Political News

ఎమ్మెల్యే పదవి వద్దంటున్న కాంగ్రెస్ సీనియర్లు

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలో అందరూ సీనియర్ నేతలే. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో అందరూ కీలక నాయకులే. అందుకే అధికారం, పదవి కోసం ఇక్కడ ఆ పార్టీలో అంతర్గత విభేదాలు, వర్గపోరు ఎక్కువ అనే అభిప్రాయాలున్నాయి. ఇక ఎన్నికలు వస్తున్నాయంటే ఆ సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కానీ త్వరలో జరగబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి కొంతమంది కాంగ్రెస్ సీనియర్ నాయకులు దూరంగా ఉండడం చర్చనీయాంశంగా మారింది. ఇతర ప్రయోజనాలు ఆశించి ఈ నాయకులు టికెట్ల కోసం దరఖాస్తు చేసుకోకుండా ఉన్నారనే టాక్ వినిపిస్తోంది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ల దరఖాస్తు కోసం కాంగ్రెస్ విధించిన గడువు ఈ నెల 25తో ముగిసింది. 119 స్థానాలకు గాను 1000కి పైగా దరఖాస్తులు వచ్చాయని తెలిసింది. వీటిని వడబోసి చివరకు అభ్యర్థులను అధిష్ఠానం ప్రకటిస్తుంది. కానీ కొంతమంది తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఈ సారి దరఖాస్తు చేసుకోలేదు. వీ హనుమంతరావు, కొండా మురళి, జానారెడ్డి, నాగం జనార్ధన్ రెడ్డి, గీతారెడ్డి, రేణుక చౌదరి తదితర సీనియర్ నేతలు అసెంబ్లీ ఎన్నికల పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు.

అయితే ఈ సీనియర్ నాయకుల్లో కొంతమందిని అధిష్ఠానం లోక్ సభ ఎన్నికల బరిలో దించుతుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. అందుకే అసెంబ్లీ ఎన్నికలకు వీళ్లు దూరంగా ఉన్నారని టాక్. మరోవైపు ఒక కుటుంబానికి ఒకటే టికెట్ అనే అధిష్ఠానం నిబంధన కారణంగా కూడా కొంతమంది సీనియర్ నాయకులు దరఖాస్తు చేసుకోలేదని తెలిసింది. ఈ సారి సీనియర్ నాయకుడు జానారెడ్డి ఎన్నికల బరిలో నుంచి తప్పుకున్నాడు. కానీ ఆయన పెద్ద కుమారుడు రఘువీర్ రెడ్డి మిర్యాల గూడ నుంచి, చిన్నకొడుకు జైవీర్ రెడ్డి నాగార్జున సాగర్ నుంచి పోటీకి సిద్ధమవుతున్నారు.

This post was last modified on August 26, 2023 10:23 pm

Share
Show comments

Recent Posts

చంద్రబాబుపై అంబటి బూతుపురాణం… ఏం జరిగింది?

వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారని వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన సీబీఐ తాజాగా సుప్రీం…

15 minutes ago

చిట్టి ఇలా రెచ్చిపోయిందేంటి…

ఫరియా అబ్దుల్లా అంటే మనందరికీ 'జాతిరత్నాలు' సినిమాలోని చిట్టినే గుర్తొస్తుంది. ఆ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఈ…

58 minutes ago

దురంధర్‌ను చెడగొట్టిన నెట్‌ఫ్లిక్స్

దురంధర్.. గత ఏడాది డిసెంబర్లో విడుదలై.. ఇప్పటికీ థియేటర్లలో మంచి వసూళ్లు సాధిస్తున్న సినిమా. ఇంకా థియేట్రికల్ రన్ కొనసాగుతుండగానే…

1 hour ago

పసిడి పతనం: 48 గంటల్లో రూ. 1.8 లక్షల సంపద ఆవిరి

బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా కుప్పకూలాయి. గత రెండు రోజులుగా సాగుతున్న ఈ పతనం శనివారం…

2 hours ago

11న అసెంబ్లీ… ఆ 11 మంది వస్తారా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరుగుతోంది. 16వ శాసనసభ ఐదో సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ…

2 hours ago

తిరుమల లడ్డు వ్యవహారం… టీటీడీ ఈవో బదిలీ?

తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ పరిధి క్రమంగా ఉన్నతాధికారుల వరకు విస్తరిస్తోంది. ఈ…

3 hours ago