Political News

దళితులను జగన్ ప్రభుత్వం వేధిస్తోంది: నారా లోకేష్‌!

దళితులను జగన్ ప్రభుత్వం  వేధిస్తోందని… అక్రమ కేసులు పెట్టి భవిష్యత్తు లేకుండా చేస్తుందని తెలుగుదేశం  జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. శనివారం నాడు పెదకూరపాడులో ఎస్సీ సామాజికవర్గ నేతలతో నారా లోకేష్ ముఖాముఖి నిర్వహించారు.ఈ సమావేశంలో మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు, మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ పాల్గొన్నారు.

ఈసందర్భంగా లోకేష్ మీడియాతో మాట్లాడుతూ..‘‘జగన్ పాలనలో ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు రద్దు చేస్తున్నారు.విదేశీ విద్య పథకం రద్దు చేయడంతో దళిత విద్యార్థులు ఉన్నత విద్యకు దూరం అవుతున్నారు. ఫీజు రీయింబర్స‌మెంట్ పథకం అములు కాక సర్టిఫికేట్లు ఇవ్వడం లేదు.జగన్ పాలనలో కార్పొరేషన్ రుణాలు ఇవ్వడం లేదు. టీడీపీ హయాంలో ఎస్సీలకు సబ్సిడీలో జేసీబీలు, ఇన్నోవాలు ఇచ్చాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పనులు లేక కిస్తీ కూడా కట్టలేని పరిస్థితి.

తన నాలుగేళ్ల చిన్నారి తప్పిపోయి మూడేళ్లు అవుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని లోకేష్ ముందు దళితుడు రమేష్ కన్నీరు పెట్టుకున్నారు. ఇసుక రేటు విపరీతంగా పెరిగిపోయాయి. పనులు లేక ఇబ్బందులు పడుతున్నాం. ఇతర రాష్ట్రాలకి వెళ్లి పనులు చేసుకుంటున్నాం. దళితుల్లో నిరుద్యోగ సమస్య ఎక్కువ ఉంది.

చదువుకున్నా ఉద్యోగాలు రావడం లేదు.ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగాలు కల్పించాలి. జగన్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల్లో భాగంగా దళిత ఉద్యోగులను వేధిస్తుంది.ఉపాధి హామీ పథకంలో పనిచేసే వారిని కూడా తొలగించారు’’ అని నారా లోకేష్ వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

This post was last modified on August 13, 2023 12:09 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

రెహమాన్ నిజంగా లైవ్ ఇస్తున్నారా

పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…

2 hours ago

4 ల‌క్ష‌ల క‌లెక్షన్… థియేట‌ర్‌కు 10 వేలు

తెలంగాణ‌లోని సింగిల్ థియేట‌ర్ల‌లో అద్దె విధానానికి స్వ‌స్తి ప‌లికి ప‌ర్సంటేజీ ప‌ద్ధ‌తిని తీసుకురావాల‌ని ఇక్క‌డి ఎగ్జిబిట‌ర్లు ఎప్ప‌ట్నుంచో డిమాండ్ చేస్తూ…

3 hours ago

స్నాక్ ప్యాకెట్లకు కలర్ కరువైంది

తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…

3 hours ago

సూపర్ నిర్ణయం… GO వచ్చినా పాత రేట్లే

తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…

5 hours ago

నానితో క్లాష్… మెగాస్టార్ ఒప్పుకోరేమో

అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…

5 hours ago

పెద్ది మెడకు పర్సెంటేజ్ గొడవ

తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…

7 hours ago