రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం రాజకీయ పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే 115 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించేసి బీఆర్ఎస్ ఓ మెట్టుపైనే నిల్చుంది. కాంగ్రెస్ ఏమో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను కొనసాగిస్తోంది. కానీ ఈ విషయంలో బీజేపీ అనుసరిస్తున్న వ్యూహం ఏమిటన్నది అర్థం కాకుండా ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇప్పట్లో బీజేపీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ప్రకటించే సూచనలు కనిపించడం లేదు. అయితే దీని వెనుక ఓ ప్రణాళిక ఉందనే ప్రచారం మాత్రం సాగుతోంది. ముందుగానే టికెట్లు ఇచ్చేస్తే.. నాయకులు తమ నియోజకవర్గాలకే పరిమితమవుతారని పార్టీ అధిష్ఠానం భావిస్తుందని టాక్. అలా జరిగితే, ముఖ్య నేతలు తమ నియోజకవర్గాలకే పరిమితమైతే పార్టీకి నష్టమని అధిష్టానం అంచనా వేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే ముందుగా అభ్యర్థులను ప్రకటించి దెబ్బ తినడం కంటే కూడా బీజేపీ తెలంగాణ ముఖ్య నేతలను జిల్లాల్లో తిప్పాలన్నది పార్టీ ప్లాన్ గా తెలుస్తోంది.
ఇప్పుడు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి ఉన్నారు. అటు జాతీయ ప్రధాన కార్యదర్శి బాధ్యతల్లో బండి సంజయ్ ఉన్నారు. వీళ్లు కాకుండా ఈటల రాజేందర్, డీకే అరుణ, లక్ష్మణ్, రఘునందన్.. ఇలా ఓ పది మంది వరకూ కీలక నేతలున్నారనే చెప్పాలి. ఎన్నికల షెడ్యూల్ వచ్చేకంటే ముందే ఈ నేతలందరినీ జిల్లా పర్యటనలకు పంపించి.. ఆయా స్థానాల్లో పార్టీని బలోపేతం చేసే దిశగా బీజేపీ సాగుతోందని సమాచారం. ముందుగానే అభ్యర్థులను ప్రకటించేస్తే వీళ్లు సొంత నియోజకవర్గాలపైనే ఫోకస్ పెట్టుకుంటారు. అప్పుడు ఇతర చోట్ల అభ్యర్థులు వెనుకబడటంతో అంతిమంగా పార్టీకి నష్టం కలుగుతోందని బీజేపీ భావిస్తోందని తెలిసింది.
This post was last modified on August 31, 2023 10:39 am
ఈ వారం టాలీవుడ్లో ఒక ఆసక్తికర అరంగేట్రం జరిగింది. ఇండస్ట్రీలో అతి పెద్ద కుటుంబాల్లో ఒకటైన ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి…
వైసీపీలో జగన్ అంటే ప్రాణం పెట్టేవారే ఉన్నారని, ఆయన గీసిన గీత దాటబోరని చెప్పే వారు కనిపిస్తారు. అయితే.. తాజాగా…
కథానాయికగా మలయాళంలో పరిచయం అయి.. తెలుగులో మంచి ఫాలోయింగ్, అవకాశాలు అందుకున్న అమ్మాయి అనుపమ పరమేశ్వరన్. ఆమె కెరీర్లో ఎక్కువ…
వైసీపీ నాయకుడు వాసుపల్లి గణేష్ ఎయిర్ పోర్టుకి పెళ్లికి లింక్ పెట్టి మాట్లాడ్డం సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఊరందరిదీ…
శర్వానంద్ ఈ ఏడాది నాలుగు నెలల గ్యాప్ లో రెండు సినిమాలు ఇచ్చాడు. నారి నారి నడుమ మురారి విపరీతమైన…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కెరీర్ పతాక స్థాయిలో ఉన్నపుడు ఆయనకు, కథానాయికలకు మధ్య లింకులు పెడుతూ అనేక వార్తలు వచ్చాయి. అందులో ఎక్కువ చర్చనీయాంశం…