Political News

వారాహి యాత్ర.. వైసీపీ అటెన్షన్‌

పవన్‌ వారాహి యాత్ర అంటేనే వైసీపీ అలర్ట్‌ అవుతోంది. మొదటి, రెండో విడతల్లో గోదావరి జిల్లాలకే పరిమితం అనుకుంటే.. మూడో విడత ఉత్తరాంధ్రలో కాలు పెట్టాడు. విశాఖలో తొలిరోజు మాట్లాడుతూ తానేం మాట్లాడతానో అని చాలా కోపంగా గొంతు నులిమేద్దామని ఎదురు చూస్తున్న వైసీపీ నాయకులకు నా నమస్కారాలు.. అంటూ తన ప్రసంగాన్ని పార్రంభించారు. అది నిజమే అంటూ జనసైనికులు తమ కేరింతలతో సమాధానమిచ్చారు.

వచ్చే ఎన్నికల్లో వైసీపీ తన సమీప ప్రత్యర్థిని గుర్తించిందా! ఆ రాజకీయ శత్రువునే టార్గెట్‌ చేస్తోందా? జరుగుతున్న పరిణామాలు అవుననే సమాధానం ఇస్తున్నాయి. అధికార పక్షం పై జనసేన అధినేత పవన్‌ కాలుదువ్వుతున్న వైనం, అందుకు బదులుగా జగన్‌ చేస్తున్న వ్యక్తిగత విమర్శలు రాష్ట్రంలో రాజకీయ వేడిని రాజేస్తున్నాయి. తన శత్రువుని తానే ఎంచుకోవడం అనేది రాజకీయాల్లో నయా ట్రెండ్‌. ఏపీ రాజకీయాల్లోనూ ఇదే ట్రెండ్‌ కొనసాగుతోంది. వారాహి యాత్ర మొదలైన తర్వాత మిగిలిన పార్టీల వాయిస్‌ అంతగా వినిపించడం లేదు. పవన్‌ వైసీపీ నేతలపై పదునైన ఆరోపణలు చేయడమే అందుకు కారణం. ఈ కారణంగానే జనసేన పతాక స్థాయి వార్తలలో ఉంటోంది.

పవన్‌ వారాహిపై నుంచి ప్రసంగించినా, రిషికొండ వెళ్లినా, పెందుర్తి వెళ్లినా.. వలంటీర్ల వ్యవస్థపై విమర్శలు గుప్పించినా.. వెంటనే నలుగురైదుగురు మంత్రులు, అధికార ప్రతినిధులు అందుకు సమాధానం ఇచ్చే పనిలో ఉంటున్నారు. కానీ పైకి మాత్రం తమ ముఖ్యమంత్రి పవన్‌ పేరు కూడా ఉచ్ఛరించడం లేదని చెబుతున్నారు. ఏదేమైనా రానున్న ఎన్నికల్లో జనసేన కోరుకున్నట్లు ద్విముఖ పోరు జరుగుతుందా..? వైసీపీ కోరుకున్నట్లు బహుముఖ పోరు జరుగుతుందో వేచి చూడాలి.

This post was last modified on August 13, 2023 12:07 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

అంతా సిద్ధం!.. టెస్లా రావడమే ఆలస్యం!

ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తిలో ప్రపంచంలోనే అత్యుత్తమ సంస్థగా టెస్లాకు పేరుంది. ఆ సంస్థ కార్లు భారత్ లోకి ప్రవేశించేందుకు ఇప్పటికే…

51 minutes ago

21 ప‌ద‌వులు.. 60 వేల ద‌రఖాస్తులు..

కూట‌మి ప్ర‌భుత్వం ఏర్పాటులో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించిన అనేక మందికి స‌ర్కారు ఏర్ప‌డిన త‌ర్వాత‌.. నామినేటెడ్ ప‌ద‌వుల‌తో సంతృప్తి క‌లిగిస్తున్నారు. ఎన్ని…

8 hours ago

జగన్ కు సాయిరెడ్డి తలనొప్పి మొదలైనట్టే!

వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఇప్పుడు వరుసగా కష్టాలు మొదలైపోతున్నాయి. మొన్నటి సార్వత్రిక…

8 hours ago

వైసీపీకి భారీ దెబ్బ‌.. ‘గుంటూరు’ పాయే!

ఏపీ ప్ర‌తిప‌క్ష పార్టీ(ప్ర‌ధాన కాదు) వైసీపీకి తాజాగా భారీ ఎదురు దెబ్బ త‌గిలింది. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో 2021లో అతి…

10 hours ago

కిరణ్ అబ్బవరం… తెలివే తెలివి

కిరణ్ అబ్బవరం ఫ్లాప్ స్ట్రీక్‌కు బ్రేక్ వేసిన సినిమా.. క. గత ఏడాది దీపావళికి విడుదలైన ఈ చిత్రం సూపర్…

11 hours ago

తోలు తీస్తా: సోష‌ల్ మీడియాకు రేవంత్ వార్నింగ్‌

సోష‌ల్ మీడియాలో ఇష్టానుసారం పోస్టులు పెట్టే సంస్కృతి పెరిగిపోతోంద‌ని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇలాంటి వారి విష‌యంలో…

11 hours ago