రక్షాబంధన్ కానుకగా మహిళలకు నరేంద్రమోడీ ప్రభుత్వం తీపి కబురు చెప్పిందంటు బీజేపీ ఒకటే ఊదరగొడుతోంది. ఇంతకీ ఆ తీపికబురు ఏమిటంటే గ్యాస్ ధర 200 రూపాయలు తగ్గించిందట. అలాగే ఉజ్వల్ పథకంలో గ్యాస్ సిలిండర్ ను ఉపయోగిస్తున్న లబ్దిదారులకు ఏకంగా 400 రూపాయలు తగ్గిందని బీజేపీ నేతల సంబరాలు చేసుకుంటున్నారు. గ్యాస్ ధర తగ్గించటమంటే మోడీ కచ్చితంగా మహిళలకు ఇచ్చిన రక్షాబంధన్ కానుకే అంటున్నారు.
కేంద్రప్రభుత్వం తీసుకన్న తాజా నిర్ణయం వల్ల 33 కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఉపయోగిస్తున్న మహిళలకు మేలు జరుగుతుందంటున్నారు. అలాగే 75 లక్షల అదనపు ఉజ్వల కనెక్షన్లు మంజూరు చేయాలని కూడా కేంద్ర క్యాబినెట్ నిర్ణయించింది. ఇపుడు తీసుకున్న నిర్ణయాన్ని రక్షాబంధన్ కన్నా ఎన్నికల బంధన్ అని చెప్పకతప్పదు. ఎందుకంటే రక్షాబంధన్ కానుకంటే మరి పోయి ఏడాది అంతకుముందు ఏడాది కూడా రక్షాబంధన్ పండుగ వచ్చింది కదా అప్పుడెందుకు గ్యాస్ ధర తగ్గించలేదు.
సడెన్ గా ఇపుడు రక్షాబంధన్ పండుగే ఎందుకు గుర్తుకొచ్చింది ? ఎందుకంటే మరో నాలుగు నెలల్లో ఎన్నికలు వస్తున్నాయి కాబట్టే. తెలంగాణా, మధ్యప్రదేశ్, చత్తీస్ ఘర్, మిజోరం, రాజస్ధాన్ అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతోన్నాయి. వీటిల్లో గెలవటం బీజేపీకి చాలా అవసరం. ప్రీ పోల్ సర్వేల్లో మధ్యప్రదేశ్ చత్తీస్ ఘర్ లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశముందని తేలింది. రాజస్ధాన్ లో మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలుపుకునే అవకాశముందని ప్రీపోల్ సర్వేలు చెబుతున్నాయి. ఇక తెలంగాణాలో అధికారంలోకి వచ్చే అవకాశం బీజేపీకి ఎలాగూ లేదు.
అంటే ఎన్నికలు జరిగే ఐదు రాష్ట్రాల్లో బీజేపీకి గెలుపు అవకాశాలు ఎక్కడా లేదని అర్ధమైనట్లుంది. అందుకనే మోడీకి సడన్ గా రక్షాబంధన్ పండుగ గుర్తుకొచ్చింది. 450 రూపాయలు ఉన్న గ్యాస్ సిలిండర్ ధరను మోడీ ప్రభుత్వం రు. 1200కి తీసుకెళ్ళింది. అందులో నుండి ఇపుడు ఒక 200 రూపాయలు తగ్గించి పండగ చేసుకోమంటోంది. ఎన్నికల ముందు పెట్రోల్ ధరలు తగ్గించటం తర్వాత మళ్ళీ పెంచేయటం ప్రభుత్వానికి అలవాటుగా మారిపోయింది. మరి మహిళలు ఏమిచేస్తారో చూడాల్సిందే.
This post was last modified on August 30, 2023 1:03 pm
టీడీపీతో రాజకీయం మొదలుపెట్టి...ఆపై బీఆర్ఎస్ లో చేరి సక్సెస్ ఫుల్ రాజకీయవేత్తగా ఎదిగిన మాజీ మంత్రి మల్లారెడ్డి త్వరలోనే మరోమారు పార్టీ…
వైసీపీ కీలక నేత, ఆ పార్టీ ఎమ్మెల్సీ అనంతబాబును పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. రాజమహేంద్రవరంలోని కోర్టు విచారణకు హాజరై తిరిగి…
రాష్ట్రానికి చెందిన పలువురు మంత్రులు సింగపూర్లో పర్యటిస్తున్నారు. మూడు రోజుల పర్యటన శుక్రవారం తో ముగియనుంది. మూడు రోజుల పర్యటనలో…
సినిమా ఇండస్ట్రీలో కొన్ని క్రేజీ కాంబినేషన్లు సెట్స్ పైకి వెళ్లకముందే సెన్సేషన్ క్రియేట్ చేస్తాయి. ముఖ్యంగా సూపర్ స్టార్ రజనీకాంత్,…
నందమూరి బాలకృష్ణ స్పీడ్ ను అందుకోవడం ఇప్పుడున్న కుర్ర హీరోలకు కూడా కష్టమే అనిపిస్తోంది. అఖండ 2 ఫ్లాప్ అయినా…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరిగింది. వాస్తవానికి గతంలో కొన్ని కొన్ని చెదురుమొదురు ఘటనలు జరిగేవి. తాజాగా…