వచ్చే ఉగాది నాటికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో జనసేన, టీడీపీ ఉండవని, ఒకవేళ ఆ రెండు పార్టీలు అప్పటికే ఉంటే తాను గుండు కొట్టించుకుంటారని మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ప్రజలకు మంచి చేయాలన్న ఉద్దేశం ఆ పార్టీలకు లేదని, ఎన్నికలప్పుడే వాటికి స్కీములు గుర్తుకు వస్తాయని బొత్స విమర్శలు గుప్పించారు. చెప్పుతో కొడతామని పవన్ వంటి నేతలు చేస్తున్న కామెంట్లపై స్పందించిన బొత్స…చెప్పులు అందరికీ ఉంటాయని అన్నారు. ఈ నేపథ్యంలోనే బొత్స వ్యాఖ్యలపై టీడీపీ నేత బోండా ఉమా ఘాటుగా స్పందించారు. రాబోయే ఎన్నికల్లో బొత్సతోపాటు ఆయన సోదరులు, కుటుంబ సభ్యులను చిత్తుగా ఓడిస్తామని ఉమ ధీమా వ్యక్తం చేశారు.
అంతేకాదు, వైసీపీ నుండి బొత్స కుటుంబ సభ్యులతో పాటు వైసీపీ నేతలు, ఎమ్మెల్యేలు…మొత్తం 50 మంది తమతో టచ్ లో ఉన్నారని బోండా ఉమ షాకింగ్ కామెంట్స్ చేశారు. తమ పార్టీపై బొత్సకు అంత నమ్మకం ఉంటే ఉగాది వరకు కాదని ఇప్పుడే ఎన్నికలు పెట్టాలని సవాల్ విసిరారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వైసీపీ ఓటమి ఖాయమని, ప్రజలు వైసీపీ పాలనతో విసుగెత్తిపోయారని బోండా ఉమ విమర్శించారు. వైసీపీ నేతలకు ఓటమి భయం పట్టుకుందని, అందుకే, ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని దుయ్యబట్టారు.
అంతకుముందు, పవన్ పై బొత్స సంచలన విమర్శలు చేశారు. జనసేన విధానం ఏమిటి? ఎజెండా ఏమిటి అనే ప్రశ్నలకు పవన్ కళ్యాణ్ వద్ద సమాధానం లేదని బొత్స విమర్శలు గుప్పించారు. పార్టీ పెట్టి 15 ఏళ్లయినా సంస్థాగత నిర్మాణంపై ఆయనకు ఏమాత్రం అవగాహన లేదని బొత్స అన్నారు. వాలంటీర్లపై కూడా పవన్ మాట మార్చారని, అసలు పవన్ స్టాండ్ ఏమిటో చెప్పాలని బొత్స నిలదీశారు. పవన్ చేస్తున్న రాజకీయాలు చూస్తుంటే ప్రజాస్వామ్యం, రాజకీయాలు అంటేనే అసహ్యం వేస్తోందని బొత్స వ్యాఖ్యానించారు. ఈ క్రమంలోనే బొత్స సత్యనారాయణకు బోండా ఉమ కౌంటర్ ఇచ్చారు.
This post was last modified on August 13, 2023 12:11 am
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ తో కలిసి…
ఒకప్పుడు తమిళ డబ్బింగ్ సినిమాలను చూసి తెలుగులో ఇలాంటి సినిమాలు రావేంటి అని చాలా ఫీలయ్యేవాళ్లు మన ప్రేక్షకులు. అక్కడ ఎన్నో కొత్త…
మాస్ రాజా రవితేజకు గత కొన్నేళ్లలో పెద్ద హిట్ అంటే.. ధమాకానే. ఈ సినిమా డివైడ్ టాక్ తెచ్చుకుని కూడా బ్లాక్ బస్టర్…
హైదరాబాద్ శిల్ప కళావేదికలో జరిగిన అర్జున్ సన్నాఫ్ వైజయంతి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇవాళ అభిమానులతో కళకళలాడిపోయింది. ఇదే నెలలో…
పాకిస్థాన్ క్రికెటర్ల మీద సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ జరుగుతూ ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఆటతోనే కాక మాటతీరుతోనూ వాళ్లు సోషల్ మీడియాకు టార్గెట్ అవుతుంటారు.…
https://www.youtube.com/watch?v=hFNCZ_oVOZ4 ఏడాదిన్నరగా కళ్యాణ్ రామ్ కు గ్యాప్ వచ్చేసింది. డెవిల్ తర్వాత ఆచితూచి అడుగులు వేస్తున్న ఈ నందమూరి హీరో…