151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఏం లాభం..? తిని తిరుగుతున్నారు. అమాయకుల భూములు దోస్తు న్నారు. ఏమైనా అంటే ఎదురు తిరిగి కొడుతున్నారు. కేసులు పెడుతున్నారు. వీళ్ల వల్ల మనకు ఒరిగిందేంటి? అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో పనిచేసే ముఖ్యమంత్రి అవసరమని.. అబద్ధాలు చెబుతూ.. ప్రజల సొమ్మును ఆబగా మేసే ముఖ్యమంత్రి అవసరం లేదని అన్నారు.
వచ్చే ఎన్నికల్లో అయినా.. ప్రజలు ఈ విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించాలని.. ఎవరు పనిచేస్తున్నారో.. గమనించి.. ఎవరు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్లాలని భావిస్తున్నారో తెలుసుకుని వారికి ఓటేయాలని, వారిని గెలిపించాలని సూచించారు. తనతో సహా ఎవరైనా సరే.. ఓటర్లు ఇదే సూత్రం పాటించాలని పవన్ వ్యాఖ్యానించారు.
అమ్మ ఒడి రాజ్యాంగ హక్కు
అమ్మ ఒడి అనే పథకంపై పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ పథకం జగన్ ఇస్తున్నది కాదన్నారు. ఇది రాజ్యాంగబద్ధంగా కల్పించిన హక్కు అని పేర్కొన్నారు. ఈ విషయం తెలియక ప్రజలు జగన్ తమకు ఏదో ఇస్తున్నారని..వ్యాఖ్యానిస్తున్నారని.. నమ్ముతున్నారని.. ఇప్పటికైనా క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోందో తెలుసుకోవాలని సూచించారు.
జగన్పై 30 కేసులు
రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసే వ్యక్తి వైట్ పేపర్ మాదిరిగా ఉండాలని.. పెద్దలు అనేక సందర్భాల్లో చెప్పారని పవన్ చెప్పారు. కానీ, రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న జగన్పై 30 కేసులు ఉన్నాయని.. ఇవి అత్యంత అవినీతి కేసులని వ్యాఖ్యానించారు. ఏ కారణం లేకుండానే 16 నెలలు జైల్లో కూర్చోబెడతారా? అని ప్రశ్నించారు. అలాంటి వ్యక్తి కూడా కోర్టులను దూషిస్తారని, హైకోర్టు, సుప్రీంకోర్టులను కూడా తప్పు పట్టే స్థాయికి వెళ్లిపోయారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
This post was last modified on August 15, 2023 7:07 pm
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…