తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఏ5 నిందితుడిగా ఉన్న శివశంకర్ రెడ్డి బెయిల్ దాఖలకు సుప్రీం కోర్టు అనుమతినిచ్చింది. శుక్రవారం సుప్రీం కోర్టు లో పరిణామం జరిగింది. అయితే ట్రయిల్ కోర్టులో బెయిల్ దాఖలుకు ఎలాంటి అడ్డంకులు లేవని న్యాయస్థానం స్పష్టం చేసింది.
ఏదైనా సందర్భంలో సెప్టెంబర్ వరకు కానీ విచారణ ప్రారంభం కాకపోతే బెయిల్ కు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. గతంలో జస్టిస్ ఎంఆర్ షా నేతృత్వంలోని ధర్మాసనం ఇచ్చిన ఉత్తర్వులను ఇటీవల శివశంకర్ రెడ్డి సుప్రీంలో సవాలు చేశారు. శుక్రవారం జస్టిస్ విక్రమనాథ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది.
ఇదిలా ఉంటే.. వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాశ్రెడ్డికి సీబీఐ కోర్టు సమన్లు జారీచేసింది. ఆగస్టు-14న కోర్టుకు హాజరుకావాలని సమన్లలో కోర్టు పేర్కొంది. వివేకా హత్య కేసులో అనుబంధ ఛార్జిషీట్ను సీబీఐ కోర్టు పరిగణనలోకి తీసుకున్నది. ఎంపీ అవినాష్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి , ఉదయ్ కుమార్ రెడ్డిపై సీబీఐ ఛార్జీషీట్ వేసింది.
కాగా.. వివేకా హత్య కేసులో ఎనిమిదో నిందితుడిగా అవినాశ్ రెడ్డిని సీబీఐ చేర్చిన విషయం తెలిసిందే. గత కొన్ని రోజులుగా స్తబ్దుగా ఉన్న వివేకా హత్య కేసులో ఒక్కసారిగా సీబీఐ కోర్టు నుంచి పిలుపురావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ఆయన్ను సీబీఐ పలుమార్లు ప్రశ్నించింది. అయితే.. ఇప్పటి వరకూ సీబీఐ విచారణకు మాత్రమే పిలిచింది.. ఇప్పుడు కోర్టు సమన్లు ఇవ్వడంతో ఆగస్టు-14న ఏం జరుగుతుందో అని వైసీపీ వర్గాల్లో గుబులు మొదలైందట.
This post was last modified on August 4, 2023 10:57 pm
కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రెసిడెంట్ చేతుల మీదుగా పద్మభూషణ్ పురస్కారం అందుకున్న బాలకృష్ణకు పౌరసన్మాన సభ ఘనంగా జరిగింది. వేలాదిగా…
టీడీపీకి ప్రాణ సమానమైన కార్యక్రమం ఏదైనా ఉంటే.. అది మహానాడే. దివంగత ముఖ్యమంత్రి, తెలుగువారిఅన్నగారు ఎన్టీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకుని..…
మే 9 విడుదల కాబోతున్న సినిమాల్లో సమంత నిర్మించిన శుభం ఉంది. ప్రొడ్యూసర్ గా వ్యవహరించడమే కాదు ఒక క్యామియో…
ప్రధాన మంత్రి నరేంద్రమోడీ రెండు రోజుల కిందటే అమరావతి రాజధాని ప్రాంతంలో పర్యటించారు. రాజధాని పనులకు పునః ప్రారంభం కూడా…
యూత్ ఫుల్ కామెడీ ఎంటర్టైనర్లతో యువ ప్రేక్షకుల్లో మంచి ఫాలోయింగే సంపాదించాడు శ్రీ విష్ణు. గత ఏడాది అతడి నుంచి…
వైసీపీ అధినేత జగన్ మరింత బద్నాం అవుతున్నారా? ఆయన చేస్తున్న పనులపై కూటమి సర్కారు ప్రజల్లో ప్రచారం చేస్తోందా ?…