Political News

వారాహి యాత్ర.. వైసీపీ అటెన్షన్‌

పవన్‌ వారాహి యాత్ర అంటేనే వైసీపీ అలర్ట్‌ అవుతోంది. మొదటి, రెండో విడతల్లో గోదావరి జిల్లాలకే పరిమితం అనుకుంటే.. మూడో విడత ఉత్తరాంధ్రలో కాలు పెట్టాడు. విశాఖలో తొలిరోజు మాట్లాడుతూ తానేం మాట్లాడతానో అని చాలా కోపంగా గొంతు నులిమేద్దామని ఎదురు చూస్తున్న వైసీపీ నాయకులకు నా నమస్కారాలు.. అంటూ తన ప్రసంగాన్ని పార్రంభించారు. అది నిజమే అంటూ జనసైనికులు తమ కేరింతలతో సమాధానమిచ్చారు.

వచ్చే ఎన్నికల్లో వైసీపీ తన సమీప ప్రత్యర్థిని గుర్తించిందా! ఆ రాజకీయ శత్రువునే టార్గెట్‌ చేస్తోందా? జరుగుతున్న పరిణామాలు అవుననే సమాధానం ఇస్తున్నాయి. అధికార పక్షం పై జనసేన అధినేత పవన్‌ కాలుదువ్వుతున్న వైనం, అందుకు బదులుగా జగన్‌ చేస్తున్న వ్యక్తిగత విమర్శలు రాష్ట్రంలో రాజకీయ వేడిని రాజేస్తున్నాయి. తన శత్రువుని తానే ఎంచుకోవడం అనేది రాజకీయాల్లో నయా ట్రెండ్‌. ఏపీ రాజకీయాల్లోనూ ఇదే ట్రెండ్‌ కొనసాగుతోంది. వారాహి యాత్ర మొదలైన తర్వాత మిగిలిన పార్టీల వాయిస్‌ అంతగా వినిపించడం లేదు. పవన్‌ వైసీపీ నేతలపై పదునైన ఆరోపణలు చేయడమే అందుకు కారణం. ఈ కారణంగానే జనసేన పతాక స్థాయి వార్తలలో ఉంటోంది.

పవన్‌ వారాహిపై నుంచి ప్రసంగించినా, రిషికొండ వెళ్లినా, పెందుర్తి వెళ్లినా.. వలంటీర్ల వ్యవస్థపై విమర్శలు గుప్పించినా.. వెంటనే నలుగురైదుగురు మంత్రులు, అధికార ప్రతినిధులు అందుకు సమాధానం ఇచ్చే పనిలో ఉంటున్నారు. కానీ పైకి మాత్రం తమ ముఖ్యమంత్రి పవన్‌ పేరు కూడా ఉచ్ఛరించడం లేదని చెబుతున్నారు. ఏదేమైనా రానున్న ఎన్నికల్లో జనసేన కోరుకున్నట్లు ద్విముఖ పోరు జరుగుతుందా..? వైసీపీ కోరుకున్నట్లు బహుముఖ పోరు జరుగుతుందో వేచి చూడాలి.

This post was last modified on August 13, 2023 12:07 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

చంద్రబాబుపై అంబటి బూతుపురాణం… ఏం జరిగింది?

వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారని వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన సీబీఐ తాజాగా సుప్రీం…

3 minutes ago

చిట్టి ఇలా రెచ్చిపోయిందేంటి…

ఫరియా అబ్దుల్లా అంటే మనందరికీ 'జాతిరత్నాలు' సినిమాలోని చిట్టినే గుర్తొస్తుంది. ఆ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఈ…

47 minutes ago

దురంధర్‌ను చెడగొట్టిన నెట్‌ఫ్లిక్స్

దురంధర్.. గత ఏడాది డిసెంబర్లో విడుదలై.. ఇప్పటికీ థియేటర్లలో మంచి వసూళ్లు సాధిస్తున్న సినిమా. ఇంకా థియేట్రికల్ రన్ కొనసాగుతుండగానే…

1 hour ago

పసిడి పతనం: 48 గంటల్లో రూ. 1.8 లక్షల సంపద ఆవిరి

బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా కుప్పకూలాయి. గత రెండు రోజులుగా సాగుతున్న ఈ పతనం శనివారం…

2 hours ago

11న అసెంబ్లీ… ఆ 11 మంది వస్తారా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరుగుతోంది. 16వ శాసనసభ ఐదో సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ…

2 hours ago

తిరుమల లడ్డు వ్యవహారం… టీటీడీ ఈవో బదిలీ?

తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ పరిధి క్రమంగా ఉన్నతాధికారుల వరకు విస్తరిస్తోంది. ఈ…

3 hours ago