Political News

ఎమ్మెల్యే పదవి వద్దంటున్న కాంగ్రెస్ సీనియర్లు

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలో అందరూ సీనియర్ నేతలే. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో అందరూ కీలక నాయకులే. అందుకే అధికారం, పదవి కోసం ఇక్కడ ఆ పార్టీలో అంతర్గత విభేదాలు, వర్గపోరు ఎక్కువ అనే అభిప్రాయాలున్నాయి. ఇక ఎన్నికలు వస్తున్నాయంటే ఆ సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కానీ త్వరలో జరగబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి కొంతమంది కాంగ్రెస్ సీనియర్ నాయకులు దూరంగా ఉండడం చర్చనీయాంశంగా మారింది. ఇతర ప్రయోజనాలు ఆశించి ఈ నాయకులు టికెట్ల కోసం దరఖాస్తు చేసుకోకుండా ఉన్నారనే టాక్ వినిపిస్తోంది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ల దరఖాస్తు కోసం కాంగ్రెస్ విధించిన గడువు ఈ నెల 25తో ముగిసింది. 119 స్థానాలకు గాను 1000కి పైగా దరఖాస్తులు వచ్చాయని తెలిసింది. వీటిని వడబోసి చివరకు అభ్యర్థులను అధిష్ఠానం ప్రకటిస్తుంది. కానీ కొంతమంది తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఈ సారి దరఖాస్తు చేసుకోలేదు. వీ హనుమంతరావు, కొండా మురళి, జానారెడ్డి, నాగం జనార్ధన్ రెడ్డి, గీతారెడ్డి, రేణుక చౌదరి తదితర సీనియర్ నేతలు అసెంబ్లీ ఎన్నికల పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు.

అయితే ఈ సీనియర్ నాయకుల్లో కొంతమందిని అధిష్ఠానం లోక్ సభ ఎన్నికల బరిలో దించుతుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. అందుకే అసెంబ్లీ ఎన్నికలకు వీళ్లు దూరంగా ఉన్నారని టాక్. మరోవైపు ఒక కుటుంబానికి ఒకటే టికెట్ అనే అధిష్ఠానం నిబంధన కారణంగా కూడా కొంతమంది సీనియర్ నాయకులు దరఖాస్తు చేసుకోలేదని తెలిసింది. ఈ సారి సీనియర్ నాయకుడు జానారెడ్డి ఎన్నికల బరిలో నుంచి తప్పుకున్నాడు. కానీ ఆయన పెద్ద కుమారుడు రఘువీర్ రెడ్డి మిర్యాల గూడ నుంచి, చిన్నకొడుకు జైవీర్ రెడ్డి నాగార్జున సాగర్ నుంచి పోటీకి సిద్ధమవుతున్నారు.

This post was last modified on August 26, 2023 10:23 pm

Share
Show comments

Recent Posts

11 రూపాయల టికెట్లు రాంగా రైటా

ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేయడం చిన్న సినిమాల నిర్మాతలకు దినదిన గండంగా మారిపోయింది. ఆడియన్స్ అభిరుచులు మారిపోయాయో లేక ఓటిటిల…

55 minutes ago

అనిరుధ్ మీద హైదరాబాదీల ప్రేమ

మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…

3 hours ago

వేరే రాష్ట్రం నుంచి స్విగ్గీ ఏంటయ్యా ప్రభాస్?

తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్‌లో షూటింగ్స్…

5 hours ago

తిరుమల లడ్డూ వివాదం: 45 రోజుల్లో నిజాలు బహిర్గతం

ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…

5 hours ago

ప్రేక్షకుల మూడ్ ఇలా ఉందేంటి

ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…

7 hours ago

స్నేహితుడి కోసం… రాజీ పడని పవన్?

ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్‌తో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ సినిమాల‌కు టాటా చెప్పేస్తాడ‌ని గ‌త ఏడాది ఓ ప్ర‌చారం జ‌రిగింది.…

7 hours ago