వైసిపి కీలక నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి గురించి కొంతకాలంగా రకరకాల పుకార్లు ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే. వైవీ సుబ్బారెడ్డితో ఉన్న విభేదాల నేపథ్యంలో సీఎం జగన్ తో బాలినేనికి గ్యాప్ వచ్చిందని ముమ్మరంగా ప్రచారం జరుగుతోంది. ఆ ఇద్దరు నేతలను పిలిచి జగన్ పంచాయతీ కూడా చేశారని ఊహాగానాలు వినిపించాయి. ఇక, అంతకు ముందు నుంచే మంత్రి పదవి నుంచి తొలగించిన నేపథ్యంలో జగన్ పై బాలినేని అలకబూనారని టాక్ నడుస్తోంది.
ఈ ఊహాగానాలన్నీ వెరసి త్వరలోనే బాలినేని వైసీపీకి గుడ్ బై చెప్పబోతున్నారంటూ కొంతకాలంగా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఒంగోలు టికెట్ బాలినేనికి ఇవ్వబోనని జగన్ తేల్చి చెప్పినట్లు పుకార్లు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా తాను ఎక్కడ నుంచి పోటీ చేయబోతున్నాను అన్న విషయంపై బాలినేని సంచలన ప్రకటన చేశారు. రాబోయే ఎన్నికల్లో ఒంగోలు ఎమ్మెల్యేగానే తాను పోటీ చేస్తానని బాలినేని ప్రకటించారు. ఇక, ఒంగోలు ఎంపీగా మాగుంట శ్రీనివాసులు రెడ్డి పోటీ చేస్తారని క్లారిటీనిచ్చారు. తాను పోటీ చేసే స్థానంపై వస్తున్న ప్రచారాన్ని నమ్మవద్దని బాలినేని కోరారు.
మరోవైపు, గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో చాలా స్లోగా ఉంటున్నానని జగన్ తనతో అన్న విషయాన్ని బాలినేని వెల్లడించారు. ప్రతి ఇంటికి వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకునే క్రమంలో కొంత సమయం పడుతోందని, ఆ విషయాన్ని జగన్ కు తాను వివరించానని అన్నారు. హడావిడిగా, మొక్కుబడిగా కాకుండా సావధానంగా జనం సమస్యలను పరిష్కరించే దిశగా తాను వింటున్నానని, అందుకే ఒక్కొక్క ఇంటి దగ్గర ఎక్కువ సమయం పడుతుందని వివరణనిచ్చారు.
This post was last modified on August 16, 2023 9:07 am
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా రూపొందుతున్న 'ఆదర్శ కుటుంబం' షూటింగ్ మంచి స్వింగ్ లో ఉంది. ముందుగా తీసుకున్న…
మరీ డెడ్ డ్రైగా మారిపోయిన తెలుగు రాష్ట్రాల థియేటర్లు పెద్ద సినిమాలు లేక అల్లాడిపోతున్నాయి. రెండు మూడు రోజులు ప్రమోషన్లతో…
తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా సాధించుకునేందుకు కొనసాగిన ఉద్యమం కొత్త పుంతలు తొక్కింది. యావత్తు తెలంగాణ వేదికగా సాగిన ఈ ఉద్యమంలో…
``రాజకీయ నేతలు.. ప్రజల కోసం పనిచేసేది తక్కువ.. సెక్స్ వీడియోలు చూసేది ఎక్కువ. కావాలంటే.. నా ఫోన్ సహా.. రాష్ట్రంలోని…
బద్రి లాంటి సూపర్ హిట్ మూవీతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు పూరి జగన్నాథ్. అరంగేట్రంలోనే అలాంటి హిట్ పడిందంటే ఇక…
తెలంగాణ ప్రభుత్వం ఆరుగురు సీనియర్ ఐపీఎస్ అధికారులకు డైరెక్టర్ జనరల్స్(డీజీ)గా పదోన్నతి కల్పించింది. వీరిలో మహేశ్ భగవత్, స్వాతి లక్రా,…