Political News

దళితులను జగన్ ప్రభుత్వం వేధిస్తోంది: నారా లోకేష్‌!

దళితులను జగన్ ప్రభుత్వం  వేధిస్తోందని… అక్రమ కేసులు పెట్టి భవిష్యత్తు లేకుండా చేస్తుందని తెలుగుదేశం  జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. శనివారం నాడు పెదకూరపాడులో ఎస్సీ సామాజికవర్గ నేతలతో నారా లోకేష్ ముఖాముఖి నిర్వహించారు.ఈ సమావేశంలో మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు, మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ పాల్గొన్నారు.

ఈసందర్భంగా లోకేష్ మీడియాతో మాట్లాడుతూ..‘‘జగన్ పాలనలో ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు రద్దు చేస్తున్నారు.విదేశీ విద్య పథకం రద్దు చేయడంతో దళిత విద్యార్థులు ఉన్నత విద్యకు దూరం అవుతున్నారు. ఫీజు రీయింబర్స‌మెంట్ పథకం అములు కాక సర్టిఫికేట్లు ఇవ్వడం లేదు.జగన్ పాలనలో కార్పొరేషన్ రుణాలు ఇవ్వడం లేదు. టీడీపీ హయాంలో ఎస్సీలకు సబ్సిడీలో జేసీబీలు, ఇన్నోవాలు ఇచ్చాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పనులు లేక కిస్తీ కూడా కట్టలేని పరిస్థితి.

తన నాలుగేళ్ల చిన్నారి తప్పిపోయి మూడేళ్లు అవుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని లోకేష్ ముందు దళితుడు రమేష్ కన్నీరు పెట్టుకున్నారు. ఇసుక రేటు విపరీతంగా పెరిగిపోయాయి. పనులు లేక ఇబ్బందులు పడుతున్నాం. ఇతర రాష్ట్రాలకి వెళ్లి పనులు చేసుకుంటున్నాం. దళితుల్లో నిరుద్యోగ సమస్య ఎక్కువ ఉంది.

చదువుకున్నా ఉద్యోగాలు రావడం లేదు.ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగాలు కల్పించాలి. జగన్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల్లో భాగంగా దళిత ఉద్యోగులను వేధిస్తుంది.ఉపాధి హామీ పథకంలో పనిచేసే వారిని కూడా తొలగించారు’’ అని నారా లోకేష్ వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

This post was last modified on August 13, 2023 12:09 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ప్రీమియర్ల నుంచే హడావిడి మొదలు

కంటెంట్ మీద ఎంత నమ్మకం ఉన్నా ప్రీమియర్ల విషయంలో నిర్మాతలు ఒకటికి పదిసార్లు ఆలోచించే పరిస్థితులు ఇప్పుడున్నాయి. కొన్నిసార్లు ఈ…

44 minutes ago

హ్యాపీగా వస్తే ఎవరూ పట్టించుకోలేదు

జివి ప్రకాష్ కుమార్ మనకూ బాగా సుపరిచితుడైన సంగీత దర్శకుడు. తమిళంలో అయితే రెగ్యులర్ గా హీరోగా కూడా నటిస్తూ…

2 hours ago

‘మావిగన్’ పేరుతో జగన్ కొత్త రాజధాని ప్రతిపాదన

ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై వైసీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్లాన్-బీ’గా మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు ప్రాంతాన్ని…

4 hours ago

కాంగ్రెస్ ఎమ్మెల్యేకు మంచు విష్ణు కౌంటర్

టాలీవుడ్ టాప్ స్టార్లందరూ తమ సినిమా రిలీజ్ ముంగిట డ్రగ్ టెస్టులు చేసుకోవాలని.. అప్పుడే ఆ సినిమాలు రిలీజ్ అయ్యేలా…

4 hours ago

అమరావతిపై జగన్ అక్కసు తగ్గలేదా?

ఏపీ మాజీ సీఎం జగన్ తన అజ్ఞానపూరితమైన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. జగన్ ప్రెస్ మీట్…

4 hours ago

జయలలిత స్ట్రాటజీ మళ్లీ: విజయ్ పెద్ద ప్లాన్

సినిమాల్లో డ్యూయల్ రోల్స్ తో మెప్పించిన హీరో విజయ్ ఇప్పుడు రాజకీయ రంగంలోనూ అదే తరహాలో రెండు నియోజకవర్గాల నుంచి…

5 hours ago