Political News

ముందుగానే టికెట్లా.. ఆ నేతలు జిల్లాల్లో తిరగాలా?

రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం రాజకీయ పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే 115 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించేసి బీఆర్ఎస్ ఓ మెట్టుపైనే నిల్చుంది. కాంగ్రెస్ ఏమో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను కొనసాగిస్తోంది. కానీ ఈ విషయంలో బీజేపీ అనుసరిస్తున్న వ్యూహం ఏమిటన్నది అర్థం కాకుండా ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇప్పట్లో బీజేపీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ప్రకటించే సూచనలు కనిపించడం లేదు. అయితే దీని వెనుక ఓ ప్రణాళిక ఉందనే ప్రచారం మాత్రం సాగుతోంది. ముందుగానే టికెట్లు ఇచ్చేస్తే.. నాయకులు తమ నియోజకవర్గాలకే పరిమితమవుతారని పార్టీ అధిష్ఠానం భావిస్తుందని టాక్. అలా జరిగితే, ముఖ్య నేతలు తమ నియోజకవర్గాలకే పరిమితమైతే పార్టీకి నష్టమని అధిష్టానం అంచనా వేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే ముందుగా అభ్యర్థులను ప్రకటించి దెబ్బ తినడం కంటే కూడా బీజేపీ తెలంగాణ ముఖ్య నేతలను జిల్లాల్లో తిప్పాలన్నది పార్టీ ప్లాన్ గా తెలుస్తోంది.

ఇప్పుడు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి ఉన్నారు. అటు జాతీయ ప్రధాన కార్యదర్శి బాధ్యతల్లో బండి సంజయ్ ఉన్నారు. వీళ్లు కాకుండా ఈటల రాజేందర్, డీకే అరుణ, లక్ష్మణ్, రఘునందన్.. ఇలా ఓ పది మంది వరకూ కీలక నేతలున్నారనే చెప్పాలి. ఎన్నికల షెడ్యూల్ వచ్చేకంటే ముందే ఈ నేతలందరినీ జిల్లా పర్యటనలకు పంపించి.. ఆయా స్థానాల్లో పార్టీని బలోపేతం చేసే దిశగా బీజేపీ సాగుతోందని సమాచారం. ముందుగానే అభ్యర్థులను ప్రకటించేస్తే వీళ్లు సొంత నియోజకవర్గాలపైనే ఫోకస్ పెట్టుకుంటారు. అప్పుడు ఇతర చోట్ల అభ్యర్థులు వెనుకబడటంతో అంతిమంగా పార్టీకి నష్టం కలుగుతోందని బీజేపీ భావిస్తోందని తెలిసింది. 

This post was last modified on August 31, 2023 10:39 am

Share
Show comments
Published by
Satya
Tags: BJPTelangana

Recent Posts

మళ్ళీ పవన్ పై కాంగ్రెస్ ఫైర్

ఏపీ ఉప ముఖ్య‌మంత్రి, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ కల్యాణ్‌పై.. తెలంగాణ కాంగ్రెస్ నాయ‌కులు భ‌గ్గుమ‌న్నారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ కాదు.. దిష్టి…

50 minutes ago

నాని ఎదుర్కున్న సమస్యే శ్రీవిష్ణుకి వస్తుందా

ఒకే హీరో రెండు సినిమాలు ఒకే టైంలో రిలీజ్ కు రెడీ కావడమంత సంకట పరిస్థితి మరొకటి ఉండదు. గతంలో…

7 hours ago

మూడు రోజులుగా లడ్డూ లడాయి.. వైసీపీ ట్రాప్‌లో చిక్కారా?

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా కూటమి…

7 hours ago

తిరుమ‌ల ల‌డ్డూపై క‌మిష‌న్‌.. సూత్రధారులు దొరుకుతారా?

తిరుమ‌ల శ్రీవారి ల‌డ్డూలో క‌ల్తీ నెయ్యి వినియోగంపై ప్ర‌స్తుతం సీబీఐ విచార‌ణ చేసింది. దీనికి సంబంధించిన చార్జిషీట్‌ను కూడా నెల్లూరు…

9 hours ago

రాజా సాబ్ మళ్ళీ టార్గెట్ అవుతాడా

డిజాస్టర్లు ప్రతి హీరో, దర్శకుడికి ఉంటాయి కానీ రాజా సాబ్ విషయంలో మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఎవరయ్యా అంటే ఠక్కున…

9 hours ago

అర్జున్ ఈ విషయంలో అదృష్టవంతుడే

వచ్చే వారం విడుదల కాబోతున్న సినిమాల్లో సీత పయనం ఉంది. పేరు వింటే పెద్దగా విశేషం అనిపించదు కానీ ఈ…

10 hours ago