Political News

పొత్తుపైనే పొన్నాడ భవిష్యత్తు ఆధారపడుందా ?

రాబోయే ఎన్నికలకు సంబంధించి మూడు అంశాలు జనాల్లో విపరీతంగా చర్చ జరుగుతున్నాయి. మొదటిదేమో టీడీపీ-జనసేన మధ్య పొత్తుంటుందా ఉండదా ? అని. రెండో అంశం ఏమిటంటే పొత్తుంటే లాభం ఎవరికి ? నష్టం ఎవరికి అని. మూడో అనుమానం ఏమిటంటే టీడీపీ, జనసేన పొత్తుల్లో పోటీచేయబోయే నియోజకవర్గాలు ఏవని. మిగిలిన నియోజకవర్గాల సంగతిని పక్కనపెట్టేసినా ఉమ్మడి తూర్పుగోదావరి జల్లాలోని ముమ్మిడివరం నియోజకవర్గంలో పై అంశాలపై బాగా చర్చలు జరుగుతున్నాయి.

దీనికి కారణం ఏమిటంటే సిట్టింగ్ ఎంఎల్ఏ పొన్నాడ సతీష్ గెలుపు అవకాశాలే. పొన్నాడ ఇప్పటికి రెండుసార్లు గెలిచారు. రెండుసార్లు కూడా చాలా తక్కువ మెజారిటితోనే గెలిచారు. రెండుసార్లు కూడా నోట్ చేసుకోవాల్సిన పాయింట్ ఏమిటంటే ప్రత్యర్ధుల మధ్య ఓట్ల చీలిక వల్లే పొన్నాడ గెలిచారని. 2009లో కాంగ్రెస్ తరపున పొన్నాడ పోటీచేస్తే టీడీపీ తరపున దాట్ల సుబ్బరాజు, పీఆర్పీ తరపున కుడిపూడి సూర్యనారయణ పోటీచేశారు. దాట్ల, కుడిపూడి మధ్య ఓట్లు చీలిపోవటం వల్ల పొన్నాడ గెలిచారు.

ఇక 2019లో వైసీపీ తరపున పొన్నాడ పోటీచేస్తే టీడీపీ తరపున దాట్ల సుబ్బరాజు, జనసేన తరపున పితాని బాలకృష్ణ పోటీచేశారు. వీళ్ళమధ్య ఓట్లు చీలిపోయిన కారణంగా మళ్ళీ పొన్నాడే గెలిచారు. అంటే ముమ్మిడివరంలో పోటీ త్రిముఖం కాకుండా ఫేస్ టు ఫేస్ అయితే పొన్నాడ గెలుపు కష్టమనే చర్చలు జోరుగా జరుగుతోంది. ఇందుకనే రేపటి ఎన్నికల్లో టీడీపీ-జనసేన పొత్తుంటుందా ఉండదా అన్న చర్చ ఎక్కువగా జరుగుతోంది.

పొన్నాడ కూడా తక్కువోడేమీ కాదు. నేతల మద్దతు, క్యాడర్ బలం ఉన్న నేతనేచెప్పాలి. ఇదే సమయంలో తమ ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమపథకాలతో తాను గెలుస్తానని బలంగా నమ్ముతున్నారు. పైగా ఒకపుడు పీఆర్పీ తరపున పోటీచేసిన కుడిపూడి ఇపుడు వైసీపీ ఎంఎల్సీగా ఉన్నారు. నియోజకవర్గంలో ఎస్సీలతో పాటు కాపులు, బీసీలు అంటే శెట్టి బలిజలు కూడా బాగానే ఉన్నారు. కాబట్టి వచ్చేఎన్నికల్లో కూడా కచ్చితంగా గెలుస్తానని పొన్నాడ గట్టి నమ్మకంతో ఉన్నారు. మరి చివరకు ఏమవుతుందో చూడాలి.

This post was last modified on August 7, 2023 7:43 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

2 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

4 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

7 hours ago

జగన్ ఇలానే ఉండాలంటూ టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

10 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

11 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

13 hours ago