Political News

ఈ సారి కాంగ్రెస్ అభ్య‌ర్థుల ఎంపిక ఇలా!

తెలంగాణ ఎన్నిక‌ల్లో కేసీఆర్‌కు చెక్ పెట్టి అధికారంలోకి రావాల‌నే ప‌ట్టుద‌ల‌తో ఉన్న కాంగ్రెస్‌.. అందుకు త‌గ్గ క‌స‌ర‌త్తుల‌తో ముందుకు సాగుతోంది. ఇటీవల రాష్ట్రంలో కాంగ్రెస్‌కు పెరుగుతున్న ఆద‌ర‌ణ‌ను ఓట్లుగా మ‌లుచుకునేందుకు స‌రైన అభ్య‌ర్థుల‌ను బ‌రిలో దింపాల‌ని చూస్తోంది. అందుకే ఈ సారి అభ్య‌ర్థుల ఎంపిక‌కు గ‌తంలో కంటే భిన్న‌మైన ప్ర‌ణాళిక‌ను అమ‌లు చేయ‌బోతున్న‌ట్లు తెలిసింది.

ఎన్నిక‌ల్లో నిల‌బెట్టే అభ్య‌ర్థుల ఎంపిక‌, టికెట్ల కేటాయింపుపై కాంగ్రెస్ కొన్నేళ్లుగా ఓ ప‌ద్ధ‌తి పాటిస్తోంది. టికెట్ ఆశిస్తున్న నాయ‌కుల నుంచి ద‌ర‌ఖాస్తులు స్వీక‌రిస్తుంది.  వీటిలో నుంచి కొంత‌మంది పేర్ల‌ను టీపీసీసీ షార్ట్‌లిస్ట్ చేసి అధిష్ఠానానికి పంపిస్తుంది. అక్క‌డ స్క్రీనింగ్ క‌మిటీ మ‌రోసారి షార్ట్‌లిస్ట్ చేసి.. చివ‌ర‌కు ఏఐసీసీ ఎన్నిక‌ల క‌మిటీ అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేస్తుంది. ఇదే ఆన‌వాయితీగా వ‌స్తుంది. 2018 ఎన్నిక‌ల్లో అయితే ఏఐసీసీ నియ‌మించిన స్క్రీనింగ్ క‌మిటీ హైద‌రాబాద్‌కు వ‌చ్చి ఇంట‌ర్వ్యూలు చేసి మ‌రీ అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేసిన‌ట్లు తెలిసింది.

కానీ ఈ సారి మాత్రం అభ్య‌ర్థుల ఎంపిక‌కు కాంగ్రెస్ మ‌రో మార్గంలో వెళ్ల‌నుంది. ఈ సారి స్క్రీనింగ్ క‌మిటీ నేరుగా క్షేత్ర‌స్థాయిలో ప‌ర్య‌టించ‌నున్న‌ట్లు తెలిసింది. ఆయా జిల్లాల‌కు వెళ్లి అక్క‌డి నియోజ‌క‌వ‌ర్గాల్లో టికెట్ ఆశిస్తున్న నాయ‌కుల‌తో పాటు ఇత‌ర కీల‌క నాయ‌కుల‌తోనూ మాట్లాడి, అభిప్రాయాలు తీసుకోనుంది. ఆ త‌ర్వాత అభ్య‌ర్థుల జాబితా ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంది. ఈ స్క్రీనింగ్ క‌మిటీలో పీసీసీ అధ్య‌క్షుడు రేవంత్‌, సీఎల్పీ నేత భట్టి, ఎంపీ ఉత్త‌మ్ కూడా ఉన్నారు. గ‌తంలో పార్టీలో విభేదాల కార‌ణంగా అభ్య‌ర్థుల విజ‌యం కోసం ఇత‌ర నేత‌లు ప‌ని చేయ‌లేద‌ని స‌మాచారం. అందుకే ఈ సారి అలాంటి విభేదాలు ఉండ‌కుండా నేరుగా జిల్లాల‌కే వెళ్లి ప‌రిస్థితిని తెలుసుకోనున్న‌ట్లు స‌మాచారం. 

Satya

Recent Posts

టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌లోకి వైభవ్‌కు నో ఎంట్రీ

టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఇంగ్లాండ్ టూర్‌లో ఊహించని పరిస్థితిని ఎదుర్కోబోతున్నాడు. శుక్రవారం ఐర్లాండ్‌తో జరిగే టీ20 మ్యాచ్‌తో…

10 minutes ago

రణబాలికి సర్దార్ టెన్షన్ ఉంటుందా

విజయ్ దేవరకొండ ప్యాన్ ఇండియా మూవీ రణబాలి సెప్టెంబర్ 11 విడుదల తేదీ ఎప్పుడో ఖరారు చేసుకుంది. అధికారిక ప్రకటన…

32 minutes ago

మోదీకి అందుకే షేక్ హ్యాండ్ ఇవ్వలేదు

రీసెంట్ గా జరిగిన పద్మ అవార్డుల ప్రదానోత్సవంలో జరిగిన ఒక చిన్న ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద దుమారమే…

52 minutes ago

ఎండలో ఆ హుడీనే పట్టించింది.. పుణే వ్యాపారవేత్త హత్యలో షాకింగ్ నిజాలు!

మహారాష్ట్రలోని పుణే సమీపంలో జరిగిన యువ వ్యాపారవేత్త అనుమానాస్పద మృతి కేసులో కళ్లు చెదిరే నిజాలు బయటపడ్డాయి. జూన్ 18వ…

1 hour ago

గ్రీన్ కార్డు గొప్ప‌లు వ‌ద్దు: సుప్రీంకోర్టు కొర‌డా ఇదిగో!

అగ్రరాజ్యం అమెరికాలో శాశ్వ‌త నివాసం కోసం గ్రీన్ కార్డ్‌.. అత్యంత కీల‌కం. దీనిని సాధించ‌డ‌మే మ‌హా య‌జ్ఞం చేసినంత ప‌నిగా…

2 hours ago

‘అప్పుడు కేజీఎఫ్‌… ఇప్పుడు జొన్న‌గిరి’

ఒక‌ప్పుడు బంగారం నిల్వ‌ల విష‌యంలో కేజీఎఫ్ గురించి చ‌ర్చ జ‌రిగేద‌ని.. కానీ, ఇప్పుడు క‌ర్నూలు జిల్లాలోని జొన్న‌గిరి గురించి దేశ‌వ్యాప్తంగా…

3 hours ago