ఏపీలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ అగ్రనేతలు.. చంద్రబాబు, ఆయన కుమారుడు, మాజీ మంత్రి నారా లోకేష్ల భద్రత విషయంపై కేంద్ర హోం శాఖ తాజాగా వైసీపీ ప్రబుత్వాన్ని వివరణ కోరింది. వారికి ఎలాంటి భద్రత కల్పిస్తున్నారు? వారి పర్యటనల్లో దాడులు ఎందుకు జరుగుతున్నాయి? వంటి విషయాలపై వివరణ ఇవ్వాలని కోరుతూ.. తాజాగా డీజీపీకి లేఖ రాసింది.
చంద్రబాబు, నారా లోకేష్ల భద్రత విషయంలో తీసుకున్న చర్యలను తమకు మినిట్స్ రూపంలో పంపించాలని కేంద్ర హోం శాఖ ఆదేశించింది. ఈ మేరకు ఏపీ సీఎస్, డీజీపీలకు హోంశాఖ లేఖ రాసింది. మరీ ముఖ్యంగా.. జడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ ఉన్న చంద్రబాబు కాన్వాయ్పై గతంలో జరిగిన దాడులపై వివరాలు కోరింది. అదేవిధంగా తీసుకున్న చర్యలను కూడా తమకు వివరించాలని కోరింది.
నారా లోకేష్ యువగళం పాదయాత్రకు కల్పించిన భద్రత వివరాలను కూడా ఇవ్వాలని కోరింది. అదేవిధంగా.. గత నవంబరు 4న నందిగామలో చంద్రబాబు ర్యాలీలో జరిగిన రాళ్ల దాడిపై కూడా హోంశాఖ నివేదిక ఇవ్వాలని కోరింది. ఏమాత్రం జాప్యం చేయకుండా.. చంద్రబాబు, లోకేష్లకు పూర్తిస్థాయి భద్రత కల్పించాలని డీజీపీ, సీఎస్లను హోంశాఖ ఆదేశించింది.
గత కొన్నినెలలుగా చంద్రబాబు, లోకేశ్ల పర్యటనల్లో దాడులు జరుగుతున్నాయని.. ఇద్దరికీ సరైన భద్రత కల్పించడంలో జగన్ ప్రభుత్వం వైఫల్యం చెందిందంటూ కేంద్రానికి టీడీపీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్ లేఖ రాశారు. ఈ లేఖపై.. కేంద్ర హోంశాఖ స్పందించింది.
రామ్ చరణ్ టాప్ స్టార్ అయిపోయాడు. చిరంజీవి ఫుల్ హ్యాపీ. పెద్ది సక్సెస్ మీట్ లో ఏకంగా న్యూ ఏజ్…
లెనిన్ సూపర్ హిట్టయిపోయింది. బ్లాక్ బస్టర్ దారిలో ఉంది. పదేళ్లకు పైగా విజయం కోసం మొహం వాచిపోయిన అఖిల్ అభిమానులకు…
సినిమాల్లో వేషం కోసం చెన్నయ్ వెళ్లారు.. అభిమాన హీరోని కలిసి ఎందుకు హైదరాబాదు వెళ్లారు.. అనే వార్తలను తరచూ వింటూ…
పోలవరం ప్రాజెక్టును ఆరు నూరైనా పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు శపథం చేశారు. గోదావరి జిల్లాల్లో పర్యటనకు వచ్చిన ఆయన…
అక్కినేని నాగార్జున కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 100వ సినిమా కోసం అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. కానీ…
జూనియర్ ఎన్టీఆర్.. రాజకీయ రంగ ప్రవేశంపై తరచుగా ప్రచారం జరుగుతూనే ఉంది. ఆయనకు అను కూలంగా ఏపీలోనూ కొన్ని ప్రాంతాల్లో…