Political News

వారాహి యాత్ర.. వైసీపీ అటెన్షన్‌

పవన్‌ వారాహి యాత్ర అంటేనే వైసీపీ అలర్ట్‌ అవుతోంది. మొదటి, రెండో విడతల్లో గోదావరి జిల్లాలకే పరిమితం అనుకుంటే.. మూడో విడత ఉత్తరాంధ్రలో కాలు పెట్టాడు. విశాఖలో తొలిరోజు మాట్లాడుతూ తానేం మాట్లాడతానో అని చాలా కోపంగా గొంతు నులిమేద్దామని ఎదురు చూస్తున్న వైసీపీ నాయకులకు నా నమస్కారాలు.. అంటూ తన ప్రసంగాన్ని పార్రంభించారు. అది నిజమే అంటూ జనసైనికులు తమ కేరింతలతో సమాధానమిచ్చారు.

వచ్చే ఎన్నికల్లో వైసీపీ తన సమీప ప్రత్యర్థిని గుర్తించిందా! ఆ రాజకీయ శత్రువునే టార్గెట్‌ చేస్తోందా? జరుగుతున్న పరిణామాలు అవుననే సమాధానం ఇస్తున్నాయి. అధికార పక్షం పై జనసేన అధినేత పవన్‌ కాలుదువ్వుతున్న వైనం, అందుకు బదులుగా జగన్‌ చేస్తున్న వ్యక్తిగత విమర్శలు రాష్ట్రంలో రాజకీయ వేడిని రాజేస్తున్నాయి. తన శత్రువుని తానే ఎంచుకోవడం అనేది రాజకీయాల్లో నయా ట్రెండ్‌. ఏపీ రాజకీయాల్లోనూ ఇదే ట్రెండ్‌ కొనసాగుతోంది. వారాహి యాత్ర మొదలైన తర్వాత మిగిలిన పార్టీల వాయిస్‌ అంతగా వినిపించడం లేదు. పవన్‌ వైసీపీ నేతలపై పదునైన ఆరోపణలు చేయడమే అందుకు కారణం. ఈ కారణంగానే జనసేన పతాక స్థాయి వార్తలలో ఉంటోంది.

పవన్‌ వారాహిపై నుంచి ప్రసంగించినా, రిషికొండ వెళ్లినా, పెందుర్తి వెళ్లినా.. వలంటీర్ల వ్యవస్థపై విమర్శలు గుప్పించినా.. వెంటనే నలుగురైదుగురు మంత్రులు, అధికార ప్రతినిధులు అందుకు సమాధానం ఇచ్చే పనిలో ఉంటున్నారు. కానీ పైకి మాత్రం తమ ముఖ్యమంత్రి పవన్‌ పేరు కూడా ఉచ్ఛరించడం లేదని చెబుతున్నారు. ఏదేమైనా రానున్న ఎన్నికల్లో జనసేన కోరుకున్నట్లు ద్విముఖ పోరు జరుగుతుందా..? వైసీపీ కోరుకున్నట్లు బహుముఖ పోరు జరుగుతుందో వేచి చూడాలి.

This post was last modified on August 13, 2023 12:07 am

Share
Show comments
Published by
Tharun

Recent Posts

ప‌ల్నాడులో ఆ 4 నియోజ‌క‌వ‌ర్గాలు హాట్ హాట్‌!

కేంద్ర ఎన్నిక‌ల సంఘం నుంచి రాష్ట్ర ఎన్నికల అధికారుల వ‌ర‌కు కూడా.. అనేక జాగ్ర‌త్త‌లు తీసుకున్నా రు. అధికారుల‌ను మార్చేశారు.…

2 hours ago

కీల‌క నియోజ‌క‌వ‌ర్గాల్లో ఓట‌ర్ల బారులు…. సంకేతం ఏంటి?

రాష్ట్రంలో కీల‌క నాయ‌కులు పోటీ చేస్తున్న నియోజ‌క‌వ‌ర్గాల్లో అనూహ్య‌మైన ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయి. ఉద‌యం 6 గంట‌ల నుంచే ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లోని…

2 hours ago

చంద్ర‌బాబు మాస్ వార్నింగ్‌… ఎవ‌రిని ఉద్దేశించి?

టీడీపీ అధినేత చంద్ర‌బాబు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఉండ‌వ‌ల్లిలోని పోలింగ్ బూత్‌లో ఓటు వేసిన త‌ర్వాత‌.. ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ..…

2 hours ago

సినీ తారల సందడితో పోలింగ్ కళకళ

స్టార్లు సెలబ్రిటీలు తెరమీద, బయట కనిపించినప్పుడు వేరే సంగతి కానీ ఎన్నికల సందర్భంగా ఓటు హక్కుని వినియోగించుకోవడం కోసం పోలింగ్…

2 hours ago

క‌డ‌ప‌లో రికార్డు స్థాయి పోలింగ్‌.. అక్క చెల్లెళ్ల ఎఫెక్టేనా?

ఏపీలో జ‌రుగుతున్న పార్ల‌మెంటు, అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఒక‌టి రెండు జిల్లాలు మిన‌హా.. మిగిలిన జిల్లాల్లో పోలింగ్ ప్ర‌క్రియ ఆశాజ‌న‌కంగానే సాగుతోంది.…

2 hours ago

ప‌వ‌న్ ఫ‌స్ట్ టైమ్‌.. స‌తీస‌మేతంగా ఓటేశారు..

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌న ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు. అయితే.. గ‌తానికి భిన్నంగా ఆయ‌న ఈ సారి భార్య‌తో…

3 hours ago