యూత్ విషయంలో ప్రభుత్వం ఫెయిలైందా ?

యూత్ ను టాకిల్ చేయటంలో తెలంగాణా ప్రభుత్వం విఫలమైందనే అనిపిస్తోంది. యూత్ కు మొదటగా కావాల్సింది ఉద్యోగ, ఉపాధి అవకాశాలు. ఈ రెండు క్రియేట్ చేయలేకపోయినపుడు 2018 ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినట్లు కనీసం నిరుద్యోగ భృతి. ఉద్యోగాలను భర్తీ చేయటంలోనే కాదు పరీక్షలు నిర్వహించటంతోపాటు చివరకు నిరుద్యోగ భృతి కల్పించటంలో కూడా ప్రభుత్వం ఫెయిలైన విషయం అర్ధమవుతోంది. ఉద్యోగాల భర్తీ కోసమే ఏర్పాటుచేసిన టీఎస్సీఎస్సీని  నూరుశాతం వివాదాలు చుట్టుముడుతున్నాయి.

ఉద్యోగాలు భర్తీ చేయకుండా చాలా కాలం తాత్సారంచేసిన కేసీయార్ ప్రభుత్వం రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కొన్ని గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగాలను భర్తీ చేయాలని ప్లాన్ చేసింది. దీనికి అనుగుణంగానే టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్లు జారీచేసింది. ఎప్పుడైతే నోటిఫికేషన్ల ద్వారా పరీక్షల నిర్వహణకు రెడీ అయ్యిందో వెంటనే ప్రశ్నపత్రాల లీకేజీలు మొదలయ్యాయి. దీంతో పరీక్షల నిర్వహణ, అభ్యర్ధుల ఎంపిక, ఉద్యోగాల భర్తీ పెద్ద ప్రహసనంగా మారిపోయింది.

కోర్టుల్లో కేసులతో సతమతమవుతున్న సమయంలో టీఎస్సీపీఎస్సీని ప్రక్షాళనచేసింది. కొత్త బోర్డు ఏమిచేసిందంటే నిర్వహించబోయే పరీక్షలన్నింటినీ వెంటవెంటనే నిర్వహించేస్తోంది. పరీక్షలకు ప్రిపేర్ అయ్యే సమయాన్ని కూడా అభ్యర్ధులకు ఇవ్వకపోవటంతో వాళ్ళంతా మండిపోయారు. దాంతో టీఎస్పీఎస్సీపై దండయాత్రచేశారు. గురువారం ఉదయం నుండి మధ్యాహ్నం వరకు వందలాదిమంది విద్యార్ధులు, పరీక్షలు రాయబోతున్న వాళ్ళు టీఎస్పీఎస్సీ కార్యాలయం వద్ద నానా గోలచేశారు. ఇప్పటికే ప్రభుత్వంపై నిరుద్యోగులు, ఉద్యోగాలు రానివాళ్ళు, విద్యార్ధులంతా మండిపోతున్నారు.

అప్పుడెప్పుడో ఇచ్చిన హామీ ప్రకారం కనీసం నిరుద్యోగ భృతి కూడా ఇవ్వటంలేదు. దాంతో యూత్ లో అత్యధికం కేసీయార్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తయారయ్యారని మంత్రులు, ఎంఎల్ఏల్లో టెన్షన్ పెరిగిపోతోంది. రేపు ఎన్నికల ప్రచారానికి వెళ్ళినపుడు ఎలాంటి పరిస్ధితులు ఉంటాయో అనే ఆందోళన పెరిగిపోతోంది. యూత్ ఫ్యాక్టర్ ను ప్రతిపక్షాలు ముఖ్యంగా కాంగ్రెస్ ఎక్కువగా అడ్వాంటేజ్ తీసుకుంటోంది. గ్రూప్ 2 పరీక్షల తేదీలను రీ షెడ్యూల్ చేయటానికి ప్రభుత్వం ప్రిస్టేజ్ గా పోతోంది. చేయకపోతే నిరుద్యోగులు, పరీక్షలు రాసేవాళ్ళు ఊరుకోవటంలేదు. రీషెడ్యూల్ చేస్తే ప్రభుత్వం అవమానంగా భావిస్తోంది. మరీ సమస్య ఎలా పరిష్కారమవుతుందో చూడాల్సిందే.