ఏపీ, తెలంగాణ రాజకీయాలపై కొంతకాలంగా వామపక్ష పార్టీల నేతలు సంచలన వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఏపీలో బీజేపీతో టీడీపీ కలిసి పోటీ చేస్తే జగన్ నెత్తిన పాలుపోసినట్లేనని, వైసీపీ గెలుపునకు చంద్రబాబు గేట్లు తెరచినట్లేనని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కొద్ది రోజుల క్రితం చేసిన కామెంట్లు రాజకీయ కాక రేపాయి. వామపక్ష పార్టీలతో కలిసి బరిలోకి దిగితే వైసీపీని ఓడించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ నేపథ్యంలోనే తాజాగా అదే తరహాలో టీడీపీ, బీజేపీల పొత్తు వ్యవహారంపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ షాకింగ్ కామెంట్లు చేశారు. ఏపీలో బీజేపీ, వైసీపీ కలిసే ఉన్నాయని, టీడీపీ కళ్లు తెరచి ఆ రెండు పార్టీలకు వ్యతిరేకంగా కూటమిని ఏర్పాటు చేయాలని చంద్రబాబుకు సూచించారు. పొత్తుల విషయంలో టీడీపీ ఊగిసలాట ధోరణిని వీడాలని సూచించారు. వైసీపీ, బీజేపీలు విడిపోవని, ఏపీలో బీజేపీ ఎంత పోరాడినా వైసీపీని ఓడించే పరిస్థితి లేదని అన్నారు.
ఏపీకి అన్ని రకాలుగా నష్టం చేకూర్చిన బీజేపీకి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా టీడీపీ మద్దతివ్వడం సరికాదన్నారు. సీపీఐ, సీపీఎం, జనసేనతో టీడీపీ ఓ ఫ్రంట్ ఏర్పాటు చేస్తే వైసీపీ, బీజేపీ డబుల్ ఇంజన్ ఫెయిల్ అవుతుందని జోస్యం చెప్పారు. చంద్రయాన్తో బీజేపీ ఎన్నికల మూడ్లోకి వెళ్లిందని, ఆ ప్రాంతానికి శివశక్తి అని పేరు పెట్టి ఓ మతాన్ని మచ్చిక చేసుకునే ప్రయత్నం చేసిందని ఆరోపించారు.
టీటీడీలో మద్యం వ్యాపారులకు స్థానం కల్పించడం సరికాదని, మాంసం అమ్మేవాళ్లను టీడీపీ మెంబర్లుగా చేశారని విమర్శించారు. కేసీఆర్ కు మునుగోడు ఎన్నికలో మద్దతిచ్చామని,
ఆ తర్వాత వెంటనే బీఆర్ఎస్ కు మద్దతు ఉపసంహరించుకొని ఉండాల్సిందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడూ కుమ్ములాటలే ఉంటాయని, తెలంగాణలో కమ్యూనిస్ట్లు, కాంగ్రెస్ కలిస్తే బీఆర్ఎస్కు డిపాజిట్లు దక్కవని ధీమా వ్యక్తం చేశారు.
This post was last modified on August 31, 2023 10:43 am
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…