Political News

ముందుగానే టికెట్లా.. ఆ నేతలు జిల్లాల్లో తిరగాలా?

రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం రాజకీయ పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే 115 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించేసి బీఆర్ఎస్ ఓ మెట్టుపైనే నిల్చుంది. కాంగ్రెస్ ఏమో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను కొనసాగిస్తోంది. కానీ ఈ విషయంలో బీజేపీ అనుసరిస్తున్న వ్యూహం ఏమిటన్నది అర్థం కాకుండా ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇప్పట్లో బీజేపీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ప్రకటించే సూచనలు కనిపించడం లేదు. అయితే దీని వెనుక ఓ ప్రణాళిక ఉందనే ప్రచారం మాత్రం సాగుతోంది. ముందుగానే టికెట్లు ఇచ్చేస్తే.. నాయకులు తమ నియోజకవర్గాలకే పరిమితమవుతారని పార్టీ అధిష్ఠానం భావిస్తుందని టాక్. అలా జరిగితే, ముఖ్య నేతలు తమ నియోజకవర్గాలకే పరిమితమైతే పార్టీకి నష్టమని అధిష్టానం అంచనా వేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే ముందుగా అభ్యర్థులను ప్రకటించి దెబ్బ తినడం కంటే కూడా బీజేపీ తెలంగాణ ముఖ్య నేతలను జిల్లాల్లో తిప్పాలన్నది పార్టీ ప్లాన్ గా తెలుస్తోంది.

ఇప్పుడు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి ఉన్నారు. అటు జాతీయ ప్రధాన కార్యదర్శి బాధ్యతల్లో బండి సంజయ్ ఉన్నారు. వీళ్లు కాకుండా ఈటల రాజేందర్, డీకే అరుణ, లక్ష్మణ్, రఘునందన్.. ఇలా ఓ పది మంది వరకూ కీలక నేతలున్నారనే చెప్పాలి. ఎన్నికల షెడ్యూల్ వచ్చేకంటే ముందే ఈ నేతలందరినీ జిల్లా పర్యటనలకు పంపించి.. ఆయా స్థానాల్లో పార్టీని బలోపేతం చేసే దిశగా బీజేపీ సాగుతోందని సమాచారం. ముందుగానే అభ్యర్థులను ప్రకటించేస్తే వీళ్లు సొంత నియోజకవర్గాలపైనే ఫోకస్ పెట్టుకుంటారు. అప్పుడు ఇతర చోట్ల అభ్యర్థులు వెనుకబడటంతో అంతిమంగా పార్టీకి నష్టం కలుగుతోందని బీజేపీ భావిస్తోందని తెలిసింది. 

This post was last modified on August 31, 2023 10:39 am

Share

Recent Posts

సాలిడ్ కంటెంట్ పడితే రవితేజ స్టామినా ఇది

టాలీవుడ్ థియేటర్ల దగ్గర ఇరుముడి సందడి ఓ రేంజ్ లో ఉంది. సెకండ్ షోలు సైతం టికెట్ ముక్క దొరకనంతగా…

1 minute ago

వివేకా హత్యకు రూ.40 కోట్ల సుపారీ?

కడప ఎంపీ, వైసీపీ అధినేత జగన్ సోదరుడు వైఎస్ అవినాష్ రెడ్డి గృహాల్లో ఈడీ సోదాలతో మాజీ మంత్రి వైఎస్…

2 hours ago

మెగాస్టార్ ప్రస్థానం… టాలీవుడ్ మాస్ సంతకం

తెలుగు సినిమా పుట్టిన తర్వాత ఎందరో లెజెండ్స్ ప్రేక్షకుల హృదయాల మీద చెరిగిపోని సంతకం చేశారు. చిత్తూరు నాగయ్య నుంచి…

3 hours ago

సందీప్ వంగ ‘చిరు’ ఫ్యానిజం… ఇది చాలా లోతు బాసూ

అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ ఇలా తీసింది మూడు సినిమాలే అయినా ప్యాన్ ఇండియా లెవెల్ లో పాపులారిటీ…

3 hours ago

చిరంజీవి కాకా… అదిరింది కానుక

ఈ సంవత్సరం మన శంకరవరప్రసాద్ గారుతో మూడు వందల కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న మెగాస్టార్ చిరంజీవి వచ్చే…

3 hours ago

ప్యారడైజ్ నిర్ణయం ఇరుముడికి వరం

ఒక్కోసారి మనం తీసుకునే నిర్ణయాలు పక్కవాళ్ళకు మేలు చేస్తాయి. ఇండస్ట్రీలో కూడా ఇది సర్వ సాధారణం. కాకపోతే ఈ ప్రయోజనం…

4 hours ago