Political News

మెగా బ్ర‌ద‌ర్స్ వ‌ర్సెస్ వైసీపీ

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రాజకీయం మ‌రోసారి వేడెక్కింది. ఇన్ని రోజులు రాజ‌కీయ అంశాల‌పై ఎలాంటి వ్యాఖ్య‌లు చేయ‌కుండా సైలెంట్‌గా ఉన్న చిరంజీవి ఒక్క‌సారిగా వైసీపీ ప్ర‌భుత్వంపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేయ‌డం హాట్ టాపిక్‌గా మారింది. యాక్ట‌ర్ల రెమ్యున‌రేష‌న్ సంగ‌తి ప‌క్క‌న‌పెట్టి.. ఏపీలో అభివృద్ధి ప‌నుల‌పై దృష్టి పెట్టాల‌ని, ప్రత్యేక హోదా అంశాన్ని ప‌ట్టించుకోవాల‌ని చిరంజీవి గ‌ట్టిగానే చుర‌కంటించారు. మ‌రి చిరంజీవి వ్యాఖ్య‌ల‌పై స్పందించ‌కుండా వైసీపీ నాయ‌కులు ఉంటారా? లేదు క‌దా.. ఊహించిన‌ట్లే వైసీపీ నేత‌లు తీవ్రంగానే స్పందిస్తున్నారు.

వైసీపీ నేత‌లు చిరుపై ప్ర‌తి విమ‌ర్శ‌ల‌కు దిగ‌డంతో ఇప్పుడు ఏపీలో రాజ‌కీయం మెగా బ్ర‌ద‌ర్స్ వ‌ర్సెస్ వైసీపీగా మారింద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఇన్ని రోజులు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను, ఆయ‌న చిన్న‌న్న‌య్య నాగ‌బాబును ల‌క్ష్యంగా చేసుకుని వైసీపీ నేత‌లు విమ‌ర్శ‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ ఇద్ద‌రు అన్న‌ద‌మ్ములు కూడా ఏ మాత్రం త‌గ్గ‌క‌పోవ‌డంతో మాట‌ల యుద్ధం ఆస‌క్తిక‌రంగా సాగింది. ఇప్పుడు ఇందులోకి మెగాస్టార్ వచ్చార‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి.

ఇన్ని రోజులు త‌మ్ముళ్ల‌ను ఎన్ని మాట‌ల‌న్నా నోరు మెద‌ప‌ని అన్న‌య్య‌.. ఇప్పుడు ఎన్నిక‌లు స‌మీపిస్తున్న వేళ రెచ్చిపోవ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప‌వ‌న్‌కు మ‌ద్ద‌తుగా అన్న‌య్య రంగంలోకి దిగుతారనే ప్ర‌చారం ఊపందుకుంది. అంతేకాకుండా ఆయ‌న జ‌న‌సేన‌లో చేరి మ‌రోసారి రాజ‌కీయ బ‌రిలో అడుగుపెడ‌తార‌నే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మొత్తానికి చిరు వ్యాఖ్య‌ల‌తో మ‌రోసారి ఏపీలో రాజ‌కీయం మాత్రం వేడెక్కింద‌నే చెప్పాలి. మ‌రి అన్న‌య్య‌పై వైసీపీ నేత‌ల విమ‌ర్శ‌ల‌పై ప‌వ‌న్‌, నాగ‌బాబు ఎలా రియాక్ట‌వుతారో చూడాలి. 

This post was last modified on August 9, 2023 8:52 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

సూపర్ నిర్ణయం… GO వచ్చినా పాత రేట్లే

తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…

1 hour ago

నానితో క్లాష్… మెగాస్టార్ ఒప్పుకోరేమో

అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…

2 hours ago

పెద్ది మెడకు పర్సెంటేజ్ గొడవ

తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…

3 hours ago

‘నీట్’ గా పేపర్ అమ్మేశారట!

నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…

3 hours ago

భగీరథ్ కేసు వాదించేది వైసీపీ ఎంపీనే

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే.…

5 hours ago

కేరళం ‘సీల్డ్ కవర్’ తెరచుకునేదెన్నడో..?

దేశంలో ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎప్పుడో వెలువడ్డాయి. ఆ ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో…

5 hours ago