స్వార్ధం కోసం కొడాలి నాని ఏమైనా చేస్తాడు

వైసీసీ ఎమ్మెల్యే కొడాలి నానిపై మాజీ మంత్రి కొల్లురవీంద్ర తీవ్ర విమర్శలు గుప్పించారు. కొడాని నాని రాజకీయ వ్యభిచారి, పిచ్చికుక్క అంటూ వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ… లోకేశ్‌ పాదయాత్ర సక్సెక్ చూసి వైసీపీ నాయకుల్లో భయం పట్టుకుందన్నారు.

స్వార్ధం కోసం కొడాలి నాని ఏమైనా చేస్తారని.. చివరికి జగన్‌కు కూడా ద్రోహం చేస్తారన్నారు. విడిపోయిన ఆంధ్రప్రదేశ్ నిర్మాణం కోసం చంద్రబాబు కృషి చేశారని తెలిపారు. ఓటమి భయం వైసీపీ నేతల మొహాల్లో స్వష్టంగా కనిపిస్తోందన్నారు. చెక్కలు మోసిన వాడు, టైర్ చక్రాలు మార్చుకొన్న వంశీ, కొడాలి మాట్లాడుతున్నారని.. తమరి చరిత్ర తెలుసుకోవాలని హితవుపలికారు.

కొడాలి, వంశీ బుక్కా పాకీర్లన్నారు. ‘‘సొంత బాబాయ్‌ను లేపాడు.. కొడాలి నాని, వంశీని లేపి టీడీపీ మీదకు తోస్తాడు.. జాగ్రత్తగా ఉండండి’’ అంటూ వ్యాఖ్యలు చేశారు. తమపై కేసులు పెడితే భయపడే పరిస్థితి లేదన్నారు.

బందరు పిచ్చోడు ఏదో వాగుతున్నారన్నారు. వైస్సార్సీపీ ఖాళీ అని… టీడీపీలోకి వలసలు వస్తున్నాయని తెలిపారు. పోసానికి లోకేశ్‌ మీద కాదు.. జగన్ మీదనే భయం ఉందని కొల్లు రవీంద్ర వ్యాఖ్యలు చేశారు.