ఆంధ్రప్రదేశ్ లో వరుసగా రెండో సారి అధికారం చేజిక్కించుకోవాలనే పట్టుదలతో సీఎం జగన్ ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీని మళ్లీ గెలిపించుకునేందుకు కసరత్తులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నియోజకవర్గాల వారీగా సమీక్షలు, అభ్యర్థుల ఎంపికపై సూచనలు చేస్తున్నారు. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబుకు కూడా ఈ ఎన్నికలు ఎంతో ప్రతిష్ఠాత్మకం. ఆయన తనయుడు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ కూడా అంతే సీరియస్ గా తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మంగళగిరిలో మరోసారి లోకేష్ ను ఓడించి టీడీపీని, బాబును దెబ్బకొట్టాలనే జగన్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని టాక్.
2019 ఎన్నికల్లో మంగళగిరి నుంచి పోటీ చేసిన లోకేష్.. వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో ఓడిపోయారు. 2024 ఎన్నికల్లో మంగళగిరి నుంచే లోకేష్ పోటీ చేస్తానని స్పష్టం చేశారు. కానీ ఈ సారి ఆయనకు పోటీగా నిలబడే వైసీపీ అభ్యర్థి మారే అవకాశముందని సమాచారం. నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామక్రిష్ణారెడ్డిపై వ్యతిరేకత వ్యక్తమవుతుందని వైసీపీ అధిష్టానం భావిస్తుందని టాక్. మరోవైపు రెడ్డి సామాజిక వర్గం కూడా ఆళ్లపై గుర్రుగా ఉందని తెలిసింది. సర్వేల్లోనూ ఆళ్ల వెనుకబడ్డారని జగన్ కు సమాచారం అందిందని చెబుతున్నారు.
అందుకే వచ్చే సారి మంగళగిరిలో లోకేష్ కు పోటీగా దింపే అభ్యర్థి కోసం జగన్ వేట మొదలెట్టారని టాక్. టీడీపీ నుంచి వైసీపీలో చేరిన గంజి చిరంజీవి, మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల, ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావుల్లో ఒకరిని మంగళగిరిలో బరిలో దించేందుకు జగన్ ఆలోచిస్తున్నట్లు తెలిసింది. మరి ఈ ముగ్గురిలో జగన్ ఎవరికి ఛాన్స్ ఇస్తారో చూడాలి మరోవైపు ఇప్పటికే మంగళగిరి నియోజకవర్గంలో పార్టీని పటిష్ఠం చేసే బాధ్యతలను ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధకు చంద్ర బాబు అప్పగించారు. మరి మంగళగిరి పై జగన్ ఫోకస్ పెట్టిన నేపథ్యంలో లోకేష్ విజయం కోసం ఆమె ఎలాంటి కసరత్తులు చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
This post was last modified on August 24, 2023 7:26 pm
టాలీవుడ్లో ఒకప్పుడు మాంచి క్రేజ్ సంపాదించుకున్న దర్శకుల్లో వైవీఎస్ చౌదరి ఒకరు. లాహిరి లాహిరి లాహిరిలో, సీతయ్య, దేవదాసు చిత్రాలతో…
ఈ మధ్య అమీర్ ఖాన్ ఇంటర్వ్యూలలో మహాభారతం ప్రస్తావన ఎక్కువగా వస్తోంది. ఇది తన డ్రీం ప్రాజెక్ట్ అంటూ త్వరలోనే…
కొందరు సెలబ్రిటీలు తెలిసి చేస్తారో తెలియక చేస్తారో కానీ ఒక్కోసారి చిన్న ట్వీట్లు, స్టేటస్ లే పెద్ద రాద్ధాంతానికి దారి…
నిన్నటిదాకా ఖచ్చితంగా మే 30 వస్తామని చెప్పిన కింగ్ డమ్ వాయిదా దాదాపు కన్ఫర్మ్ అయినట్టే. ఇంకా పోస్ట్ ప్రొడక్షన్…
పాకిస్తాన్ తో జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో భారత్ శుక్రవారం మరిన్ని కీలక నిర్ణయాలను తీసుకుంది. దేశంలోని అన్ని పోర్టులు, అంతరిక్ష…
ప్రస్తుతం భారత్, పాకిస్తాన్ ల మధ్య నెలకొన్న తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు, యుద్ధ వాతావరణానికి పాక్ వైఖరే కారణం. ఈ…