గతంలో టీడీపీ ఎంపీగా.. ఇప్పుడు బీఆర్ఎస్ మంత్రిగా మల్లారెడ్డి జనాల్లో బాగానే పాపులర్ అయ్యారు. సంచలన వ్యాఖ్యలతో, ప్రాసలతో ప్రజలకు కనెక్ట్ అయ్యారనే అభిప్రాయాలున్నాయి. వచ్చే ఎన్నికల్లో మరోసారి ఆయన మేడ్చల్ ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారు. కానీ ఈ ఎన్నికల్లో ఆయన అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి కూడా పోటీ చేసేందుకు అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
రాబోయే తెలంగాణ ఎన్నికల్లో మల్కాజిగిరి ఎమ్మెల్యే టికెట్ను మరోసారి మైనంపల్లి హన్మంత్ రావుకే కేసీఆర్ కేటాయించారు. కానీ మంత్రి హరీష్ రావుపై మైనంపల్లి చేసిన సంచలన వ్యాఖ్యలపై పార్టీ నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. దీంతో మైనంపల్లిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలనే ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. అదే నిజమైతే అప్పుడు మల్కాజిగిరి అసెంబ్లీ సీటు ఎవరికిస్తారన్న ఆసక్తి నెలకొంది.
రేసులో ముందుగా మర్రి రాజశేఖర్రెడ్డి పేరు వినిపిస్తోంది. మర్రి లక్ష్మారెడ్డి విద్యాసంస్థల బాధ్యతలు చూసుకుంటున్న రాజశేఖర్ రెడ్డి రాజకీయాల్లోనూ పట్టు సాధించారనే టాక్ ఉంది. మామ మల్లారెడ్డి బాటలో సాగుతున్న ఆయన మల్కాజిగిరి పార్లమెంట్, కంటోన్మెంట్ అసెంబ్లీ బీఆర్ఎస్ ఇంఛార్జీగా కొనసాగుతున్నారు. జనంలో ఆదరణ, మల్లారెడ్డి సపోర్టు తదితర కారణాలతో రాజశేఖర్ రెడ్డి టికెట్ రేసులో ముందున్నారనే చెప్పాలి. ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, ,మోతె శోభన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కనకారెడ్డి కోడలు విజయశాంతి పేర్లు కూడా వినిపిస్తున్నాయి.
This post was last modified on August 23, 2023 5:29 pm
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఏది చేసినా పక్షపాతం అన్నది కనిపించదు. చివరకు ఆ విషయం…
హైదరాబాద్ నుంచి విజయవాడకు రూ.99తో విజయవాడకు వెళ్ళొచ్చా? నిజంగానా? అని ఆశ్యర్యపడాల్సిన పని లేదు. ఎందుకంటే.. ఈటీఓ మోటార్స్ ఈ…
అంతా అనుకున్నట్లు జరిగితే నితిన్ కొత్త చిత్రం రాబిన్ హుడ్ ఎప్పుడో రిలీజైపోయి ఉండాలి క్రిస్మస్కు అనుకున్న ఆ చిత్రం…
అధికారంలో ఉన్నవారికి కొన్ని ఇబ్బందులు సహజం. ఎంత బాగా పాలన చేశామని చెప్పుకొన్నా.. ఎంత విజన్తో దూసుకుపోతున్నామని చెప్పుకొన్నా.. ఎక్కడో…
నాగ చైతన్య కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ మూవీగా తెరకెక్కిన తండేల్ థియేటర్లకు వచ్చేసింది. గత ఏడాది డిసెంబర్…
ఈ మధ్య కాలంలో అజిత్ లాంటి స్టార్ ఉన్న పెద్ద సినిమా బజ్ లేకుండా విడుదలయ్యిందంటే అది పట్టుదల మాత్రమే.…