Political News

151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.. ఏం లాభం?

151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఏం లాభం..?  తిని తిరుగుతున్నారు. అమాయ‌కుల భూములు దోస్తు న్నారు. ఏమైనా అంటే ఎదురు తిరిగి కొడుతున్నారు. కేసులు పెడుతున్నారు. వీళ్ల వ‌ల్ల మ‌న‌కు ఒరిగిందేంటి? అని జ‌నసేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ్యాఖ్యానించారు. తాజాగా ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప‌నిచేసే ముఖ్య‌మంత్రి అవ‌స‌ర‌మ‌ని.. అబద్ధాలు చెబుతూ.. ప్ర‌జ‌ల సొమ్మును ఆబ‌గా మేసే ముఖ్య‌మంత్రి అవ‌స‌రం లేద‌ని అన్నారు.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో అయినా.. ప్ర‌జ‌లు ఈ విష‌యాన్ని జాగ్ర‌త్త‌గా ప‌రిశీలించాల‌ని.. ఎవ‌రు ప‌నిచేస్తున్నారో.. గ‌మ‌నించి.. ఎవ‌రు రాష్ట్రాన్ని అభివృద్ధి ప‌థంలో ముందుకు తీసుకువెళ్లాల‌ని భావిస్తున్నారో తెలుసుకుని వారికి ఓటేయాల‌ని, వారిని గెలిపించాల‌ని సూచించారు. త‌న‌తో స‌హా ఎవ‌రైనా స‌రే.. ఓట‌ర్లు ఇదే సూత్రం పాటించాల‌ని ప‌వ‌న్ వ్యాఖ్యానించారు.

అమ్మ ఒడి రాజ్యాంగ హ‌క్కు

అమ్మ ఒడి అనే ప‌థ‌కంపై ప‌వ‌న్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.  ఈ ప‌థ‌కం జ‌గ‌న్ ఇస్తున్న‌ది కాద‌న్నారు. ఇది రాజ్యాంగ‌బ‌ద్ధంగా క‌ల్పించిన హ‌క్కు అని పేర్కొన్నారు. ఈ విష‌యం తెలియ‌క ప్ర‌జలు జ‌గ‌న్ త‌మ‌కు ఏదో ఇస్తున్నార‌ని..వ్యాఖ్యానిస్తున్నార‌ని.. న‌మ్ముతున్నార‌ని.. ఇప్ప‌టికైనా క్షేత్ర‌స్థాయిలో ఏం జ‌రుగుతోందో తెలుసుకోవాల‌ని సూచించారు.

జ‌గ‌న్‌పై 30 కేసులు

రాష్ట్రానికి ముఖ్య‌మంత్రిగా చేసే వ్య‌క్తి వైట్ పేప‌ర్ మాదిరిగా ఉండాల‌ని.. పెద్ద‌లు అనేక సంద‌ర్భాల్లో చెప్పార‌ని ప‌వ‌న్ చెప్పారు. కానీ, రాష్ట్రానికి ముఖ్య‌మంత్రిగా ఉన్న జ‌గ‌న్‌పై 30 కేసులు ఉన్నాయ‌ని.. ఇవి అత్యంత అవినీతి కేసుల‌ని వ్యాఖ్యానించారు. ఏ కార‌ణం లేకుండానే 16 నెల‌లు జైల్లో కూర్చోబెడ‌తారా? అని ప్ర‌శ్నించారు. అలాంటి వ్య‌క్తి కూడా కోర్టులను దూషిస్తారని, హైకోర్టు, సుప్రీంకోర్టులను కూడా తప్పు పట్టే స్థాయికి వెళ్లిపోయారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

This post was last modified on August 15, 2023 7:07 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పెద్ది మెడకు పర్సెంటేజ్ గొడవ

తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…

35 minutes ago

‘నీట్’ గా పేపర్ అమ్మేశారట!

నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…

38 minutes ago

భగీరథ్ కేసు వాదించేది వైసీపీ ఎంపీనే

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే.…

2 hours ago

కేరళం ‘సీల్డ్ కవర్’ తెరచుకునేదెన్నడో..?

దేశంలో ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎప్పుడో వెలువడ్డాయి. ఆ ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో…

2 hours ago

ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్న మోదీ వ్యాఖ్యలు

యావత్తు ప్రపంచాన్ని కరోనా చుట్టుముట్టిన తరుణంలో లాక్ డౌన్ అంటే ఏమిటో… ఎలా ఉంటుందో చూశాం. ఇప్పుడు కరోనా లాంటి…

5 hours ago

ఒక్క ఓటుతో గెలిస్తే ఓటేయొద్దా…?

తమిళ రాజకీయాల్లో వరుసబెట్టి ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తమిళనాడు అసెంబ్లీకి జరిగిన ఎన్నికల ఫలితాలు వెలువడిన దగ్గర నుంచి రోజుకో…

6 hours ago