ఏపీ, తెలంగాణ రాజకీయాలపై కొంతకాలంగా వామపక్ష పార్టీల నేతలు సంచలన వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఏపీలో బీజేపీతో టీడీపీ కలిసి పోటీ చేస్తే జగన్ నెత్తిన పాలుపోసినట్లేనని, వైసీపీ గెలుపునకు చంద్రబాబు గేట్లు తెరచినట్లేనని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కొద్ది రోజుల క్రితం చేసిన కామెంట్లు రాజకీయ కాక రేపాయి. వామపక్ష పార్టీలతో కలిసి బరిలోకి దిగితే వైసీపీని ఓడించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ నేపథ్యంలోనే తాజాగా అదే తరహాలో టీడీపీ, బీజేపీల పొత్తు వ్యవహారంపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ షాకింగ్ కామెంట్లు చేశారు. ఏపీలో బీజేపీ, వైసీపీ కలిసే ఉన్నాయని, టీడీపీ కళ్లు తెరచి ఆ రెండు పార్టీలకు వ్యతిరేకంగా కూటమిని ఏర్పాటు చేయాలని చంద్రబాబుకు సూచించారు. పొత్తుల విషయంలో టీడీపీ ఊగిసలాట ధోరణిని వీడాలని సూచించారు. వైసీపీ, బీజేపీలు విడిపోవని, ఏపీలో బీజేపీ ఎంత పోరాడినా వైసీపీని ఓడించే పరిస్థితి లేదని అన్నారు.
ఏపీకి అన్ని రకాలుగా నష్టం చేకూర్చిన బీజేపీకి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా టీడీపీ మద్దతివ్వడం సరికాదన్నారు. సీపీఐ, సీపీఎం, జనసేనతో టీడీపీ ఓ ఫ్రంట్ ఏర్పాటు చేస్తే వైసీపీ, బీజేపీ డబుల్ ఇంజన్ ఫెయిల్ అవుతుందని జోస్యం చెప్పారు. చంద్రయాన్తో బీజేపీ ఎన్నికల మూడ్లోకి వెళ్లిందని, ఆ ప్రాంతానికి శివశక్తి అని పేరు పెట్టి ఓ మతాన్ని మచ్చిక చేసుకునే ప్రయత్నం చేసిందని ఆరోపించారు.
టీటీడీలో మద్యం వ్యాపారులకు స్థానం కల్పించడం సరికాదని, మాంసం అమ్మేవాళ్లను టీడీపీ మెంబర్లుగా చేశారని విమర్శించారు. కేసీఆర్ కు మునుగోడు ఎన్నికలో మద్దతిచ్చామని,
ఆ తర్వాత వెంటనే బీఆర్ఎస్ కు మద్దతు ఉపసంహరించుకొని ఉండాల్సిందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడూ కుమ్ములాటలే ఉంటాయని, తెలంగాణలో కమ్యూనిస్ట్లు, కాంగ్రెస్ కలిస్తే బీఆర్ఎస్కు డిపాజిట్లు దక్కవని ధీమా వ్యక్తం చేశారు.
This post was last modified on August 31, 2023 10:43 am
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతల్లో ఒకరైన కొడాలి నానికి తెలుగుదేశం అన్నా, జనసేన అన్నా ఎంత కోపమో ప్రత్యేకంగా…
హైడ్రా కూల్చివేతలపై చాలామంది ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. మరికొంత మంది మాత్రం నాలాలపై, చెరువలు…
మాస్ రాజా రవితేజ కొత్త సినిమా ఇరుముడి తెలుగు రాష్ట్రాలతో పాటు తెలుగు వాళ్లుండే ప్రతి చోటా ఇరగాడేస్తోంది. తెలుగులో…
బాక్సాఫీస్ వద్ద వీర విహారం చేస్తున్న ఇరుముడి ఎక్కడికి వెళ్తుందో ఎవరికి అంతు చిక్కడం లేదు. పాజిటివ్ టాక్ రావడంలో…
అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ కొత్త సినిమా ‘రాకా’ మొదలైనపుడే అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. సన్ పిక్చర్స్ ప్రొడక్షన్లో…
విశాఖపట్నంలో విద్యార్థులు చెలరేగిపోయారు. ప్రేమ వ్యవహారంలో రెండు గ్రూపులుగా విడిపోయి కర్రలు, రాడ్లు పట్టుకొని రోడ్డెక్కారు. సినిమా తరహాలో నడి…