ఏపీ మంత్రి అంబటి రాంబాబు చేసిన ఒకే ఒక్క ట్వీట్ మొత్తం ముగ్గురు ప్రత్యర్థులను ఏకి పారేశాడు. ‘బాబు గారు బస్సు ఎక్కాడు.. పప్పు పుత్రుడు రోడ్ ఎక్కాడు.. దత్తపుత్రుడు లారీ ఎక్కాడు.. కానీ …గద్దెనెక్కడం అసాధ్యం!’ అంటూ ముగ్గురికి డెడ్లీ వార్నింగ్ ఇచ్చినట్లే కనిపించింది.
గత కొన్ని రోజులుగా ఏపీ రాజకీయాలు హీటెక్కుతున్నాయి. చంద్రబాబు తో పాటు తన దత్తపుత్రుడు, సొంత పుత్రుడు ముగ్గురు కూడా ఏపీలో తెగ తిరిగేస్తున్నారు. విడతల వారీగా మరి నియోజకవర్గాలు పంచుకుని మరి కదులుతున్నారు. నారా లోకేష్ పాదయాత్రకు ఇబ్బంది లేకుండా పగలు సమావేశాలు నిర్వహించుకుంటూ..రాత్రులు బస్సు పైన ప్రసంగాలు చేస్తున్నాడు పవన్.
పవన్ తీరు అలా ఉంటే చంద్రబాబు తీరు మరోలా ఉంది..చంద్రబాబు తన సొంత పుత్రుడు తిరిగిన ప్రాంతాలను మరోసారి చూడుతూ..కార్యకర్తలను రెచ్చగొడుతూ రాజకీయ వేడిని మరింత పెంచుతున్నారు. ఈ క్రమంలో అంబటి ముగ్గురికి గట్టి కౌంటర్ ఇచ్చారు.
కొంత కాలం క్రితం విడుదలైన బ్రో సినిమా లో అంబటి రాంబాబు పై పరోక్షంగా సెటైర్లు వేసిన పవన్ పై అంబటి తీవ్రస్థాయిలో విరుచుకుపడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పవన్కు సపోర్టుగా పాదయాత్రలో లోకేష్, చంద్రబాబులు కూడా అంబటిపై విమర్శలు కురిపించిన విషయం తెలిసిందే.
మొత్తానికి పవన్ లారీ యాత్ర, బాబు బస్సు యాత్ర, లోకేష్ పాదలపై నడిచే పాదయాత్ర వల్ల వారికి ఎటువంటి ప్రయోజనం లేదని అంబటి కామెంట్లు చేశారు.
దర్శకుడు గుణశేఖర్ అంటే పరిచయం అక్కర్లేని పేరు. ఇప్పుడేదో ఫ్లాపుల్లో ఉన్నారు కానీ ఒక్కడు, చూడాలని ఉంది, రామాయణం, సొగసు…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మంగళవారం తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో నిర్వహించతలపెట్టిన నవ నిర్మాణ…
సీనియర్ దర్శకుడు గుణశేఖర్ది ఎప్పుడూ సాహసోపేత ప్రయాణమే. కెరీర్ ఆరంభంలోనే ‘బాల రామాయణం’తో పెద్ద రిస్క్ చేశారాయన. దర్శకుడిగా తన…
బాలీవుడ్ హీరోయిన్లు పెద్ద పెద్ద బిజినెస్మ్యాన్లను పెళ్లాడి వ్యక్తిగత జీవితంలో స్థిరపడడం మామూలే. కొందరేమో కొన్నేళ్లు రిలేషన్షిప్లు ఉండి ఆర్థిక…
పెద్ద సినిమా విడుదలవుతున్న ప్రతిసారి తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు అనేది పెద్ద సమస్యగా మారిపోయింది. ప్రతిసారి ప్రభుత్వాన్ని అడగలేక,…
మాములుగా దర్శక నిర్మాతలు తమ సినిమాకు ఎంత ఖర్చు పెట్టినా బడ్జెట్ ని బాహాటంగా బయటికి చెప్పుకోరు. దానికి కారణాలు…