తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపడే 115 మంది బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాను కేసీఆర్ ప్రకటించేశారు. టికెట్లు దక్కని సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఆశలు పెట్టుకున్న ఇతర నేతలు నిరాశ పడొద్దని కేసీఆర్ చెప్పారు. పార్టీలో భవిష్యత్లో చాలా అవకాశాలు ఉంటాయని కూడా చెప్పారు. కానీ పార్టీలు మారే నేతలు వింటారా? ఇప్పటికే పార్టీ జంపింగ్లపై ఆ నేతలు ఫోకస్ పెట్టినట్లు సమాచారం.
ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్కు ఈ సారి కేసీఆర్ టికెట్ ఇవ్వలేదు. దీంతో ఆమె కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధమయ్యారని టాక్. ఇప్పటికే ఆమె భర్త, టీజీవో జిల్లా అధ్యక్షుడు అజ్మీరా శ్యాం నాయక్ హైదరాబాద్లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ను కలిసి కాంగ్రెస్లో చేరిపోయారు. ఇప్పుడు రేఖా నాయక్ కూడా కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధమయ్యారని తెలిసింది. మరోవైపు ఆసిఫాబాద్, బోథ్, వేములవాడ, స్టేషన్ ఘన్ పూర్, ఉప్పల్, వైరా సిట్టింగ్ ఎమ్మెల్యేలకు కూడా కేసీఆర్ టికెట్లు ఇవ్వలేదు.
దీంతో ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్, బోథ్ ఎమ్మెల్యే బాపూరావు, ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి, స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే రాజయ్య, వైరాలో రాములు నాయక్ లకు కేసీఆర్ ఈ సారి టికెట్ నిరాకరించారు. ఈ నేపథ్యంలో రాజకీయ భవిష్యత్ పై ఈ నాయకులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. ఇందులో కొంతమంది నాయకులు కాంగ్రెస్లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారని తెలిసింది. మరికొందరేమో కేసీఆర్పై నమ్మకంతో పార్టీలోని కొనసాగేందుకు మొగ్గు చూపుతున్నారని టాక్. ఇక టికెట్ ఆశించి భంగపడ్డ మాజీ ఎమ్మెల్యేలు, ఇతర బీఆర్ఎస్ నాయకులు కూడా పార్టీ మారే యోచనలో ఉన్నట్లు తెలిసింది.
This post was last modified on August 22, 2023 2:39 pm
సినిమా ఇండస్ట్రీలో కొన్ని క్రేజీ కాంబినేషన్లు సెట్స్ పైకి వెళ్లకముందే సెన్సేషన్ క్రియేట్ చేస్తాయి. ముఖ్యంగా సూపర్ స్టార్ రజనీకాంత్,…
నందమూరి బాలకృష్ణ స్పీడ్ ను అందుకోవడం ఇప్పుడున్న కుర్ర హీరోలకు కూడా కష్టమే అనిపిస్తోంది. అఖండ 2 ఫ్లాప్ అయినా…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరిగింది. వాస్తవానికి గతంలో కొన్ని కొన్ని చెదురుమొదురు ఘటనలు జరిగేవి. తాజాగా…
80, 90 దశకాల్లో వైభవం చూసిన కథానాయకుల్లో రాజశేఖర్ ఒకరు. స్వతహాగా తమిళుడైనప్పటికీ.. తెలుగులోనే ఆయన పెద్ద హీరోగాఎదిగారు. అంకుశం,…
గ్లోబల్ పాప్ సెన్సేషన్ రిహానా పేరు వింటేనే ఒక రేంజ్ వైబ్ గుర్తొస్తుంది. అలాంటిది ఈ ఇంటర్నేషనల్ స్టార్ సడన్గా…
తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె వెనుక ఎలక్ట్రిక్ బస్సుల ప్రవేశం, వాటి నిర్వహణ విధానం.. తద్వారా ఉద్యోగాలకు పొంచి…