ఆసుపత్రి ఎండీ పి. రమేశ్ బాబు.. స్వర్ణాప్యాలెస్ ఎండీ ముత్తవరపు శ్రీనివాసరావుతో సహా పలువురు కీలక వ్యక్తుల ఆచూకీ తెలీకుండా ఉంది.
వారు పరారైనట్లుగా చెబుతున్నారు. వారిని విచారించినప్పుడు మాత్రం ఈ ప్రమాదానికి కారణాలు తెలిసే వీలుంది. దీంతో.. వీరి కోసం ప్రయత్నించిన పోలీసులు ఆచూకీ తెలుసుకునేందుకు ఊహించని రీతిలో నిర్ణయాన్ని తీసుకున్నారు. ఈ ప్రమాదం తర్వాత.. పోలీసులు అడిగిన డాక్యుమెంట్లలో ఏ ఒక్క పత్రాన్ని స్వర్ణా ప్యాలెస్ యాజమాన్యం కానీ రమేశ్ ఆసుపత్రి వారు కానీ ఇవ్వలేదంటున్నారు.
దీంతో.. వీరి ఆచూకీ కోసం పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టారు. హైదరాబాద్.. చెన్నై.. బెంగళూరుల్లోనూ గాలింపులు జరుపుతున్నట్లుగా పోలీసులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో స్వర్ణా ప్యాలెస్ ఆగ్నిప్రమాదంలో కీలక వ్యక్తులుగా మారిన వారి వివరాల్ని పోలీసులకు తెలియజేస్తే రూ.లక్ష నజరానా ఇవ్వనున్నట్లుగా ఏపీ పోలీసులు చెబుతున్నారు. మరి.. పోలీసులు ప్రకటించిన రూ.లక్షతో అయినా పరిస్థితుల్లో మార్పు వచ్చి.. వారి వివరాలు తెలుస్తాయా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.
This post was last modified on August 21, 2020 10:57 am
ఏప్రిల్ 30 'పెద్ది' తప్పుకున్నాక అందరి దృష్టి ఆ స్లాట్ మీద పడింది. ఇది ముందే ఊహించిన 'గాయపడ్డ సింహం'…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. వాస్తవానికి ఇప్పటికే చాలా బిల్లులు పెండింగులో ఉండగా..…
అమెరికాను నెంబర్ వన్ చేయాలన్న పేరుతో ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుంటూ.. ప్రపంచాన్ని ఆగమాగం చేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇమేజ్…
‘అమరావతి’ని ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా నిర్ణయిస్తూ ఏపీ అసెంబ్లీ పెట్టిన తీర్మానం మీద ఇటీవలే ఒక టీవీ ఛానెల్లో చర్చా…
కంటెంట్ మీద ఎంత నమ్మకం ఉన్నా ప్రీమియర్ల విషయంలో నిర్మాతలు ఒకటికి పదిసార్లు ఆలోచించే పరిస్థితులు ఇప్పుడున్నాయి. కొన్నిసార్లు ఈ…
జివి ప్రకాష్ కుమార్ మనకూ బాగా సుపరిచితుడైన సంగీత దర్శకుడు. తమిళంలో అయితే రెగ్యులర్ గా హీరోగా కూడా నటిస్తూ…