తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపడే 115 మంది బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాను కేసీఆర్ ప్రకటించేశారు. టికెట్లు దక్కని సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఆశలు పెట్టుకున్న ఇతర నేతలు నిరాశ పడొద్దని కేసీఆర్ చెప్పారు. పార్టీలో భవిష్యత్లో చాలా అవకాశాలు ఉంటాయని కూడా చెప్పారు. కానీ పార్టీలు మారే నేతలు వింటారా? ఇప్పటికే పార్టీ జంపింగ్లపై ఆ నేతలు ఫోకస్ పెట్టినట్లు సమాచారం.
ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్కు ఈ సారి కేసీఆర్ టికెట్ ఇవ్వలేదు. దీంతో ఆమె కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధమయ్యారని టాక్. ఇప్పటికే ఆమె భర్త, టీజీవో జిల్లా అధ్యక్షుడు అజ్మీరా శ్యాం నాయక్ హైదరాబాద్లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ను కలిసి కాంగ్రెస్లో చేరిపోయారు. ఇప్పుడు రేఖా నాయక్ కూడా కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధమయ్యారని తెలిసింది. మరోవైపు ఆసిఫాబాద్, బోథ్, వేములవాడ, స్టేషన్ ఘన్ పూర్, ఉప్పల్, వైరా సిట్టింగ్ ఎమ్మెల్యేలకు కూడా కేసీఆర్ టికెట్లు ఇవ్వలేదు.
దీంతో ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్, బోథ్ ఎమ్మెల్యే బాపూరావు, ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి, స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే రాజయ్య, వైరాలో రాములు నాయక్ లకు కేసీఆర్ ఈ సారి టికెట్ నిరాకరించారు. ఈ నేపథ్యంలో రాజకీయ భవిష్యత్ పై ఈ నాయకులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. ఇందులో కొంతమంది నాయకులు కాంగ్రెస్లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారని తెలిసింది. మరికొందరేమో కేసీఆర్పై నమ్మకంతో పార్టీలోని కొనసాగేందుకు మొగ్గు చూపుతున్నారని టాక్. ఇక టికెట్ ఆశించి భంగపడ్డ మాజీ ఎమ్మెల్యేలు, ఇతర బీఆర్ఎస్ నాయకులు కూడా పార్టీ మారే యోచనలో ఉన్నట్లు తెలిసింది.
This post was last modified on August 22, 2023 2:39 pm
ఎప్స్టీన్ ఫైల్స్.. ఇప్పుడు ప్రపంచాన్ని కుదిపేస్తున్న మాట. ఎప్స్టీన్ అనే అమెరికన్ వ్యాపారవేత్త.. తాను ఇచ్చే ప్రైవేట్ పార్టీలకు ఎంతోమంది…
తెలంగాణలో జరుగుతున్న మునిసిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రచారం చేసేందుకు వీలుగా అధికార కాంగ్రెస్ పార్టీ కొన్ని కమిటీలను నియమించింది. మరో…
ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్పై.. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు భగ్గుమన్నారు. పవన్ కల్యాణ్ కాదు.. దిష్టి…
ఒకే హీరో రెండు సినిమాలు ఒకే టైంలో రిలీజ్ కు రెడీ కావడమంత సంకట పరిస్థితి మరొకటి ఉండదు. గతంలో…
సినీ రంగంలోకి కాస్త పేరు తెచ్చుకున్న ఎవ్వరైనా.. మళ్లీ జన్మంటూ ఉంటే ఇలా పుట్టాలని కోరుకోను అన్నారంటే ఆశ్చర్యపోవాల్సిందే. ముఖ్యంగా…
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా కూటమి…