Political News

ఇండియా ముంబై భేటీకి సోనియా?

ముంబైలో జరగబోతున్న ఇండియా కూటమి సమావేశానికి సోనియాగాంధి హాజరవబోతున్నారు.  ఈనెల 31వ తేదీన మొదలయ్యే రెండురోజుల సమావేశాలు చాలా కీలకం. అందుకనే కూటమిలోని కొన్నిపార్టీల అధినేతలు సోనియా హాజరవ్వాలని ప్రత్యేకంగా ఆహ్వానించారు. అందుకు సోనియా కూడా సానుకూలంగా స్పందించారు. ఇంతకీ అంతటి కీలకం ఏముంటంది ? ఏమిటంటే ఇండియాకూటమి కోసం ప్రత్యేకంగా జెండాను(లోగో) తయారు చేయబోతున్నారట.  అలాగే కన్వీనర్ పదవిపైన కూడా చర్చలు, నిర్ణయం ఉంటుంది.

ఇంతటి కీలకమైన సమావేశం కాబట్టి సోనియా కూడా ముంబై చేరుకుంటున్నారు. కూటమిలోని అన్నీ పార్టీలను ప్రతిఫలించేట్లుగా లోగో తయారుచేయటం చాలా అవసరమని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తో పాటు సీనియర్ నేతలు అనుకున్నారట. బహుశా రాబోయే ఎన్నికల్లో  ఈ కామన్ లోగో ద్వారానే బీజేపీని ఎదుర్కోవాలని ఇండియాకూటమి నిర్ణయించినట్లుంది. అందుకనే లోగోపై ఇప్పటికే భాగస్వామ్య పక్షాల మధ్య విస్తృతమైన చర్చలు జరుగుతున్నాయి.

అలాగే బెంగాల్ సీఎం మమతాబెనర్జీ కూడా 30వ తేదీనే ముంబై చేరుకుంటున్నారు. ఆ రోజంతా ఆమె బిజిబిజీగా గడుపుతారు. తర్వాత రెండురోజులు కూటమి సమావేశాలతో ఫుల్లు బిజీ. ఇప్పటికే లోగో డిజైన్ పై చాలా చర్చలు జరిగాయి. కాబట్టి ఈ విషయమై రెండురోజుల్లో ఫైనల్ నిర్ణయం తీసుకుంటారు. కూటమి లెక్క ఏమిటంటే రాబోయే ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధులపై వన్ ఆన్ వన్ అనే పద్దతిలో అభ్యర్ధులను పోటీలోకి దింపాలని.

ఈ వన్ ఆన్ వన్ అనే సూత్రం ఎంతవరకు అమల్లోకి వస్తుందో కాస్త అనుమానంగానే ఉంది. ఎందుకంటే ఆప్ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ లాంటి కొందరు తమిష్టం వచ్చినట్లు పార్టీ అభ్యర్ధులను పోటీలోకి దింపబోతున్నట్లు చెబుతున్నారు. ఇదే పద్దతి కంటిన్యు అయితే కూటమిలో చీలికలు తప్పవు. అందుకనే కూటమికి ప్రత్యేకంగా కన్వీనర్ ను నియమిస్తే సీట్లు, చర్చలు, పొత్తులు లాంటివన్నీ కన్వీనర్ సమక్షంలోనే చర్చలు జరపాలని అనుకుంటున్నారు. ఒకవేళ కన్వీనర్ నియామకం జరిగితే బహుశా చాలా సమస్యలు పరిష్కారమవుతాయేమో చూడాలి. 

This post was last modified on August 29, 2023 2:56 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

జ‌న‌నాయ‌గ‌న్ సంక్షోభం… నోరు విప్పిన విజ‌య్

త‌మిళంలో కొన్నేళ్లుగా నంబ‌ర్ వ‌న్ హీరోగా కొన‌సాగుతున్న విజ‌య్.. పూర్తి స్థాయి రాజ‌కీయాల్లోకి అడుగు పెట్టి, ఎన్నిక‌ల బ‌రిలోకి దిగే…

1 hour ago

బిగ్ బ్రేకింగ్: అంబటి రాంబాబు అరెస్ట్!

తీవ్ర ఉద్రిక్తతల నడుమ వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అంబటి రాంబాబు వివాదాస్పద…

1 hour ago

ఆఖరి పోరులో కివీస్‌ను చిత్తు చేసిన టీమిండియా!

న్యూజిలాండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్ ఘనంగా ముగించింది. శనివారం జరిగిన ఆఖరిదైన ఐదో టీ20లో టీమిండియా…

1 hour ago

అంబటికి సినిమా చూపిస్తామన్న పెమ్మసాని

తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారం సద్దుమణగక ముందే ఏపీ సీఎం చంద్రబాబును అంబటి రాంబాబు దుర్భాషలాడిన…

3 hours ago

సిట్ నోటీసులను లాజిక్ తో కొట్టిన కేసీఆర్

ఫోన్ ట్యాపింగ్ కేసులో నంది నగర్ లోని కేసీఆర్ నివాసంలోనే విచారణ జరుపుతామని సిట్‌ అధికారులు రెండోసారి కేసీఆర్ కు…

4 hours ago

ఆంధ్రా యువత ఎదురుచూపు… ఉగాదికి ముహూర్తం?

ఈ ఏడాది మార్చి-ఏప్రిల్ మ‌ధ్య జ‌రిగే తెలుగు సంవ‌త్స‌రాది ఉగాది ప‌ర్వ‌దినానికి భారీ ప్ర‌క‌ట‌న చేసేందుకు ఏపీ మంత్రి నారా…

5 hours ago