Political News

నువ్వు ఎవడ్రా పుడింగి? పెద్దిరెడ్డిపై చంద్రబాబు ఫైర్

అన్నమయ్య జిల్లాలోని అంగళ్లు, చిత్తూరు జిల్లాలోని పుంగనూరులో జరిగిన ఘటనల నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈరోజు శ్రీకాళహస్తిలో జరగబోయే చంద్రబాబు పర్యటన నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని అంతా అనుకున్నారు. అయితే, అన్ని అడ్డంకులను అధిగమించి శ్రీకాళహస్తికి చేరుకున్న చంద్రబాబు అక్కడ రోడ్ షో నిర్వహించారు. చంద్రబాబు రోడ్ షోకు ఇసకేస్తే రాలనంత జనం వచ్చారు.

ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డిపై చంద్రబాబు నిప్పులు చెరిగారు. తాను పుంగనూరు మీదుగా వెళ్ళకూడదు అని చెప్పడానికి నువ్వు ఎవడ్రా పుడింగి అంటూ చంద్రబాబు షాకింగ్ కామెంట్స్ చేశారు. ఏం తమాషాగా ఉందా? ఏమనుకుంటున్నావు? అంటూ వార్నింగ్ ఇచ్చారు. అంగళ్ళులో తనను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే టీడీపీ కార్యకర్తలు దీటుగా అడ్డుకున్నారని, పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారని చంద్రబాబు ఆరోపించారు. పుంగనూరు మీదుగా పూతలపట్టు వెళ్లాలనుకున్నానని, కానీ, తనను వెళ్లనివ్వకుండా అడ్డుకొని హింసాత్మక ఘటనలకు పాల్పడ్డారని ఆరోపించారు.

దాడులు చేసేందుకే వైసీపీ వాళ్ళు వచ్చారని, వారిని పోలీసులు ఎందుకు హౌస్ అరెస్ట్ చేయలేదని నిలదీశారు. ఈరోజు శ్రీకాళహస్తిలో ప్రశాంతంగా సభ జరుగుతోందని, ఇక్కడికి వైసీపీ దొంగలు రాలేదు కాబట్టే సభ సజావుగా సాగుతోందని చంద్రబాబు అన్నారు. మన మీద దాడికి వస్తే తిరగబడతామని, వాళ్ళు కర్ర తీసుకుని వస్తే తాను కూడా కర్ర తీసుకొని వస్తానని చంద్రబాబు అన్నారు. నువ్వు ఒక దెబ్బ కొడితే నేను రెండు దెబ్బలు కొడతానని, వివేకా మాదిరి గొడ్డలితో నరికితే చనిపోవడానికి ఎవరూ సిద్ధంగా లేరని చెప్పారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టర్లు పెడితే కలెక్టర్లు, ఎస్పీలు తొలగిస్తున్నారని ఆరోపించారు.

నిన్న జరిగిన ఘటనల పట్ల సిగ్గులేకుండా వైసీపీ నాయకులు బంద్ కు పిలుపునిచ్చారని మండిపడ్డారు. తాను బైపాస్ రోడ్డు వరకు వచ్చానని, పుంగనూరుకి వెళ్లానో లేదో చూశారా అని డీఐజీని ప్రశ్నించారు. నేను పుంగనూరులోకి వెళ్లకపోతే దాడులు జరిగేవి కాదని డిఐజి చెప్తున్నారని, లేకపోతే భద్రత కల్పించేవాళ్లమని బుకాయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బుద్ధి, జ్ఞానం ఉండి మాట్లాడుతున్నారా లేక నన్ను కూడా గొడ్డలిపోటుతో లేపేయాలనుకుంటున్నారా అని నిప్పులు చెరిగారు. నన్ను లేపేయడం మీ వల్ల కాదని, టీడీపీ కార్యకర్తలు నాకు శ్రీరామరక్ష అని చంద్రబాబు భావోద్వేగానికి లోనయ్యారు.

This post was last modified on August 5, 2023 10:12 pm

Share

Recent Posts

అప్పుడు కుటుంబ పేర్లు… ఇప్పుడు వీరుల పేర్లు

భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు. ఈ విమానాశ్రయాన్ని జాతికి…

44 minutes ago

హాలీవుడ్ సినిమాలకు మళ్ళీ మంచి రోజులు

ఒకప్పుడు ఇంగ్లీష్ సినిమాలకు మన దేశంలో తెగ క్రేజ్ ఉండేది. జురాసిక్ పార్క్ నుంచి ఇది విపరీతంగా పెరిగిపోయింది. దానికి…

3 hours ago

గండాన్ని దాటిన చెన్నై లవ్ స్టోరీ

గత వారం విడుదలైన ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా ఫుల్ పాజిటివ్ టాకేమీ తెచ్చుకోలేదు. ప్రిమియర్స్ నుంచే డివైడ్ టాక్ మొదలైంది.…

3 hours ago

మోదీ కాళ్లు కడిగి ఆ నీళ్లు తాగాలని ఉంది: నటుడు

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని విష్ణుమూర్తి అవతారంగా ప్రముఖ బాలివుడ్ నటుడు సుదేష్ బెర్రీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో…

4 hours ago

కనకరాజు సీమలో కొరియన్ దెయ్యం

బలమైన కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఆశలన్నీ కొరియన్ కనకరాజు మీదే ఉన్నాయి. ఆగస్ట్…

4 hours ago

“కొబ్బరికాయ కొట్టాం… గుమ్మడి కాయ కట్టాం”

ఏపీ దశ దిశలను మార్చేసే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం శనివారం ఉదయం లాంఛనంగా ప్రారంబమైంది. దేశ ప్రధాని నరేంద్ర మోదీ అల్లూరి సీతారామరాజు…

5 hours ago