Political News

ఆ పుకార్లు నమ్మొద్దంటోన్న బాలినేని

వైసిపి కీలక నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి గురించి కొంతకాలంగా రకరకాల పుకార్లు ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే. వైవీ సుబ్బారెడ్డితో ఉన్న విభేదాల నేపథ్యంలో సీఎం జగన్ తో బాలినేనికి గ్యాప్ వచ్చిందని ముమ్మరంగా ప్రచారం జరుగుతోంది. ఆ ఇద్దరు నేతలను పిలిచి జగన్ పంచాయతీ కూడా చేశారని ఊహాగానాలు వినిపించాయి. ఇక, అంతకు ముందు నుంచే మంత్రి పదవి నుంచి తొలగించిన నేపథ్యంలో జగన్ పై బాలినేని అలకబూనారని టాక్ నడుస్తోంది.

ఈ ఊహాగానాలన్నీ వెరసి త్వరలోనే బాలినేని వైసీపీకి గుడ్ బై చెప్పబోతున్నారంటూ కొంతకాలంగా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఒంగోలు టికెట్ బాలినేనికి ఇవ్వబోనని జగన్ తేల్చి చెప్పినట్లు పుకార్లు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా తాను ఎక్కడ నుంచి పోటీ చేయబోతున్నాను అన్న విషయంపై బాలినేని సంచలన ప్రకటన చేశారు. రాబోయే ఎన్నికల్లో ఒంగోలు ఎమ్మెల్యేగానే తాను పోటీ చేస్తానని బాలినేని ప్రకటించారు. ఇక, ఒంగోలు ఎంపీగా మాగుంట శ్రీనివాసులు రెడ్డి పోటీ చేస్తారని క్లారిటీనిచ్చారు. తాను పోటీ చేసే స్థానంపై వస్తున్న ప్రచారాన్ని నమ్మవద్దని బాలినేని కోరారు.

మరోవైపు, గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో చాలా స్లోగా ఉంటున్నానని జగన్ తనతో అన్న విషయాన్ని బాలినేని వెల్లడించారు. ప్రతి ఇంటికి వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకునే క్రమంలో కొంత సమయం పడుతోందని, ఆ విషయాన్ని జగన్ కు తాను వివరించానని అన్నారు. హడావిడిగా, మొక్కుబడిగా కాకుండా సావధానంగా జనం సమస్యలను పరిష్కరించే దిశగా తాను వింటున్నానని, అందుకే ఒక్కొక్క ఇంటి దగ్గర ఎక్కువ సమయం పడుతుందని వివరణనిచ్చారు.

This post was last modified on August 16, 2023 9:07 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

2 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

5 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

8 hours ago

జగన్ ఇలానే ఉండాలంటూ టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

11 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

11 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

13 hours ago