తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు.. ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్కు మధ్య ఉన్న అవినాభావ సంబంధం గురించి తెలిసిందే. పైకి పెద్దగా మాట్లాడుకున్నట్టు కనిపించకపోయినా.. రాకపోకలు లేకపోయినా.. ఇరువురి మధ్య స్థానిక రాజకీయాల్లో మాత్రం ఒక అవగాహన అయితే ఉందనే చర్చ తరచుగా జరుగుతూనే ఉంది. నిజానికి కేంద్రంలోని బీజేపీసర్కారు విషయంలో వైసీపీ అనుసరిస్తున్న వైఖరి.. కేసీఆర్ కు మండేలా చేస్తోంది.
అయితే. తెలంగాణలోని రెడ్డి సామాజిక వర్గం సహా.. పారిశ్రామిక వేత్తలంతా.. సీఎం జగన్కు అనుకూలంగా ఉండడంతోపాటు.. ఆయన చెప్పినట్టు వ్యవహరించే వారు కావడంతో కేసీఆర్కు ఎన్నికల సమయంలో జగన్ అవసరం ఎంతో ఉంటుందనేది విశ్లేషకుల మాట. ఇక, ఇటు వైపు నుంచి చూసుకుంటే.. ఏపీలో జగన్ గెలిచేందుకు గత ఎన్నికల్లో కేసీఆర్ తెరచాటున ప్రచారం చేశారనేది తెలిసిందే. తన వారిని ఇక్కడకు పంపించి ఆయన వ్యూహాత్మకంగా పావులు కదిపారు.
ఫలితంగా కేసీఆర్.. జగన్కు సహకరించినట్టు అయింది.ఇక, వచ్చే ఎన్నికల్లోనూ ఇటు వారు అటు, అటు వారు ఇటు సహకరించుకోవడం ఖాయమనేచర్చ జరుగుతూనే ఉంది. అయితే.. వీరి మధ్య అన్యోన్యత.. సహకారం ఉంటే.. వచ్చే ఎన్నికల్లోనూ వైసీపీ గెలుస్తుందనే అంచనాలు వస్తున్న దరిమిలా.. జనసేన అధినేత పవన్ అలెర్ట్ అయ్యారని అంటున్నారు పరిశీలకులు.
అవసరమైతే.. కేసీఆర్కు తాను సాయం చేయాలని నిర్ణయించుకున్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ సాగు తోంది. తాను పోటీ చేయడమా? చేయకపోవడమా? అనే విషయం నుంచి జనసేన ప్రచారం మాటున.. తెలంగాణలో ప్రతిపక్షాలను డైల్యూట్ చేసి.. కేసీఆర్కు మేలు చేయాలనే వ్యూహంతో ఆయన ఉన్నారనేది ఓవర్గం నాయకులు.. చెబుతున్నమాట. ఇక, కేసీఆర్ కూడా.. తనకు వచ్చే ఎన్నికల్లో గెలుపే ముఖ్యంగా అడుగులు వేస్తున్నారు.. తప్ప.. ఎవరు ఏంటనేది మాత్రం ఆయన పట్టించుకోవడం లేదని అంటున్నారు.
This post was last modified on August 15, 2023 10:09 am
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…