Political News

కేసీఆర్ చెప్పినా గోడ దూకుడే

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపడే 115 మంది బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాను కేసీఆర్ ప్రకటించేశారు. టికెట్లు దక్కని సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఆశలు పెట్టుకున్న ఇతర నేతలు నిరాశ పడొద్దని కేసీఆర్ చెప్పారు. పార్టీలో భవిష్యత్లో చాలా అవకాశాలు ఉంటాయని కూడా చెప్పారు. కానీ పార్టీలు మారే నేతలు వింటారా? ఇప్పటికే పార్టీ జంపింగ్లపై ఆ నేతలు ఫోకస్ పెట్టినట్లు సమాచారం.

ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్కు ఈ సారి కేసీఆర్ టికెట్ ఇవ్వలేదు. దీంతో ఆమె కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధమయ్యారని టాక్. ఇప్పటికే ఆమె భర్త, టీజీవో జిల్లా అధ్యక్షుడు అజ్మీరా శ్యాం నాయక్ హైదరాబాద్లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ను కలిసి కాంగ్రెస్లో చేరిపోయారు. ఇప్పుడు రేఖా నాయక్ కూడా కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధమయ్యారని తెలిసింది. మరోవైపు ఆసిఫాబాద్, బోథ్, వేములవాడ, స్టేషన్ ఘన్ పూర్, ఉప్పల్, వైరా సిట్టింగ్ ఎమ్మెల్యేలకు కూడా కేసీఆర్ టికెట్లు ఇవ్వలేదు.

దీంతో ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్, బోథ్ ఎమ్మెల్యే బాపూరావు, ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి, స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే రాజయ్య, వైరాలో రాములు నాయక్ లకు కేసీఆర్ ఈ సారి టికెట్ నిరాకరించారు. ఈ నేపథ్యంలో రాజకీయ భవిష్యత్ పై ఈ నాయకులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. ఇందులో కొంతమంది నాయకులు కాంగ్రెస్లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారని తెలిసింది. మరికొందరేమో కేసీఆర్పై నమ్మకంతో పార్టీలోని కొనసాగేందుకు మొగ్గు చూపుతున్నారని టాక్. ఇక టికెట్ ఆశించి భంగపడ్డ మాజీ ఎమ్మెల్యేలు, ఇతర బీఆర్ఎస్ నాయకులు కూడా పార్టీ మారే యోచనలో ఉన్నట్లు తెలిసింది.

This post was last modified on August 22, 2023 2:39 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘అటవీశాఖ అధికారులను కిడ్నాప్ చెయ్యాలి’

అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో అటవీ శాఖ అధికారుల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ…

3 minutes ago

కష్టాల నాయకుడికి ‘ప్రైమ్’ షాకు ?

రాజకీయాలంటే అంతే. అడుగుపెట్టాక చాలా బురదను కడుక్కోవాల్సి ఉంటుంది. కొందరు తట్టుకుంటారు. కొందరు వదిలేస్తారు. చిరంజీవి ప్రజారాజ్యం విషయంలో ఎక్కడైతే…

22 minutes ago

పవన్ ఫ్యాన్స్ బాధ అర్థం చేసుకున్నారు

అభిమానులందు పవన్ అభిమానులు వేరయా అంటే అందులో అతిశయోక్తి ఏమీ లేదు. ఆయనకున్న లాయల్ ఫ్యాన్ బేస్ ఇండియా మొత్తంలో…

2 hours ago

అక్షయ్ కామెడీ… ఇప్పుడు పండుతుందా?

​బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తనకి ఎన్నో…

2 hours ago

మార్కెటింగ్ అవసరం లేని కొత్త పాఠం

వందల కోట్లతో ప్యాన్ ఇండియా మూవీస్ తీస్తున్నప్పుడు పెద్ద ఎత్తున ప్రమోషన్లు అవసరం. ఎవరికైనా ఇది తప్పదు. ఎప్పుడో 2027…

3 hours ago

తారకరత్న కుటుంబాన్ని పట్టించుకోవట్లేదా?

కొన్నేళ్ల ముందు నందమూరి తారకరత్న ఒక రాజకీయ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా గుండెపోటుకు గురి కావడం, కొన్ని రోజుల పాటు…

4 hours ago