Political News

కలకలం… మోదీ స్టేట్ సిటీలు సహా ఐదు నగరాల్లో కరోనా విలయం

ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న కరోనా వైరస్… భారత్ లో అంతకంతకూ తన విస్తృతిని పెంచేస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు 23 వేలకు పైగా నమోదు కాగా… దేశంలోని పలు కీలక నగరాల్లో వైరస్ విస్తృతి ఓ రేంజిలో ఉంది. ఇలా కరోనా విస్తృతి శృతి మించిన నగరాల జాబితాలో ప్రధాని నరేంద్ర మోదీ సొంత నియోజకవర్గంగా పేరొందిన అహ్మదాబాద్ సహా గుజరాత్ లోని సూరత్ కూడా చేరిపోయాయి. గుజరాత్ వాణిజ్య రాజధానిగా పేరొందిన అహ్మదాబాద్ తో పాటు దేశంలోనే వస్త్ర వ్యాపారానికి కేంద్ర బిందువుగా పేరొందిన సూరత్ కూడా కరోనా విలయం తాండవం చేస్తున్న నగరాల జాబితాలో చేరిపోవడం నిజంగానే ఆందోళన రేకెత్తిస్తోంది. ఈ క్రమంలో ఆ రెండు నగరాలతో పాటు కరోనా విస్తృతి అమాంతంగా పెరిగిపోతున్న తెలంగాణ రాజధాని హైదరాబాద్ తో పాటు తమిళనాడు రాజధాని చెన్నై, మహారాష్ట్రలోని కీలక నగరం థానేల్లో పరిస్థితిని అంచనా వేసేందుకు కేంద్ర బృందాలు రంగంలోకి దిగిపోయాయి.

ఈ తరహాలో 10 కేంద్ర బృందాలు ఇప్పటికే ఏర్పాటు కాగా.. వాటిలో ఐదు బృందాలను ముంబై, పుణే (మహారాష్ట్ర), ఇండోర్ (మధ్యప్రదేశ్), జైపూర్ (రాజస్థాన్), కోల్ కతాతో పాటు ఆ నగరం పరిసర పట్టణాలు(పశ్చిమ బెంగాల్)లకు పంపిన సంగతి తెలిసిందే. తాజాగా అహ్మదాబాద్, సూరత్, హైదరాబాద్, చెన్నై, థానే నగరాల్లో కరోనా వైరస్ విస్తృతి ఓ రేంజికి చేరిపోవడంతో ఆందోళన వ్యక్తం చేసిన కేంద్ర ప్రభుత్వం.. కొత్తగా ఐదు కేంద్ర బృందాలను ఏర్పాటు చేసి హుటాహుటీన ఆ నగరాలకు పంపింది. ఈ బృందాలు ఆయా నగరాల్లో పర్యటించి.. అక్కడి తాజా పరిస్థితులను అధ్యయనం చేసి… కరోనా కట్టడికి ఏమేం చేయాలన్న విషయంపై రాష్ట్ర ప్రభుత్వాలకు సూచనలు చేయడంతో పాటుగా సదరు నివేదికలను కేంద్రానికి నివేదించనున్నాయి. అసలు ఈ నగరాల్లోనే కరోనా విలయతాండవం చేసేందుకు గల కారణాలు ఏమిటన్న విషయంపై కేంద్ర బృందాలు ప్రత్యేకంగా దృష్టి సారించనున్నాయి.

దేశంలో కరోనా కట్టడి కోసం ఏకంగా నెల రోజుల పాటు లాక్ డౌన్ ను అమలు చేసినా… కీలక నగరాల్లో వైరస్ వ్యాప్తికి ఇంకా చెక్ పడకపోవడం ఆందోళన రేకెత్తించే అంశమే. ఓ వైపు లాక్ డౌన్ ను పక్కాగానే అమలు చేస్తున్నామని చెప్పుకుంటున్నా… మోదీ సొంత రాష్ట్రానికి చెందిన రెండు కీలక నగరాల్లో వైరస్ వ్యాప్తి ప్రమాదకర స్థాయికి చేరడం నిజంగానే ఆందోళన రేకెత్తించేదే. దేశంలోనే పారిశ్రామికంగా కీలక రాష్ట్రంగా ఉన్న గుజరాత్ లో.. ఆ రాష్ట్ర వాణిజ్య నగరం అహ్మదాబాద్ లో వైరస్ వ్యాప్తికి చెక్ పడకపోవడం ప్రమాద ఘంటికలు మోగిస్తున్నట్లుగానే భావించాలి. ఈ నేపథ్యంలోనే కేంద్రం ప్రత్యేకంగా కేంద్ర బృందాలను రంగంలోకి దించిందని చెప్పాలి. మరి ఈ కేంద్ర బృందాల అధ్యయనం తర్వాతైనా అహ్మదాబాద్ లో కరోనా వైరస్ వ్యాప్తికి ఏ మేర కట్టడి పడుతుందో చూడాలి. అదే విధంగా అహ్మదాబాద్ తరహాలోనే తీవ్ర భయాందోళనలు రేకెత్తిస్తున్న హైదరాబాద్, చెన్నై, సూరత్, థానేల్లో పరిస్థితిని ఎలా అదుపు చేస్తారో చూడాలి.

suman

Recent Posts

13 ఏళ్ల బాలుడు బాబు గారితో ఫోటో కోసం…

సినిమాల్లో వేషం కోసం చెన్నయ్ వెళ్లారు.. అభిమాన హీరోని కలిసి ఎందుకు హైదరాబాదు వెళ్లారు.. అనే వార్తలను తరచూ వింటూ…

5 hours ago

టికెట్ రేట్లు చేస్తున్న మేలు అర్థమవుతోందా

లెనిన్ సూపర్ హిట్టయిపోయింది. బ్లాక్ బస్టర్ దారిలో ఉంది. పదేళ్లకు పైగా విజయం కోసం మొహం వాచిపోయిన అఖిల్ అభిమానులకు…

6 hours ago

పోల‌వ‌రంపై చంద్ర‌బాబు శ‌ప‌థం

పోల‌వ‌రం ప్రాజెక్టును ఆరు నూరైనా పూర్తి చేస్తామ‌ని సీఎం చంద్ర‌బాబు శ‌ప‌థం చేశారు. గోదావ‌రి జిల్లాల్లో ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన ఆయ‌న…

8 hours ago

నాగార్జున 101 ఫిక్సయిందా?

అక్కినేని నాగార్జున కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 100వ సినిమా కోసం అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. కానీ…

8 hours ago

ఇప్పుడున్న రాజకీయాల్లో ఎన్టీఆర్‌ ఇమ‌డ‌గ‌ల‌రా?

జూనియ‌ర్ ఎన్టీఆర్‌.. రాజ‌కీయ రంగ ప్ర‌వేశంపై త‌ర‌చుగా ప్ర‌చారం జ‌రుగుతూనే ఉంది. ఆయ‌న‌కు అను కూలంగా ఏపీలోనూ కొన్ని ప్రాంతాల్లో…

9 hours ago

చిరు దిగాడు… పంచాయితీ ముగిసింది

తెలుగు టాప్ కొరియోగ్రాఫ‌ర్ల‌యిన జానీ మాస్ట‌ర్, శేఖ‌ర్ మాస్ట‌ర్ ప‌ర‌స్ప‌రం అరుచుకుంటూ ఒక‌రి మీదికి ఒక‌రు దూసుకువెళ్తున్న వీడియో తాజాగా…

9 hours ago