Political News

ఇండియా ముంబై భేటీకి సోనియా?

ముంబైలో జరగబోతున్న ఇండియా కూటమి సమావేశానికి సోనియాగాంధి హాజరవబోతున్నారు.  ఈనెల 31వ తేదీన మొదలయ్యే రెండురోజుల సమావేశాలు చాలా కీలకం. అందుకనే కూటమిలోని కొన్నిపార్టీల అధినేతలు సోనియా హాజరవ్వాలని ప్రత్యేకంగా ఆహ్వానించారు. అందుకు సోనియా కూడా సానుకూలంగా స్పందించారు. ఇంతకీ అంతటి కీలకం ఏముంటంది ? ఏమిటంటే ఇండియాకూటమి కోసం ప్రత్యేకంగా జెండాను(లోగో) తయారు చేయబోతున్నారట.  అలాగే కన్వీనర్ పదవిపైన కూడా చర్చలు, నిర్ణయం ఉంటుంది.

ఇంతటి కీలకమైన సమావేశం కాబట్టి సోనియా కూడా ముంబై చేరుకుంటున్నారు. కూటమిలోని అన్నీ పార్టీలను ప్రతిఫలించేట్లుగా లోగో తయారుచేయటం చాలా అవసరమని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తో పాటు సీనియర్ నేతలు అనుకున్నారట. బహుశా రాబోయే ఎన్నికల్లో  ఈ కామన్ లోగో ద్వారానే బీజేపీని ఎదుర్కోవాలని ఇండియాకూటమి నిర్ణయించినట్లుంది. అందుకనే లోగోపై ఇప్పటికే భాగస్వామ్య పక్షాల మధ్య విస్తృతమైన చర్చలు జరుగుతున్నాయి.

అలాగే బెంగాల్ సీఎం మమతాబెనర్జీ కూడా 30వ తేదీనే ముంబై చేరుకుంటున్నారు. ఆ రోజంతా ఆమె బిజిబిజీగా గడుపుతారు. తర్వాత రెండురోజులు కూటమి సమావేశాలతో ఫుల్లు బిజీ. ఇప్పటికే లోగో డిజైన్ పై చాలా చర్చలు జరిగాయి. కాబట్టి ఈ విషయమై రెండురోజుల్లో ఫైనల్ నిర్ణయం తీసుకుంటారు. కూటమి లెక్క ఏమిటంటే రాబోయే ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధులపై వన్ ఆన్ వన్ అనే పద్దతిలో అభ్యర్ధులను పోటీలోకి దింపాలని.

ఈ వన్ ఆన్ వన్ అనే సూత్రం ఎంతవరకు అమల్లోకి వస్తుందో కాస్త అనుమానంగానే ఉంది. ఎందుకంటే ఆప్ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ లాంటి కొందరు తమిష్టం వచ్చినట్లు పార్టీ అభ్యర్ధులను పోటీలోకి దింపబోతున్నట్లు చెబుతున్నారు. ఇదే పద్దతి కంటిన్యు అయితే కూటమిలో చీలికలు తప్పవు. అందుకనే కూటమికి ప్రత్యేకంగా కన్వీనర్ ను నియమిస్తే సీట్లు, చర్చలు, పొత్తులు లాంటివన్నీ కన్వీనర్ సమక్షంలోనే చర్చలు జరపాలని అనుకుంటున్నారు. ఒకవేళ కన్వీనర్ నియామకం జరిగితే బహుశా చాలా సమస్యలు పరిష్కారమవుతాయేమో చూడాలి. 

This post was last modified on August 29, 2023 2:56 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ట్రంప్ దెబ్బ : ఆందోళనలో ప్యాన్ ఇండియా సినిమాలు

అమెరికాలో విడుదల కాబోయే విదేశీ సినిమాలకు ఇకపై వంద శాతం టారిఫ్ విధిస్తున్నట్టు ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ ప్రకటించడం ఒక్కసారిగా…

8 minutes ago

తమిళులు లేపుతున్నారు.. తెలుగోళ్లు లైట్ అంటున్నారు

గత కొన్నేళ్లలో తమిళ సినిమాల క్వాలిటీ బాగా పడిపోయిన మాట వాస్తవం. ఒకప్పుడు దేశంలోనే అత్యుత్తమ సినిమాలు తీసే ఇండస్ట్రీగా…

7 hours ago

పౌరసన్మాన సభలో బాలయ్య జోరు హుషారు

కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రెసిడెంట్ చేతుల మీదుగా పద్మభూషణ్ పురస్కారం అందుకున్న బాలకృష్ణకు పౌరసన్మాన సభ ఘనంగా జరిగింది. వేలాదిగా…

9 hours ago

అదిరిపోయేలా ‘మ‌హానాడు’.. ఈ ద‌ఫా మార్పు ఇదే!

టీడీపీకి ప్రాణ స‌మాన‌మైన కార్య‌క్ర‌మం ఏదైనా ఉంటే.. అది మ‌హానాడే. దివంగ‌త ముఖ్య‌మంత్రి, తెలుగువారిఅన్న‌గారు ఎన్టీఆర్ పుట్టిన రోజును పుర‌స్క‌రించుకుని..…

10 hours ago

శుభం దర్శకుడి కాన్ఫిడెన్స్ వేరే లెవల్

మే 9 విడుదల కాబోతున్న సినిమాల్లో  సమంత నిర్మించిన శుభం ఉంది. ప్రొడ్యూసర్ గా వ్యవహరించడమే కాదు ఒక క్యామియో…

11 hours ago

అఫిషియ‌ల్ : ప్ర‌ధాని వ‌స్తున్నారు.. ఏర్పాట్లు చేసుకోండి!

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర‌మోడీ రెండు రోజుల కింద‌టే అమ‌రావ‌తి రాజ‌ధాని ప్రాంతంలో ప‌ర్య‌టించారు. రాజ‌ధాని ప‌నుల‌కు పునః ప్రారంభం కూడా…

12 hours ago