Political News

రమేష్ హాస్పిట‌ల్స్ వివాదం… కులం కార్డుపై టీడీపీ కామెంట్స్

ఏపీలో గ‌త కొద్దిరోజుల‌గా చ‌ర్చ‌నీయాంశంగా మారిన హోటల్ స్వర్ణ ప్యాలస్‌లో జరిగిన ప్రమాదంపై ఘ‌ట‌న‌లో ఇంకా ట్విస్టుల మీద ట్విస్టులు కొన‌సాగుతున్నాయి. ఈ కేసులో ముగ్గురు ఆసుప‌త్రి సిబ్బందిని పోలీసులు అరెస్ట్ చేయ‌గా హాస్పిట‌ల్ ఎండీ ర‌మేష్ బాబు అదృశ్య‌మ‌య్యారు. ఆయ‌న కోసం కొన్ని ప్ర‌త్యేక బృందాలు గాలిస్తున్నాయి. ఇప్పటికే ఈ విష‌యంలో సోష‌ల్ మీడి‌యాలో ప‌లు ర‌కాలుగా చ‌ర్చ జ‌రుగుతోంది. తాజా ఘ‌ట‌న‌లో తెలుగుదేశం పార్టీ ఎంట్రీ ఇచ్చి కుల స‌మీక‌ర‌ణ‌లు, ఇత‌ర అంశాల‌పై స్పందించింది.

టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గొట్టిపాటి రామకృష్ణప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ సంచలన కామెంట్లు చేశారు. స్వర్ణ ప్యాలెస్ ప్రమాద ఘటనలో రమేష్ ఆసుపత్రి నిర్లక్ష్యమే కారణమ‌నే ప్రభుత్వ వాద‌న సరైంది కాద‌ని అన్నారు. స్వర్ణప్యాలెస్‌లో కోవిడ్ కేంద్రం నిర్వహణకు అనుమతి ఇచ్చిన ప్రభుత్వమే అక్కడ జరిగిన ప్రమాదానికి కారణమని ఆరోపించారు. క్వారంటైన్ సెంటర్‌గా ఉన్న స్వర్ణప్యాలెస్‌ను కోవిడ్ సెంటర్‌గా మార్చింది ప్రభుత్వం కాదా? అని ఆయన ప్రశ్నించారు. కోవిడ్ సెంటర్ కి అనుమతులు వ‌చ్చినప్పుడు అందులో సౌకర్యాలు ఉన్నాయో లేదో ప్రభుత్వానికి తెలియదా ? అని ఆయన ప్రశ్నించారు.

ప్రభుత్వం చేస్తున్న అవినీతిని, తప్పులను కప్పిపుచ్చు కోవడానికే వైసీపీ నేతలు కులాల ప్రస్తావన తీసుకొస్తున్నారని టీడీపీ నేత గొట్టిపాటి రామకృష్ణప్రసాద్ మండిప‌డ్డారు. ఒక కులం పేరు చెప్పి, ప్రభుత్వం ఎందుకు రాజకీయాలు చేస్తోందని, తల్లికి బిడ్డకు మధ్య కూడా కులం పేరుతో అభిప్రాయబేధాలు సృష్టించే నీచస్థాయికి ప్రభుత్వం దిగజారిందని ప్ర‌శ్నించారు. అనేక పరిశ్రమల్లో ప్రమాదాలు జరిగితే, అందుకు కారకులైన వారిపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదు? అని ప్రశ్నించిన అయన స్వర్ణప్యాలెస్ లో జరిగిన ప్రమాదానికి నిజంగా ఎవరు కారకులో వారిపై చర్యలు తీసుకోండని అన్నారు.

పూర్తి స్థాయి విచారణ జరపకుండా స్వర్ణప్యాలెస్ ఘటనకు రమేశ్ ను ఎలా బాధ్యులను చేస్తారు? అని టీడీపీ నేత‌ ప్రశ్నించారు. పూర్తి ఆధారాలున్నాకే వైద్యులను అరెస్ట్ చేయాలని సుప్రీంకోర్టు గతంలో చెప్పిందని గుర్తు చేశారు. ప్రభుత్వ చర్యలతో ప్రభుత్వ, ప్రైవేట్ వైద్యులు భయభ్రాంతులతో ప్రజలకు వైద్యం అందించడానికి నిరాకరిస్తున్నారని వాపోయారు.

This post was last modified on August 17, 2020 10:07 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

నెరవేరిన కల..విశాఖ రైల్వేజోన్ ఏర్పాటు

విశాఖ రైల్వే జోన్..ఉమ్మడి ఏపీ విడిపోయిన తర్వాత రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన కీలక హామీలలో ఒకటి. జగన్ హయాంలో అదిగో…

3 minutes ago

ట్రంప్ న్యూ ట్విస్ట్: గాజా భవిష్యత్తుపై సంచలన వ్యాఖ్యలు

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి అంతర్జాతీయ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారారు. ఇప్పటికే వలసదారులపై కఠిన…

4 minutes ago

నిజంగా అవ‌మానం: మోడీ మిత్రుడు ఇలా చేయ‌డ‌మేంటి?!

అగ్ర‌రాజ్యం అమెరికాలో నూత‌న అధ్య‌క్షుడిగా డొనాల్డ్ ట్రంప్‌ ప‌గ్గాలు చేప‌ట్టిన‌ప్పుడు.. భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ మురిసిపోయారు. "నా ప్రియ…

7 minutes ago

రమేష్ బాబు కామెంట్ – బండ్ల గణేష్ కౌంటర్

ఇవాళ సీనియర్ నిర్మాత, ఫైనాన్షియర్ శింగనమల రమేష్ బాబు ప్రెస్ మీట్ నిర్వహించడం ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తి రేపింది. పధ్నాలుగు…

8 minutes ago

టీడీపీలో ‘మంగ్లి’ మంటలు

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చిన కొన్ని నెలల నుంచి తెలుగుదేశం, జనసేన కార్యకర్తల నుంచి ఒక రకమైన అసంతృప్త…

11 minutes ago

ఓటమి కాస్తా.. ఓదార్పు యాత్ర అయ్యిందే!

తిరుపతి నగరపాలక సంస్థలో మంగళవారం జరిగిన డిప్యూటీ మేయర్ ఎన్నిక పూర్తి అయిపోయిన తర్వాత ఎందుకనో గానీ వైసీపీలో ఏడుపులు,…

24 minutes ago