Political News

జగన్ మోకాళ్లపై కూర్చోబెట్టలేదన్న మంత్రి

వైసీపీ పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు జగన్ పెద్ద పీట వేశారని ఆ పార్టీ నేతలు గొప్పలు చెప్పుకుంటున్న సంగతి తెలిసిందే. నామినేటెడ్ పదవులలో 50 శాతానికి పైగా బీసీలకు, ఎస్టీలకు, ఎస్సీలకు, మైనార్టీలకు జగన్ కట్టబెట్టారని వైసిపి నేతలు డబ్బా కొడుతూ ఉంటారు. అయితే, జగన్ పాలనలో దళితులను, బీసీలను, మైనారిటీలను బానిసలుగా చూస్తున్నారని, వారితో జగన్ ప్రవర్తించే తీరు అందుకు నిదర్శనం అని పలుమార్లు ప్రతిపక్ష నేతలు విమర్శలు గుప్పించారు.

ఈ నేపథ్యంలోనే తాజాగా అమలాపురంలో పర్యటించిన జగన్ మంత్రి పినిపే విశ్వరూప్ ను మోకాళ్లపై కూర్చోబెట్టారని సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. జగన్ పక్కన చిన్నపిల్లాడిలాగా విశ్వరూప్ మోకాళ్లపై కూర్చున్న ఫోటో ఒకటి వైరల్ గా మారింది. ఈ నేపథ్యంలోనే దళిత మంత్రికి సీఎం సాక్షిగా అవమానం జరిగిందంటూ జగన్ పై ట్రోలింగ్ జరుగుతోంది. ఈ క్రమంలోనే తాజాగా ఆ వ్యవహారంపై విశ్వరూప్ స్పందించారు. ఆ కార్యక్రమంలో మోకాళ్ళపై కూర్చోబెట్టారు అని వస్తున్న వార్తలు అవాస్తవమని, తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందు తారె స్టేజ్ ఎక్కలేదని, ఆ తర్వాత సీఎం పిలవడంతో స్టేజిపైకి వెళ్లానని చెప్పారు.

అయితే, వెనక నిలబడ్డ మహిళలకు తాను అడ్డంగా ఉండకూడదు అన్న ఉద్దేశంతోనే మోకాళ్ళపై కూర్చున్నానని క్లారిటీనిచ్చే ప్రయత్నం చేశారు. దళిత మంత్రిని అవమానించారు అంటూ ప్రచారం చేయడం తగదని, తనకు తానుగా అలా కూర్చున్నానని చెప్పారు. ఇక, 30 ఏళ్ల రాజకీయ జీవితంలో తనని ఎవరు కింద కూర్చోబెట్టలేదని అన్నారు. సంతోషంగా ఉంటేనే రాజకీయాల్లో కొనసాగుతానని, తన ఆత్మ గౌరవానికి భంగం కలిగితే తప్పుకుంటానని చెప్పారు. ఇక, జగన్ పర్యటన సందర్భంగా తాను ఫ్లెక్సీలు డిజైన్ చేయించానని, తమ కుటుంబంలో గొడవలున్నాయని ఫ్లెక్సీలపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాము కలిసే ఉన్నామని చెప్పారు.

Satya

Recent Posts

పుత్రోత్సాహం కోరుతున్న నందమూరి ఫ్యాన్స్

రామ్ చరణ్ టాప్ స్టార్ అయిపోయాడు. చిరంజీవి ఫుల్ హ్యాపీ. పెద్ది సక్సెస్ మీట్ లో ఏకంగా న్యూ ఏజ్…

14 minutes ago

టికెట్ రేట్లు చేస్తున్న మేలు అర్థమవుతోందా

లెనిన్ సూపర్ హిట్టయిపోయింది. బ్లాక్ బస్టర్ దారిలో ఉంది. పదేళ్లకు పైగా విజయం కోసం మొహం వాచిపోయిన అఖిల్ అభిమానులకు…

3 hours ago

13 ఏళ్ల బాలుడు బాబు గారితో ఫోటో కోసం…

సినిమాల్లో వేషం కోసం చెన్నయ్ వెళ్లారు.. అభిమాన హీరోని కలిసి ఎందుకు హైదరాబాదు వెళ్లారు.. అనే వార్తలను తరచూ వింటూ…

8 hours ago

పోల‌వ‌రంపై చంద్ర‌బాబు శ‌ప‌థం

పోల‌వ‌రం ప్రాజెక్టును ఆరు నూరైనా పూర్తి చేస్తామ‌ని సీఎం చంద్ర‌బాబు శ‌ప‌థం చేశారు. గోదావ‌రి జిల్లాల్లో ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన ఆయ‌న…

11 hours ago

నాగార్జున 101 ఫిక్సయిందా?

అక్కినేని నాగార్జున కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 100వ సినిమా కోసం అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. కానీ…

11 hours ago

ఇప్పుడున్న రాజకీయాల్లో ఎన్టీఆర్‌ ఇమ‌డ‌గ‌ల‌రా?

జూనియ‌ర్ ఎన్టీఆర్‌.. రాజ‌కీయ రంగ ప్ర‌వేశంపై త‌ర‌చుగా ప్ర‌చారం జ‌రుగుతూనే ఉంది. ఆయ‌న‌కు అను కూలంగా ఏపీలోనూ కొన్ని ప్రాంతాల్లో…

12 hours ago