టికెట్ల ఖరారు తేదీ దగ్గరకు వస్తున్నదనే ప్రచారం జరిగే కొద్దీ సిట్టింగ్ ఎంఎల్ఏలు, కొందరు ఎంపీలు, ఆశావహుల్లో టెన్షన్ పెరిగిపోతోంది. రాబోయే ఎన్నికల్లో టికెట్లు ఆశిస్తున్న వాళ్ళంతా ముగ్గురిపైన బాగా ఒత్తిడి పెంచేస్తున్నట్లు సమాచారం. ఇంతకీ ఆ ముగ్గురు ఎవరంటే మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, ఎంఎల్సీ కల్వకుంట్ల కవిత. మంత్రులతో పాటు చాలా మందికి కేసీయార్ దర్శనభాగ్యం దొరకడం లేదు. టికెట్లు ఫైనల్ చేయటంలో కేసీఆర్ ఎర్రవల్లి ఫాంహౌజ్ లో బిజీగా ఉన్నారు.
సో కేసీయార్ ను కలిసి మాట్లాడలేని వాళ్ళంతా అందుబాటులో ఉండే కేటీయార్, హరీష్, కవితలను కలుస్తున్నారు. పైగా చాలామంది పై ముగ్గురు మద్దతుదారులుగా ముద్రపడినవారే ఉన్నారు. అందుకనే టికెట్ల కోసం అందులోను మొదటిజాబితాలోనే తమ పేరుండేట్లుగా చూడాలని చాలామంది సిట్టింగులు పై ముగ్గురిపై ఒత్తిడి పెంచేస్తున్నారట. బొంతు రామ్మోహన్, క్రిశాంక్, శంభీపూర్ రాజా, కేపీ వివేకానందగౌడ్, బాల్కసుమన్, శ్రీధరరెడ్డి, మర్రిజనార్ధనరెడ్డి లాంటి వాళ్ళు మొదటి జాబితాలోనే తమ పేర్లుండాలనేట్లుగా కేటీయార్ మీద ప్రెషన్ పెంచేస్తున్నారట.
ఇక హరీష్ రావుకు కూడా తన మద్దతుదారుల నుండి ఇదే సమస్య పెరిగిపోతోంది. అనేక జిల్లాల్లో నేతల మధ్య సమస్యలు వచ్చినపుడల్లా కేసీయార్ మేనల్లుడు, మంత్రయిన హరీష్ నే ట్రబుల్ షూటర్ గా పంపారు. దాంతో చాలా జిల్లాల్లో హరీష్ మద్దతుదారులుగా చెలామణి అవుతున్నారు. ఎర్రోళ్ళ శ్రీనివాస్, పద్మాదేవేందర్ రెడ్డి, క్రాంతి కిరణ్, కొత్తా ప్రభాకరరెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి లాంటి చాలామంది మొదటిజాబితాలో పేర్ల కోసం హరీష్ పైనే ఆశలు పెట్టుకున్నారట.
ఇక కవిత మద్దతుదారులుగా కొందరు నిజామాబాద్ జిల్లాలో చెలామణి అవుతున్నారు. వీళ్ళసంఖ్య తక్కువే అయినా గట్టి పట్టుదలతో ఉన్నారట. అందుకని కవిత కూడా ఏమి చెప్పలేక నానా అవస్తలు పడుతున్నారు. ఇక్కడ పై ముగ్గురికీ సమస్య ఏమిటంటే మొదటిజాబితా పేరుతో ఒక్క పేరు కూడా లీక్ కాలేదు. అంటే కేసీయార్ ఎంతజాగ్రత్తగా జాబితాలను రెడీ చేస్తున్నారనే విషయం అర్ధమవుతోంది. 19వ తేదీ తర్వాత ఎప్పుడైనా మొదటిజాబితా రిలీజవుతుందన్న ప్రచారమే అందరిలోను టెన్షన్ పెంచేస్తోంది.
ఏపీలో ఆసక్తి రేకెత్తించిన జోసెఫ్ రావణ్ అలియాస్ ప్రశ్న రావణ్ వ్యవహారంపై కొత్త కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. జనసేన అదినేత,…
అమెరికా అధ్యక్షుడి హోదాలో డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న విచిత్రమైన నిర్ణయాలతో ఆ దేశ ప్రజలతో పాటు ఆ దేశంలోని విదేశీయులు నానా ఇబ్బందులు పడుతున్నారు.…
విహార యాత్రల్లో ప్రమాదం జరిగితే పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అలాంటిదే ఇప్పుడు వియత్నాంలో జరిగింది. వియత్నాంలో…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు శనివారం శస్త్ర చికిత్స జరిగింది. ముంబైలో జరిగిన ఈ శస్త్ర…
ఫిలిం ఇండస్ట్రీలో అవకాశాలు అందుకోవడం ఒకెత్తయితే.. విజయాలు సాధించడం మరో ఎత్తు. వచ్చిన అవకాశాలు సద్వినియోగం అయ్యేలా సక్సెస్ సాధించకపోతే…
బాలీవుడ్ లో కొంత కాలంగా విచిత్రమైన ట్రెండ్ నడుస్తోంది. రొటీన్ కథలు, సిల్లీ కాన్సెప్ట్స్ తో సినిమాలు వస్తుంటాయి. క్రిటిక్స్…