Political News

ఎన్టీఆర్ ట్రస్ట్ స్కూల్ లో క్రిమినల్స్: తోపుదుర్తి

నీటిపారుదల ప్రాజెక్టుల నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు చేపట్టిన రాయలసీమ పర్యటన విజయవంతం అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలంలో ప్రసంగించిన చంద్రబాబు…రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన సంగతి తెలిసిందే. తోపుదుర్తి చేసిన అవినీతి అంతా కక్కిస్తానని, ఎక్కడ దాక్కున్నా వదిలేది లేదని చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. వైసీపీ నేతలు కర్ర తీసుకుని దాడికి వస్తే కర్రతోనే సమాధానం చెప్పాలని అనంతపురం టీడీపీ శ్రేణులకు చంద్రబాబు పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే చంద్రబాబు కామెంట్స్ కు తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు.

తనకు 2 వేల కోట్ల రూపాయల ఆస్తులున్నాయని చంద్రబాబు అంటున్నారని, తనకు 50 కోట్లు ఇస్తే ఆయన చెప్పిన 2 వేల కోట్ల ఆస్తులన్నీ రాసిచ్చేందుకు రెడీ అని సవాల్ విసిరారు. మిగిలిన 1950 కోట్లతో రాప్తాడు సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తారా అని చంద్రబాబుకు ఛాలెంజ్ చేశారు. చంద్రబాబుకు దమ్ము, ధైర్యం ఉంటే ఈ సవాల్‌ స్వీకరించాలని డిమాండ్ చేశారు. పాల డైరీ, బోరు బావుల ద్వారా ప్రజా సేవ చేస్తున్నానని, బాబు బెదిరింపులకు భయపడబోనని అన్నారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ గెలిచి నువ్వు ముఖ్యమంత్రి అయితే గుండు కొట్టించుకుంటానంటూ చంద్రబాబుకు మరో ఛాలెంజ్ చేశారు.

హెరిటేజ్ ద్వారా రైతులను మోసం చేసి 25 వేల కోట్ల రూపాయలు దోపిడీ చేసిన చంద్రబాబు తనపై ఆరోపణలు చేయడం హాస్యాస్పదమన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్‌లో ఫ్యాక్షన్ బాధితుల పిల్లలను చదివించి ఫ్యాక్షన్ చేయిస్తున్నారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ ట్రస్ట్ స్కూల్‌ క్రిమినల్స్‌ను తయారు చేసే అడ్డా అని సంచలన ఆరోపణలు చేశారు. అక్కడి విద్యార్థులు కేసుల్లో ఉన్నారని ఆరోపించారు.

శిలాఫలకాలు వేయడం తప్ప ప్రాజెక్టులు పూర్తి చేసే ఉద్దేశం చంద్రబాబుకు లేవని దుయ్యబట్టారు. అమరావతిని రియల్ ఎస్టేట్ దందాగా మార్చారని, తన బినామీలతో అమరావతిలో భూములు కొనిపించారని ఆరోపించారు. చంద్రబాబు రూ.40 వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. రాయలసీమ గురించి మాట్లాడే నైతిక హక్కు చంద్రబాబుకు లేదని, ఆయనో గజదొంగ అని విమర్శించారు.

This post was last modified on August 4, 2023 11:14 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

మిరల్ రిపోర్ట్ ఏంటి

నిన్న ఎలాగూ కొత్త తెలుగు సినిమాలు లేవనే కారణంగా మిరల్ అనే డబ్బింగ్ మూవీని రిలీజ్ చేశారు. ప్రేమిస్తేతో టాలీవుడ్…

5 hours ago

త్రివిక్రమ్ కోసం స్రవంతి ప్రయత్నాలు

గుంటూరు కారం విడుదలై అయిదు నెలలు పూర్తి కావొస్తున్నా త్రివిక్రమ్ శ్రీనివాస్ కొత్త సినిమా ఇప్పటిదాకా మొదలుకాలేదు. అసలు పూర్తి…

6 hours ago

టీడీపీలో 92 గెలుపు గుర్రాలు.. అధికారం ఖాయ‌మే!

బీజేపీ, జ‌న‌సేన‌లతో కూట‌మి క‌ట్టిన టీడీపీ ఏపీలో జ‌రిగిన ఎన్నిక‌ల్లో పోరాటం చేసిన విష‌యం తెలిసిందే. పోలింగ్ శాతం పెరిగిన…

8 hours ago

గురుశిష్యులతో రామ్ చరణ్ సింగిల్ ప్లాన్

గేమ్ ఛేంజర్ దెబ్బకు ఏకంగా మూడు సంవత్సరాలకు పైగా దానికే కేటాయించాల్సి వచ్చిన రామ్ చరణ్ శంకర్ మీద ఉన్న…

8 hours ago

జగన్ విమానం ఖర్చు అంతుంటుందా ?

ఎన్నికల సమరం ముగియడంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుటుంబంతో కలిసి విదేశాలకు విహారయాత్రకు వెళ్లారు. జగన్ విదేశీ పర్యటనకు…

9 hours ago

ప్రేక్షకుల అటెండెన్సుకి ఎవరిది బాధ్యత

చాంతాడంత కారణాలు చెప్పుకుని జనం థియేటర్లకు రావడం లేదని ఎంత బాధ పడినా వాస్తవిక పరిస్థితిని అర్థం చేసుకుంటే కనక…

9 hours ago