గతంలో టీడీపీ ఎంపీగా.. ఇప్పుడు బీఆర్ఎస్ మంత్రిగా మల్లారెడ్డి జనాల్లో బాగానే పాపులర్ అయ్యారు. సంచలన వ్యాఖ్యలతో, ప్రాసలతో ప్రజలకు కనెక్ట్ అయ్యారనే అభిప్రాయాలున్నాయి. వచ్చే ఎన్నికల్లో మరోసారి ఆయన మేడ్చల్ ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారు. కానీ ఈ ఎన్నికల్లో ఆయన అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి కూడా పోటీ చేసేందుకు అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
రాబోయే తెలంగాణ ఎన్నికల్లో మల్కాజిగిరి ఎమ్మెల్యే టికెట్ను మరోసారి మైనంపల్లి హన్మంత్ రావుకే కేసీఆర్ కేటాయించారు. కానీ మంత్రి హరీష్ రావుపై మైనంపల్లి చేసిన సంచలన వ్యాఖ్యలపై పార్టీ నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. దీంతో మైనంపల్లిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలనే ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. అదే నిజమైతే అప్పుడు మల్కాజిగిరి అసెంబ్లీ సీటు ఎవరికిస్తారన్న ఆసక్తి నెలకొంది.
రేసులో ముందుగా మర్రి రాజశేఖర్రెడ్డి పేరు వినిపిస్తోంది. మర్రి లక్ష్మారెడ్డి విద్యాసంస్థల బాధ్యతలు చూసుకుంటున్న రాజశేఖర్ రెడ్డి రాజకీయాల్లోనూ పట్టు సాధించారనే టాక్ ఉంది. మామ మల్లారెడ్డి బాటలో సాగుతున్న ఆయన మల్కాజిగిరి పార్లమెంట్, కంటోన్మెంట్ అసెంబ్లీ బీఆర్ఎస్ ఇంఛార్జీగా కొనసాగుతున్నారు. జనంలో ఆదరణ, మల్లారెడ్డి సపోర్టు తదితర కారణాలతో రాజశేఖర్ రెడ్డి టికెట్ రేసులో ముందున్నారనే చెప్పాలి. ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, ,మోతె శోభన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కనకారెడ్డి కోడలు విజయశాంతి పేర్లు కూడా వినిపిస్తున్నాయి.
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రెడ్డి ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్నారు.…
శాకుంతలం విడుదలై డిజాస్టరైనప్పుడు దాని ఫలితానికి బాధ్యుడు దర్శకుడు గుణశేఖర్ అయినప్పటికీ టైటిల్ రోల్ పోషించిన సమంత కూడా విమర్శలను…
మెగాస్టార్ చిరంజీవి సినిమా రహస్యాలను లీక్ చేయడంలో ఫేమస్ అన్న సంగతి తెలిసిందే. ‘ఆచార్య’ సినిమా టైటిల్ను అనుకోకుండా రివీల్…
వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి… టీడీపీ ఎమ్మెల్యే, టాలీవుడ్ అగ్ర నటుడు నందమూరి…
"ఏనుగు పోతుంటే చూడరు.. చీమ కుడితే గగ్గోలు పెడతారు" అనే సామెత రాజకీయాలకు కూడా సరిగ్గా సరిపోతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి.…
ఇటీవలే విడుదలైన వంద దేవుళ్ళులో కథ మొత్తం ఆర్టిస్ట్ స్వసిక చుట్టూ నడుస్తుంది. భర్తను కోల్పోయి పెళ్లీడుకొచ్చిన ఇద్దరు పిల్లల…