తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపడే 115 మంది బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాను కేసీఆర్ ప్రకటించేశారు. టికెట్లు దక్కని సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఆశలు పెట్టుకున్న ఇతర నేతలు నిరాశ పడొద్దని కేసీఆర్ చెప్పారు. పార్టీలో భవిష్యత్లో చాలా అవకాశాలు ఉంటాయని కూడా చెప్పారు. కానీ పార్టీలు మారే నేతలు వింటారా? ఇప్పటికే పార్టీ జంపింగ్లపై ఆ నేతలు ఫోకస్ పెట్టినట్లు సమాచారం.
ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్కు ఈ సారి కేసీఆర్ టికెట్ ఇవ్వలేదు. దీంతో ఆమె కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధమయ్యారని టాక్. ఇప్పటికే ఆమె భర్త, టీజీవో జిల్లా అధ్యక్షుడు అజ్మీరా శ్యాం నాయక్ హైదరాబాద్లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ను కలిసి కాంగ్రెస్లో చేరిపోయారు. ఇప్పుడు రేఖా నాయక్ కూడా కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధమయ్యారని తెలిసింది. మరోవైపు ఆసిఫాబాద్, బోథ్, వేములవాడ, స్టేషన్ ఘన్ పూర్, ఉప్పల్, వైరా సిట్టింగ్ ఎమ్మెల్యేలకు కూడా కేసీఆర్ టికెట్లు ఇవ్వలేదు.
దీంతో ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్, బోథ్ ఎమ్మెల్యే బాపూరావు, ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి, స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే రాజయ్య, వైరాలో రాములు నాయక్ లకు కేసీఆర్ ఈ సారి టికెట్ నిరాకరించారు. ఈ నేపథ్యంలో రాజకీయ భవిష్యత్ పై ఈ నాయకులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. ఇందులో కొంతమంది నాయకులు కాంగ్రెస్లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారని తెలిసింది. మరికొందరేమో కేసీఆర్పై నమ్మకంతో పార్టీలోని కొనసాగేందుకు మొగ్గు చూపుతున్నారని టాక్. ఇక టికెట్ ఆశించి భంగపడ్డ మాజీ ఎమ్మెల్యేలు, ఇతర బీఆర్ఎస్ నాయకులు కూడా పార్టీ మారే యోచనలో ఉన్నట్లు తెలిసింది.
This post was last modified on August 22, 2023 2:39 pm
రేపు రాత్రి ప్రీమియర్లతో విడుదల కాబోతున్న అఖండ 2 తాండవానికి రంగం సిద్ధమయ్యింది. గంటకు సగటు 16 నుంచి 18…
ముందు నుంచి బలంగా చెబుతూ వచ్చిన మార్చి 27 విడుదల తేదీని పెద్ది అందుకోలేకపోవచ్చనే ప్రచారం ఫిలిం నగర్ వర్గాల్లో…
బోరుగడ్డ అనిల్.. గత వైసీపీ పాలనలో చెలరేగిపోయిన వ్యక్తి. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసి…
తిరుమల పరకామణి చోరీ ఘటనపై మాజీ సీఎం వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్రంగా…
గత కొన్నేళ్లుగా సౌత్ సినిమాల ఆధిపత్యం ముందు బాలీవుడ్ నిలవలేకపోతోంది. ఒక సంవత్సరంలో ఓవరాల్ పెర్ఫామెన్స్ పరంగా చూసుకున్నా.. హైయెస్ట్…
పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం గుండ్లపాడు డబుల్ మర్డర్ కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి…