ఆంధ్రప్రదేశ్ లో వరుసగా రెండో సారి అధికారం చేజిక్కించుకోవాలనే పట్టుదలతో సీఎం జగన్ ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీని మళ్లీ గెలిపించుకునేందుకు కసరత్తులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నియోజకవర్గాల వారీగా సమీక్షలు, అభ్యర్థుల ఎంపికపై సూచనలు చేస్తున్నారు. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబుకు కూడా ఈ ఎన్నికలు ఎంతో ప్రతిష్ఠాత్మకం. ఆయన తనయుడు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ కూడా అంతే సీరియస్ గా తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మంగళగిరిలో మరోసారి లోకేష్ ను ఓడించి టీడీపీని, బాబును దెబ్బకొట్టాలనే జగన్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని టాక్.
2019 ఎన్నికల్లో మంగళగిరి నుంచి పోటీ చేసిన లోకేష్.. వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో ఓడిపోయారు. 2024 ఎన్నికల్లో మంగళగిరి నుంచే లోకేష్ పోటీ చేస్తానని స్పష్టం చేశారు. కానీ ఈ సారి ఆయనకు పోటీగా నిలబడే వైసీపీ అభ్యర్థి మారే అవకాశముందని సమాచారం. నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామక్రిష్ణారెడ్డిపై వ్యతిరేకత వ్యక్తమవుతుందని వైసీపీ అధిష్టానం భావిస్తుందని టాక్. మరోవైపు రెడ్డి సామాజిక వర్గం కూడా ఆళ్లపై గుర్రుగా ఉందని తెలిసింది. సర్వేల్లోనూ ఆళ్ల వెనుకబడ్డారని జగన్ కు సమాచారం అందిందని చెబుతున్నారు.
అందుకే వచ్చే సారి మంగళగిరిలో లోకేష్ కు పోటీగా దింపే అభ్యర్థి కోసం జగన్ వేట మొదలెట్టారని టాక్. టీడీపీ నుంచి వైసీపీలో చేరిన గంజి చిరంజీవి, మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల, ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావుల్లో ఒకరిని మంగళగిరిలో బరిలో దించేందుకు జగన్ ఆలోచిస్తున్నట్లు తెలిసింది. మరి ఈ ముగ్గురిలో జగన్ ఎవరికి ఛాన్స్ ఇస్తారో చూడాలి మరోవైపు ఇప్పటికే మంగళగిరి నియోజకవర్గంలో పార్టీని పటిష్ఠం చేసే బాధ్యతలను ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధకు చంద్ర బాబు అప్పగించారు. మరి మంగళగిరి పై జగన్ ఫోకస్ పెట్టిన నేపథ్యంలో లోకేష్ విజయం కోసం ఆమె ఎలాంటి కసరత్తులు చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
This post was last modified on August 24, 2023 7:26 pm
కొందరు ఫిలిం మేకర్స్ తమ సినిమా కథేంటో చివరి వరకు దాచి పెట్టాలని ప్రయత్నిస్తారు. నేరుగా థియేటర్లలో ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలనుకుంటారు.…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…