Political News

రమేష్ హాస్పిట‌ల్స్ వివాదం… కులం కార్డుపై టీడీపీ కామెంట్స్

ఏపీలో గ‌త కొద్దిరోజుల‌గా చ‌ర్చ‌నీయాంశంగా మారిన హోటల్ స్వర్ణ ప్యాలస్‌లో జరిగిన ప్రమాదంపై ఘ‌ట‌న‌లో ఇంకా ట్విస్టుల మీద ట్విస్టులు కొన‌సాగుతున్నాయి. ఈ కేసులో ముగ్గురు ఆసుప‌త్రి సిబ్బందిని పోలీసులు అరెస్ట్ చేయ‌గా హాస్పిట‌ల్ ఎండీ ర‌మేష్ బాబు అదృశ్య‌మ‌య్యారు. ఆయ‌న కోసం కొన్ని ప్ర‌త్యేక బృందాలు గాలిస్తున్నాయి. ఇప్పటికే ఈ విష‌యంలో సోష‌ల్ మీడి‌యాలో ప‌లు ర‌కాలుగా చ‌ర్చ జ‌రుగుతోంది. తాజా ఘ‌ట‌న‌లో తెలుగుదేశం పార్టీ ఎంట్రీ ఇచ్చి కుల స‌మీక‌ర‌ణ‌లు, ఇత‌ర అంశాల‌పై స్పందించింది.

టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గొట్టిపాటి రామకృష్ణప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ సంచలన కామెంట్లు చేశారు. స్వర్ణ ప్యాలెస్ ప్రమాద ఘటనలో రమేష్ ఆసుపత్రి నిర్లక్ష్యమే కారణమ‌నే ప్రభుత్వ వాద‌న సరైంది కాద‌ని అన్నారు. స్వర్ణప్యాలెస్‌లో కోవిడ్ కేంద్రం నిర్వహణకు అనుమతి ఇచ్చిన ప్రభుత్వమే అక్కడ జరిగిన ప్రమాదానికి కారణమని ఆరోపించారు. క్వారంటైన్ సెంటర్‌గా ఉన్న స్వర్ణప్యాలెస్‌ను కోవిడ్ సెంటర్‌గా మార్చింది ప్రభుత్వం కాదా? అని ఆయన ప్రశ్నించారు. కోవిడ్ సెంటర్ కి అనుమతులు వ‌చ్చినప్పుడు అందులో సౌకర్యాలు ఉన్నాయో లేదో ప్రభుత్వానికి తెలియదా ? అని ఆయన ప్రశ్నించారు.

ప్రభుత్వం చేస్తున్న అవినీతిని, తప్పులను కప్పిపుచ్చు కోవడానికే వైసీపీ నేతలు కులాల ప్రస్తావన తీసుకొస్తున్నారని టీడీపీ నేత గొట్టిపాటి రామకృష్ణప్రసాద్ మండిప‌డ్డారు. ఒక కులం పేరు చెప్పి, ప్రభుత్వం ఎందుకు రాజకీయాలు చేస్తోందని, తల్లికి బిడ్డకు మధ్య కూడా కులం పేరుతో అభిప్రాయబేధాలు సృష్టించే నీచస్థాయికి ప్రభుత్వం దిగజారిందని ప్ర‌శ్నించారు. అనేక పరిశ్రమల్లో ప్రమాదాలు జరిగితే, అందుకు కారకులైన వారిపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదు? అని ప్రశ్నించిన అయన స్వర్ణప్యాలెస్ లో జరిగిన ప్రమాదానికి నిజంగా ఎవరు కారకులో వారిపై చర్యలు తీసుకోండని అన్నారు.

పూర్తి స్థాయి విచారణ జరపకుండా స్వర్ణప్యాలెస్ ఘటనకు రమేశ్ ను ఎలా బాధ్యులను చేస్తారు? అని టీడీపీ నేత‌ ప్రశ్నించారు. పూర్తి ఆధారాలున్నాకే వైద్యులను అరెస్ట్ చేయాలని సుప్రీంకోర్టు గతంలో చెప్పిందని గుర్తు చేశారు. ప్రభుత్వ చర్యలతో ప్రభుత్వ, ప్రైవేట్ వైద్యులు భయభ్రాంతులతో ప్రజలకు వైద్యం అందించడానికి నిరాకరిస్తున్నారని వాపోయారు.

Satya

Recent Posts

ప్యారడైజ్ విలన్ గురించి ఏమంటున్నారు

నిన్న ది ప్యారడైజ్ నుంచి రాఘవ్ జుయెల్ పోషించిన విక్రమ్ మాలిక్ ఫస్ట్ లుక్ ని టీజర్ రూపంలో టీమ్…

4 minutes ago

సమంత ‘గోల్డు’ గిట్టుబాటు అవుతోంది

నిన్న విడుదలైన మా ఇంటి బంగారంకు మంచి రెస్పాన్స్ వస్తోంది. మెయిన్ సెంటర్స్ థియేటర్లు దాదాపుగా హౌస్ ఫుల్స్ నమోదు…

1 hour ago

శ్రీముఖి భలే ఛాన్స్ పట్టేసింది

నిన్న విడుదలైన మా ఇంటి బంగారంలో మూడు పాత్రలు మహిళా ప్రేక్షకులకు బాగా గుర్తుండిపోయాయి. మొదటి పేరు సమంత అని…

2 hours ago

పబ్లిసిటీ ఇంకాస్త పెరగాలి బాల

నిన్న విడుదలైన కొత్త సినిమాల్లో అతి తక్కువ నోటీస్ తెచ్చుకున్నది మలయాళం డబ్బింగ్ బాలన్ ది బాయ్. అన్నపూర్ణ సంస్థ…

4 hours ago

వైసీపీ స్ట్రాట‌జీ: కాపులతో క‌లివిడా.. విడివిడా?

కాపుల విష‌యంలో ఏం చేయాల‌న్న అంశంపై వైసీపీ త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతోందా? వారితో క‌లిసి ముందుకు సాగాలా? లేక‌.. వారిని…

5 hours ago

అమెరికా-ఇరాన్‌… మిగిల్చిందేంటి?

ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రి 28. ప్ర‌పంచం క‌ళ్లు తెరుస్తున్న స‌మ‌యం. ఊహాతీతంగా.. అన్ని మీడియాల్లోనూ.. అ ప్పటికే.. ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్…

10 hours ago