ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావుకు చెందిన మార్గదర్శి ఫైనాన్షియర్స్, చిట్ఫండ్ కంపెనీ విషయంలో వైసీపీ ప్రభుత్వం అనుకున్న విధంగా ఏమీ జరగలేదా? ఈ విషయంలో ఒక అడుగు ముందుకు రెండు అడుగులు వెనక్కి పడుతున్నాయని పెద్దలు బాధపడుతున్నారా? అంటే.. ఔననే అంటున్నారు వైసీపీ నాయకులు. తాజాగా సుప్రీంకోర్టులోనూ.. సర్కారు తలపెట్టిన కార్యం నెరవేరలేదు.
మార్గదర్శి చిట్ఫండ్ కేసులను ఏపీ పరిధిలోని హైకోర్టులో విచారించేలా ఆదేశించాలని కోరుతూ.. ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. అయితే.. దీనిని సుప్రీంకోర్టు తాజాగా తోసిపుచ్చింది. తెలంగాణ హైకోర్టు నుంచి ఏపీకి కేసుల బదిలీకి అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. మార్గదర్శి కేసులను విచారించే న్యాయపరిధి తెలంగాణ హైకోర్టుకు లేదంటూ వైసీపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను తోసిపుచ్చింది.
“న్యాయ పరిధి విషయాన్ని హైకోర్టులోనే తేల్చుకోవాలి. ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన బదిలీ పిటిషన్లకు కాలం చెల్లాయి. మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్పై ఎలాంటి కఠిన చర్యలూ తీసుకోవద్దని తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేం. మెరిట్స్ ఆధారంగా ఈ కేసును విచారించి నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత తెలంగాణ హైకోర్టుకే ఉంటుంది” అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అయితే.. ఈ విచారణ, సదరు ఆదేశాలపై విస్తృత ధర్మాసనానికి వైసీపీ ప్రభుత్వం రిఫర్ చేయాలని భావిస్తున్నట్టు సమాచారం.
This post was last modified on August 4, 2023 2:57 pm
నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్, బచ్ విల్మోర్ ఎనిమిది రోజుల కోసం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లి, అనుకోని సమస్యల…
టీమ్ ఇండియా స్టార్ బ్యాట్స్మన్ విరాట్ కోహ్లీ, బీసీసీఐ తీసుకున్న కుటుంబ పరిమితి నిబంధనలపై తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. బీసీసీఐ…
నిజమే… నవ్యాంధ్ర ప్రదేశ్ నూతన రాజధాని అమరావతికి సెలవు రోజైన ఆదివారం రూ.11 వేల కోట్ల రుణం అందింది. కేంద్ర…
టీడీపీలో భూమా ఫ్యామిలీకి ఎనలేని ప్రాధాన్యం ఉంది. దివంగత భూమా నాగిరెడ్డి, భూమా శోభా నాగిరెడ్డిలు... ఒకేసారి ఎంపీగా, ఎమ్మెల్యేలుగా కొనసాగారు. అయితే…
మోహన్ లాల్ ఎల్2 ఎంపురాన్ వచ్చే వారం మార్చి 27 విడుదల కానుంది. ఇది ఎప్పుడో ప్రకటించారు. అయితే నిర్మాణ…
ఎలాంటి స్టార్ క్యాస్టింగ్ లేకుండా, పరిచయం లేని జంటను తీసుకుని, విలన్ ని హైలైట్ చేస్తూ ఒక చిన్న బడ్జెట్…