Political News

వైజాగ్ లో మొదలైన టెన్షన్

రాయలసీమలో చంద్రబాబునాయుడు పర్యటనలో తలెత్తిన టెన్షన్ ముగియకముందే ఉత్తరాంధ్రలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ టెన్షన్ మొదలైంది. ఈరోజు సాయంత్రం నుండి పవన్ వైజాగ్ తో వారాహియాత్రను మొదలుపెడుతున్నారు. 10 రోజుల వారాహియాత్రను విశాఖపట్నం సభతో పవన్ మొదలుపెడుతున్నారు. మొదటి సభే వైజాగ్ సిటీలోని జగదాంబ సెంటర్ తో మొదలుపెడుతున్నారు. మామూలుగా అయితే సిటీలోని జగదాంబ సెంటర్ లో సభను ఎవరు పెట్టరు, సభను పెట్టాలని అనుకున్నా పోలీసులు అనుమతించరు.

కారణం ఏమిటంటే వైజాగ్ సిటీకి జగదాంబ సెంటర్ అన్నది అత్యంత కీలకమైన, రద్దీ సెంటర్ అన్నది అందరికీ తెలిసిందే. అంతటి రద్దీ సెంటర్లో రాజకీయ సభలకు, కార్యక్రమాలకు అనుమతిస్తే మొత్తం సిటీ ట్రాఫిక్ అంతా ప్యారలైజ్ అయిపోతుంది. అందుకనే సిటీలో ఏ పార్టీకి పోలీసులు అనుమతి ఇవ్వరు. అలాంటిది జనసేన పర్మిషన్ అడగటం, పోలీసులు ఇవ్వటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ముందుగానే పోలీసులు ఎంత ట్రాఫిక్ డైవర్షన్ పెట్టినా ట్రాఫిక్ ఇబ్బందులైతే జనాలకు తప్పేట్లులేదు.

పైగా పవన్ ప్రోగ్రామ్ అనుకున్నది అనుకున్నట్లు మొదలుకాదు. ఇప్పటివరకు ఏ ప్రోగ్రామ్ తీసుకున్నా కనీసం రెండుమూడు గంటలు ఆలస్యంగానే మొదలవుతోంది. అంటే మూడు గంటలు ఆల్యంగా మొదలైందంటే అన్నిగంటలు ట్రాఫిక్ ఆగిపోయినట్లే లెక్క. సరే ట్రాఫిక్ సమస్యలను పక్కనపెట్టేస్తే నిబంబధనలను ఉల్లంఘించకూడదని పోలీసులు కొన్ని ఆంక్షలు విధించారు. పోలీసులు విధించన ఆంక్షలను పాటించటమే అసలైన సమస్య. పవన్ను చూడటానికి వచ్చేవాళ్ళు, పవన్ సభల్లో పాల్గొనేది మామూలు జనాలు కాదు.

పవన్ అభిమానులే ఎక్కువగా జనసేన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అభిమానులను కంట్రోల్ చేయటం చాలా కష్టం. పదులసంఖ్యలో అయితే కంట్రోల్ చేయచ్చు కానీ వేలసంఖ్యలో వచ్చే అభిమానులను కంట్రోల్ చేయటం పోలీసులకు తలకుమించిన పననే చెప్పాలి. ఎక్కడో ఎవరో నిబంధనలను ఉల్లంఘిస్తారు దాంతో పోలీసులక మండుతుంది. దాంతో ప్రోగ్రామ్ అంతా గబ్బుపట్టిపోవటం ఖాయం. నిబంధనలను ఉల్లంఘించాలని, ప్రతి ఒక్కళ్ళు నిబంధనలకు కట్టుబడి ఉండాలని పార్టీ తరపున పవన్ పదేపదే ట్విట్టర్లో అప్పీల్ చేశారు. ట్విట్టర్లో అప్పీల్ చేయటం ఒకేనే కానీ డైరెక్టుగా పవన్ కనిపిస్తే అభిమానులకు నియమాలు, నిబంధనలు ఏవీ గుర్తుండవు. అందుకనే పవన్ టూర్ సందర్భంగా టెన్షన్ పెరిగిపోతోంది. 

Satya

Recent Posts

దెయ్యాలంటే మనోళ్లకు ప్రేమ ఎక్కువే

ఇటీవలే విడుదలైన హాలీవుడ్ మూవీ ఈవిల్ డెడ్ బర్న్ ఇండియా మొత్తం మీద మొదటి వీకెండ్ కాకుండానే 18 కోట్లకు…

10 minutes ago

ముద్రగడ పద్మనాభం కన్నుమూత

కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం రెడ్డి కన్ను మూశారు. కొంతకాలం నుంచి ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ…

45 minutes ago

అఖిల్ ఈసారి ఆ తప్పు చేయకూడదు

అక్కినేని కుటుంబం, అభిమానుల సుదీర్ఘ నిరీక్షణ ఫలించింది. ఆ కుటుంబం నుంచి కొత్త తరంలో చాలా పెద్ద స్టార్ అయిపోతాడు…

2 hours ago

తారక్ సినిమా లక్ష్యాలు చాలా పెద్దవి

ఒక ఫ్యాన్ అసోసియేషన్ వ్యక్తిగతంగా తమ హీరో పేరు మీద సేవా కార్యక్రమాలు తలపెడితే, దానికి రాజకీయ రంగప్రవేశానికి ముడిపెట్టి…

3 hours ago

వెయ్యి కోట్ల దురంధర్… అక్కడేమో డిజాస్టర్

పెద్దగా అంచనాలు లేకుండా గత ఏడాది డిసెంబర్ లో దురంధర్ విడుదలైనప్పుడు ఎవరూ దాని సునామిని ఊహించలేదు. వంద కోట్లు…

3 hours ago

చివరికి స్మశానాలను కూడా వదలలేదు

అవినీతికి అడ్డూ అదుపు లేకుండా పోతోంది. తెలంగాణలో అవినీతి మరింతగా రాజ్యమేలుతోందని చెప్పక తప్పదు. రాష్ట్రంలో వరుసగా వెలుగు చూస్తున్న ఘటనలే…

5 hours ago