Political News

ఎమ్మెల్యే పదవి వద్దంటున్న కాంగ్రెస్ సీనియర్లు

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలో అందరూ సీనియర్ నేతలే. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో అందరూ కీలక నాయకులే. అందుకే అధికారం, పదవి కోసం ఇక్కడ ఆ పార్టీలో అంతర్గత విభేదాలు, వర్గపోరు ఎక్కువ అనే అభిప్రాయాలున్నాయి. ఇక ఎన్నికలు వస్తున్నాయంటే ఆ సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కానీ త్వరలో జరగబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి కొంతమంది కాంగ్రెస్ సీనియర్ నాయకులు దూరంగా ఉండడం చర్చనీయాంశంగా మారింది. ఇతర ప్రయోజనాలు ఆశించి ఈ నాయకులు టికెట్ల కోసం దరఖాస్తు చేసుకోకుండా ఉన్నారనే టాక్ వినిపిస్తోంది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ల దరఖాస్తు కోసం కాంగ్రెస్ విధించిన గడువు ఈ నెల 25తో ముగిసింది. 119 స్థానాలకు గాను 1000కి పైగా దరఖాస్తులు వచ్చాయని తెలిసింది. వీటిని వడబోసి చివరకు అభ్యర్థులను అధిష్ఠానం ప్రకటిస్తుంది. కానీ కొంతమంది తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఈ సారి దరఖాస్తు చేసుకోలేదు. వీ హనుమంతరావు, కొండా మురళి, జానారెడ్డి, నాగం జనార్ధన్ రెడ్డి, గీతారెడ్డి, రేణుక చౌదరి తదితర సీనియర్ నేతలు అసెంబ్లీ ఎన్నికల పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు.

అయితే ఈ సీనియర్ నాయకుల్లో కొంతమందిని అధిష్ఠానం లోక్ సభ ఎన్నికల బరిలో దించుతుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. అందుకే అసెంబ్లీ ఎన్నికలకు వీళ్లు దూరంగా ఉన్నారని టాక్. మరోవైపు ఒక కుటుంబానికి ఒకటే టికెట్ అనే అధిష్ఠానం నిబంధన కారణంగా కూడా కొంతమంది సీనియర్ నాయకులు దరఖాస్తు చేసుకోలేదని తెలిసింది. ఈ సారి సీనియర్ నాయకుడు జానారెడ్డి ఎన్నికల బరిలో నుంచి తప్పుకున్నాడు. కానీ ఆయన పెద్ద కుమారుడు రఘువీర్ రెడ్డి మిర్యాల గూడ నుంచి, చిన్నకొడుకు జైవీర్ రెడ్డి నాగార్జున సాగర్ నుంచి పోటీకి సిద్ధమవుతున్నారు.

This post was last modified on August 26, 2023 10:23 pm

Share
Show comments

Recent Posts

దురంధర్ పోటీ సినిమాకు ఘోర అవమానం

గత ఏడాది డిసెంబర్ దురంధర్ విడుదలతో మొదలుపెట్టి మార్చిలో రిలీజైన దురంధర్ ది రివెంజ్ దాకా పాకిస్థాన్ జనాలు, మీడియా…

4 minutes ago

ప్రీమియర్ రేట్లు నిర్ణయించుకున్న పెద్ది ?

జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది కోసం ఎదురు చూపులు మాములుగా లేవు. రెండు నెలలుగా డ్రైగా ఉన్న బాక్సాఫీస్…

1 hour ago

త‌మిళ రాజ‌కీయాల్లో పుష్ప సోఫా రచ్చ

గ‌త ప‌ది రోజులుగా త‌మిళనాడు రాజ‌కీయాలు దేశ‌వ్యాప్తంగా ఎంత చ‌ర్చ‌నీయాంశం అవుతున్నాయో తెలిసిందే. ఎన్నిక‌ల్లో అతి పెద్ద పార్టీగా టీవీకే…

2 hours ago

చిరంజీవి దగ్గరికి వెళ్తే ఏమవుతుంది

ఇవాళ జరిగిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ల సమావేశంలో నిర్మాత నాగవంశీ ఒక మాటన్నారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకుండా పెద్దిని…

3 hours ago

పెద్దిని వద్దనుకుంటే ఎవరికి నష్టం

నైజామ్ సింగల్ స్క్రీన్ పర్సెంటేజ్ వివాదం ముదిరిపోతోంది. నిన్న శిరీష్, సునీల్ నారంగ్ తదితరులు నిర్వహించిన ఎగ్జిబిటర్ల ప్రెస్ మీట్…

4 hours ago

“రాహుల్-ప్రియాంక‌.. కేర‌ళ మిమ్మ‌ల్ని క్ష‌మించ‌దు!“

కాంగ్రెస్ పార్టీ అగ్ర‌నేత‌లు.. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీల‌కు కేర‌ళలో తీవ్ర‌నిర‌స‌న సెగ త‌గులుతోంది. రాహుల్‌-ప్రియాంక‌.. కేర‌ళ మిమ్మ‌ల్ని క్ష‌మించ‌దు.…

4 hours ago